Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మిక చట్టాల రద్దు.. భవన నిర్మాణ కార్మికుల ఇక్కట్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 28,2022

కార్మిక చట్టాల రద్దు.. భవన నిర్మాణ కార్మికుల ఇక్కట్లు

- సీకు, సిమెంట్‌, డీజిల్‌, తదితరాల ధరలపై కేంద్రం నియంత్రణ కరువు
- దీంతో తగ్గుతున్న నూతన నిర్మాణాలు
- ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులు
- అడ్డా ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువు
- రెండు రోజుల సమ్మెలోకి భవన నిర్మాణ కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
                 అందమైన అద్దాల మేడలను కట్టే భవన నిర్మాణ కార్మికుల బతుకులు గుడిసెల్లో మగ్గుతున్నాయి. రంగులేసి ఇంటికి వన్నెలద్దె కార్మికుల జీవితాల్లో చీకట్లు ఆవరిస్తున్నాయి. పొట్టకూటి కోసం పట్నమొచ్చి అడ్డాలమీద పనికోసం ఆశగా ఎదురుచూసే వేలాది మందిలో పని దొరికేది వందల మందికే. మిగతా కుటుంబాలన్నింటికీ ఆరోజు పస్తులే. మేస్త్రికి రోజుకు వెయ్యిరూపాయలంట..గాళ్లదే మంచిగున్నదని అనుకునేటోళ్లేగానీ అతనికి నెలకు పది, పదిహేను రోజులకు మించి పనిదొరకదనే విషయాన్ని ఎరుగట్లేదు. అందులోనూ పెట్రోల్‌కే రోజుకు ఓ రెండొందలు ఖర్చు. రెక్కలు అరుగంగ కష్టం చేసినా పూట గడువటం కష్టమే. అడ్డాల వద్ద గంటల తరబడి నిలబడలేక, ఇతర సమస్యలతో మహిళా కూలీలు పడే వ్యథలు అన్నీఇన్నీ కావు. మాకంటూ కొన్ని చట్టాలుంటే ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఏండ్ల తరబడి కొట్లాడగా వచ్చిన మూడు చట్టాలనూ మోడీ సర్కారు రద్దు చేసి వాల్ల నోట్లో మన్నుగొట్టింది. ధరలమీద మోడీ సర్కారు నియంత్రణలేమితనంతో నిర్మాణ రంగం కుదేలై భవన నిర్మాణ కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు తమ హక్కుల కోసం గళమెత్తుతూ రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో పాలుపంచుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
                 రాష్ట్రంలో 21 లక్షల వరకు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులున్నారు. వీరిలో సగానికిపైగా వలస కార్మికులే. ఎనిమిది లక్షల మంది మహిళా కార్మికులున్నారు. వీరిలో 80 శాతం మంది అడ్డాకూలీలే. వీరికి రోజుకు రూ.500 నుంచి రూ.1000 కూలి దక్కుతున్నది. అయితే, వలస కార్మికులు కాంట్రాక్టర్లు రోజుకు రూ.300-400కి మించి ఇవ్వడం లేదు. కరోనా, నిర్మాణరంగంలో వాడే సీకు, సిమెంట్‌, ఇతర వస్తువుల ధరలు ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి. సిమెంట్‌ బస్తా రూ.350 నుంచి రూ.450(బ్రాండ్లను బట్టి) దాకా చేరింది. టన్ను ఐరన్‌ 85 వేలు అయింది. దీంతో బిల్డర్లు నిర్మాణాలను తగ్గిస్తున్నారు. అదే సమయంలో వ్యయాన్ని తగ్గించుకునేందుకు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు బిల్డర్లు ఇచ్చేస్తున్నారు.
తగ్గుతున్న కూలి, పనిదినాలు...పెరుగుతున్న రోగాలు
                 రాష్ట్రంలో ఏటేటా పెరిగిపోతున్న నిరుద్యోగులు, బీహార్‌, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌, తదితర రాష్ట్రాల నుంచి వలసొస్తున్న వారితో భవన నిర్మాణ కార్మికులపై ప్రభావం పడుతున్నది. గతంలో వారానికి నాలుగైదు రోజుల పనిదొరికేది. ప్రస్తుతం వారంలో రెండు, మూడు రోజులే దొరుకుతున్నది. ఎక్కువ సంఖ్యలో కూలీలు అడ్డాల మీదకు వస్తుండటంతో పెద్ద మేస్త్రీలు, నిర్మాణదారులు కూలి తగ్గించుకుంటేనే పనికి తీసుకెళ్తున్నారు. వెయ్యిరూపాలిచ్చేకాడ రూ.700 నుంచి రూ.800 మాత్రమే ఇస్తున్నారు. 50 ఏండ్లు నిండిన వారు వేగంగా పనిచేయరని పిలవట్లేదు. అడ్డాల్లో, పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేక కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అక్కడ కనీసం నిలబడేందుకు నిలువునీడలేని పరిస్థితి. మహిళా కూలీలైతే బయటికెళ్తే బాత్‌రూమ్‌ ఉండని పరిస్థితుల్లో నీళ్లు తాగటమే తగ్గించేస్తున్న పరిస్థితి ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనిదినాలను కోల్పోయి అభద్రతకు గురవుతున్నారు. దీనికితోడు రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలి
                 కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం తీసుకొచ్చిన మూడు చట్టాలను నిర్వీర్యం చేయటం దారు ణం. పెద్దపెద్ద భవన నిర్మాణాల నుంచి సెస్‌ను వసూలు చేయడం నామమాత్రంగా జరుగుతున్నది. చాలా మేరకు కట్టట్లేదు. భవననిర్మా ణ కార్మికులందరికీ వేల్పేర్‌ బోర్డులో సభ్యత్వం కల్పిస్తామని చెప్పిన మాట లు నీటిమీది రాతల్లాగే మిగిలాయి. అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించాలనే నిబంధన బుట్టదాఖలైంది.పింఛన్ల కోసం ఆరు లక్షల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. హక్కులను కాపాడుకోవడం కోసమే సమ్మెలోకి వెళ్తున్నాం.

-  ఆర్‌. కోటం రాజు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.