Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ముస్లింలకిచ్చిన హామీల అమలెక్కడ? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 28,2022

ముస్లింలకిచ్చిన హామీల అమలెక్కడ?

- సీఎం కేసీఆర్‌కు ముస్లిం సంఘాల
- జేఏసీ రౌండ్‌టేబుల్‌ ప్రశ్న
- 30న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు...
- సీఎం కేసీఆర్‌కు ముస్లిం సంఘాల జేఏసీ రౌండ్‌టేబుల్‌ ప్రశ్న
- 30న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
        ముస్లింలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని ముస్లిం సంఘాల జేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రశ్నించింది. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా, ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం నుంచీ పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయనీ, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 30న జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ముస్లిం సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో 'కేసీఆర్‌ ముస్లింలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?' అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అబ్బాస్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ సమావేశానికి తెలంగాణ యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీంపాషా అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి, రచయిత స్కైబాబ (యూసుఫ్‌షేక్‌), తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్‌ ఫయాజుద్దీన్‌, అన్వర్‌ఖాన్‌ (ఎస్సీఎస్టీ మైనార్టీ ఫోరం), అఫ్సర్‌జాహ (హమ్‌ ఫౌండేషన్‌), సారామాథ్యూ (సామాజిక కార్యకర్త), షాబాజ్‌ అలీఖాన్‌ (టీజేఏసీ), ఖరీద్దీన్‌మౌలానా (సూఫీ ఉలేమా కౌన్సిల్‌), ముస్తాక్‌ సాహెబ్‌, హనీఫ్‌, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు దఫాల ఎన్నికల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని చెప్పారు. కేవలం అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసి చేతులు దులుపుకుంటే ఎనిమిదేండ్లుగా నష్టపోయిన అగాధాన్ని ఎలా పూడుస్తారని ప్రశ్నించారు. కేంద్రం అంగీకరించదని అందరికీ తెలుసుననీ, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఆక్షేపించారు. 12 శాతం రిజర్వేషన్‌ ఎనిమిదేళ్లుగా కల్పించకపోవడం వల్ల ఉద్యోగ నియామకాల్లో ముస్లిం నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్‌ బోర్డుకు జ్యూడీషియల్‌ పవర్‌ కల్పించాలనీ, వక్ఫ్‌ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే దాదాపు 7వేల ఎకరాలకు పైగా వక్ఫ్‌భూమి కబ్జాలకు గురైందని ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తుచేశారు. మైనారిటీ కమీషన్‌, వక్స్‌ బోర్డు, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, ఉర్దూ అకాడమీ, హజ్‌ కమిటీలకు పూర్తి స్థాయి పాలక మండళ్లను వెంటనే నియమించాలని కోరారు. సుధీర్‌ కమీషన్‌ సూచించిన మైనారిటీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం ముస్లిం మైనారిటీకి కేటాయించాలనీ, మైనారిటీ బడ్జెట్‌ను రూ. 5 వేల కోట్లకు పెంచాలని కోరారు. మైనారిటీ బంధు పథకాన్ని అమలు చేయాలనీ, ఉర్దూ మీడియం స్కూల్స్‌, కాలేజీల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌ లాగ్‌ పోస్టులను డీ నోటిఫై చేసి తిరిగి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్టీ-2017లో పెండింగ్‌లో ఉన్న 558 ఉర్దూ మీడియం టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం బోర్డులో పర్మనెంట్‌ సిబ్బందిని నియమించానీ, తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)లో ముస్లిం మైనారిటీకి అవకాశం ఇవ్వాలని చెప్పారు. యూనివర్సిటీల్లోని వైస్‌ ఛాన్సలర్‌ పదవుల్లో ఒక్క ముస్లిం ప్రొఫెసర్‌కు కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. కనీసం రిజిస్ట్రార్లు, ఓఎస్డీలుగా అయినా ముస్లిం ప్రొఫెసర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలనీ, కార్పోరేషన్‌ ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణాలను రూ. 10 లక్షలకు పెంచాలనీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కేటాయింపులో ముస్లింలకు 12 శాతం ప్రత్యేక కోటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 30న కలెక్టర్‌ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలనీ, ఆ ఆందోళనా కార్యక్రమం తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో దాదాపు 40 ముస్లిం సంఘాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.