Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కలిసికట్టుగా హక్కుల్ని కాపాడుకుంటాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 29,2022

కలిసికట్టుగా హక్కుల్ని కాపాడుకుంటాం

- కార్మిక కోడ్‌లను రద్దు చేయకుంటే కర్రుకాల్చి వాతపెడతాం
- అవినీతికి మూలం ప్రయివేటీకరణ
- కార్పొరేట్ల ధనంతోనే బీజేపీ గెలుపు
- అందుకే వారికనుగుణంగా పాలన: ఆర్‌ఎల్‌సీ కార్యాలయం వద్ద సమ్మె సభలో కార్మిక సంఘాల నేతలు
- వందలాదిగా తరలొచ్చిన కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
         కార్మిక కోడ్‌లను రద్దు చేయకుంటే కార్మికులంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెడతారని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. అవినీతికి మూలం ప్రయివేటీకరణ అనీ, మోడీ సర్కారేమో దానికే పెద్దపీట వేస్తున్నదనివిమర్శించారు. కార్పొరేట్లు తమకొచ్చే లాభాల్లో ఇచ్చే వాటా ధనంతోనే ప్రజల్ని మభ్యపెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే వారికనుగుణంగా పాలన చేస్తున్నదని తెలిపారు. కేంద్ర అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యపోరాటాల ద్వారా అడ్డుకుంటామని ప్రకటించారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కోడ్‌లను తిప్పికొట్టి హక్కుల్ని కాపాడుకుంటామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ కార్యాలయం ముందు కార్మిక సంఘాల నగర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో సమ్మె సభను నిర్వహించారు. ఎర్రజెండాలు, ప్లకార్డులు చేతపట్టి వందలాది మంది కార్మికులు తరలొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ బోస్‌, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, ఏఐయూటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాబూరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.జనార్ధన్‌ మాట్లాడారు. దేశభక్తి ముసుగులో అధికారంలోకి వచ్చిన బీజేపీ..కార్పొరేట్ల మేలు కోసం తన భక్తిని చాటుకుంటున్నదని విమర్శించారు. దేశభక్తిపేరుతో దేశ సంపదను కాజేస్తున్నదనీ, దీనికి అడ్డువేసేందుకు కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా మోడీ సర్కారు మాత్రం అమలు చేయట్లేదని విమర్శించారు. చట్టాలను, కోర్టులను గౌరవించని మోడీసర్కారు వెంటనే గద్దె దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేశారనీ, కేంద్రం చేతులెత్తేస్తే కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకుని నడుపిస్తున్నదని చెప్పారు. ఆ రెండు ప్రభుత్వాలకు సాధ్యమైన పని మోడీ సర్కారుకు ఎందుకు కాదని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులను, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక కోడ్‌లను రద్దు చేయకపోతే కార్మికవర్గం కర్రుకాల్చి వాతపెడుతుందని హెచ్చరించారు. ఏడుగురు కార్మికులుంటే సంఘం పెట్టుకోవచ్చనేదాన్ని కాలరాసే హక్కు మోడీ సర్కారుకు ఎక్కడిదని నిలదీశారు. 8 గంటల పనివిధానాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కుట్రను తిప్పికొడతామన్నారు. ఒకే పనిచేసే కానిస్టేబుళ్లు-హోంగార్డులకు, ఆశాలు-నర్సులకు, రెగ్యులర్‌ ఉద్యోగులకు-కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల్లో భారీ వ్యత్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. కనీసవేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి ఎం. వెంకటేశ్‌, సీఐటీయూ నాయకులు కుమారస్వామి, ఆర్‌.వాణి, టి.పుల్లారావు, రాములు, అశోక్‌, ఐఎఫ్‌టీయూ నేత అనురాధ, ఏఐటీయూసీ నాయకులు కె.యాదగిరి, ప్రేంపావని, జ్యోతి, మదన్‌సింగ్‌, లక్ష్మి, ఐఎఫ్‌టీయూ నేతలు ఎస్‌ఎల్‌ పద్మ, శ్రీనివాస్‌, కిరణ్‌, నల్లన్న, హెచ్‌ఎంఎస్‌ నాయకులు భాగ్యవతి, మహ్మద్‌ అంజద్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.