Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సర్కారు లేఖలపై కేఆర్‌ఎంబీ దృష్టి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 28,2022

సర్కారు లేఖలపై కేఆర్‌ఎంబీ దృష్టి

- నీటి కేటాయింపుల అమలుకు కసరత్తు
- లోపాల సవరణకు ప్రయత్నాలు
నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి-హైదరాబాద్‌
          రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, గతంలోని ట్రిబ్యునళ్ల నీటి కేటాయింపులు, ఇతర సమస్యలపై వరుసగా రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్న లేఖలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) స్పందించింది. సమస్యల పరిష్కారానికి దృష్టిపెట్టినట్టుగా సమాచారం. ఇటీవల కేఆర్‌ఎంబీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) పరిధిలోని ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై పెద్దగా సమస్యలు లేవు. దీంతో దానిపై లేఖలు, ఫిర్యాదులు సర్కారు నుంచి వెళ్లలేదు. అసలు సమస్యంతా కృష్ణా నది పరిధిలోని ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, ఇటీవల కాలంలో ఏపీ చేస్తున్న కొత్త ప్రాజెక్టుల మూలంగా రాష్ట్రానికి ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కి, ఇటు కేఆర్‌ఎంబీకి వరుసగా లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌)పై కూడా ప్రత్యేకంగా కేఆర్‌ఎంబీకి ప్రభుత్వం తరపున రాష్ట్ర సాగునీటి ఆయుకట్టు, అభివృద్ధి శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ లేఖ రాశారు. పాత ట్రిబ్యునల్‌ అయిన బచావత్‌ తీర్పు ప్రకారం నీటి కేటాయింపులు ఉన్నా, అక్కడ లభ్యత లేదనీ, ఉన్న కొద్దిపాటి నీళ్లను నిబంధనలకు విరుద్ధంగా ఏపీతోపాటు పక్కనున్న కర్నాటక అధికంగా తరలించుకుపోతున్నదనే వివరాలతో సుదీర్ఘంగా లేఖలు రాశారు. అంతేగాక ఏపీ గురు రాఘవేంద్రతోపాటు మరో 13 చిన్నతరహా ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టినట్టు ఫిర్యాదు చేసిన విషయమూ విదితమే. ఈనేపథ్యంలో కేఆర్‌ఎంబీ ఇటీవల పలుమార్లు భేటి అయింది. అటు ఏపీ, ఇటు తెలంగాణతోపాటు కర్నాటక ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలను సైతం సమీక్ష చేసినట్టు సమాచారం. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును మరోసారి అధ్యయనం చేసినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం కేటాయింపుల అమలుకు చేపట్టాల్సిన చర్యలపై కేఆర్‌ఎంబీ దృష్టిపెట్టింది. మూడు రోజుల క్రితం జరిగిన కేఆర్‌ఎంబీ భేటిలో కృష్ణా జలాల వివాదాలపై చర్చించినట్టు సమాచారం. ఆ సందర్భంగా ఆర్టీఎస్‌ ఆనకట్ట, హెడ్‌రెగ్యులేటర్‌కు మార్పులు చేయాలనీ, నదీ ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదలచేసినప్పుడు రెండు రకాల విధానాలను అనుసరించాలనీ, మొత్తం వ్యవహారంపై ఆరు నెలల్లో అధ్యయనం చేయాలనీ, ఇందుకు అవసరమయ్యే నిధులను మూడు రాష్ట్రాలు భరీంచేలా ప్రణాళికను సిద్ధం చేసినట్టు సమాచారం. పనులు మాత్రం కర్నాటక సర్కారుతో చేయించేలా ఆదేశాలు జారీచేయనుంది. వచ్చే జూన్‌ నుంచి తాజా నిర్ణయాలు అమలయ్యేలా చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా నీటి నిల్వ, లభ్యత ఆధారంగా వానాకాలం, యాసంగి సీజన్లల్లో ఏ రాష్ట్రానికి ఎంత నీరు అందుబాటులో ఉంటుందో తుంగభద్ర బోర్డు ముందస్తు సమాచారం ఇచ్చేలా కూడా సూచనలు చేసినట్టు అధికారులు అంటున్నారు. ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందించి మూడు రాష్ట్రాలకు పంపించడంతోపాటు, దాన్ని అమలుకు పక్కాగా చర్యలు తీసుకోవాలని కేఆర్‌ఎంబీ భావిస్తున్నట్టు తెలిసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.