Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్టీసీ బస్సు రూటెటు? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 29,2022

ఆర్టీసీ బస్సు రూటెటు?

- సంస్థలోకి మరో రిటైర్డ్‌ ఐపీఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు
- సెస్‌ల పేరుతో టిక్కెట్‌పై రూ.10 అదనంగా బాదుడు
- ప్రయాణీకులపై ఏటా 1,800 కోట్ల భారం
- కొత్తగా ఇన్ఫర్మేషన్‌ సెస్‌ ప్రతిపాదన
- హైదరాబాద్‌లోనూ టోల్‌చార్జీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
       ఆర్టీసీ బస్సు గమ్యంలేని రూట్లలో ప్రయాణిస్తోంది. ఆదాయం కోసం ప్రయాణీకులపై అదనంగా ఏమేం భారాలు వేయోచ్చో మేథోమధనం చేస్తోంది. రోజువారీగా పెరుగుతున్న డీజిల్‌ భారం ఆర్టీసీకి గుదిబండగా మారింది. ఆ భారాన్ని భరించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వీసీ సజ్జనార్‌, చైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్థన్‌ను నియమించి సర్కారు చేతులు దులుపుకుంది. సంస్థ మనుగడను పూర్తిగా వారి చేతుల్లో పెట్టి...'నీట ముంచినా...పాలముంచినా మీదే భారం' అన్నట్టు వదిలేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌...బడ్జెటేతర సహాయం అంటూ రూ.3వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2022-24 ఆర్థిక సంవత్సరానికి సంస్థకు రీయింబర్స్‌మెంట్‌, ప్రభుత్వ గ్యారెంటీ రుణాల చెల్లింపుల కోసం కేవలం రూ.1,500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీనితో సర్కారు నుంచి తమకు ఎలాంటి సహకారం లభించదని సంస్థ ఎమ్‌డీ, పాలకమండలికి స్పష్టత వచ్చేసింది. టిక్కెట్‌ మూల చార్జీలను పెంచాలనే ప్రతిపాదనా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దానికీ గ్రీన్‌ సిగల్‌ లభించలేదు. ఇక లాభంలేదనుకున్న మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేంద్రప్రభుత్వం తరహాలోనే 'సెస్‌'ల పేరుతో ప్రయాణీకులపై భారం వేసేందుకు నిర్ణయాలు తీసేసుకున్నారు. చిల్లర సమస్యల, చార్జీల హేతుబద్ధీకరణ పేరుతో టిక్కెట్లను రూ.5-10 డినామినేషన్లలోకి మార్చేశారు. ఫలితంగా టిక్కెట్‌ రేట్లు పెరిగాయి. దీన్ని బేస్‌ చేసుకొని బస్‌పాస్‌ ధరలను రూ.200 నుంచి రూ.500 వరకు పెంచేశారు. అక్కడితో ఆగకుండా గతం ప్యాసింజెర్‌ సెస్‌ ఒక్క రూపాయి ఉండేది. దీన్ని ఐదు రూపాయలకు పెంచారు. టోల్‌గేట్‌ చార్జీని ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా రెండు రూపాయలు పెంచారు. చిత్రంగా టోల్‌ చార్జీని హైదరాబాద్‌ సిటీ బస్సులకూ వర్తింపచేశారు. దీనితోపాటు కొత్తగా సేఫ్టీ సెస్‌ పేరుతో మరో రూపాయి భారం మోపారు. టిక్కెట్‌ మూల ధరను పెంచకుండానే వివిధ పేర్లతో ఒక్కో ప్రయాణీకుడిపై కనిష్టంగా రూ.10 భారం మోపారు. ఆర్టీసీ బస్సుల్లో రోజువారీగా దాదాపు 55 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తారని అంచనా. అంటే నెలకి దాదాపు రూ.150 కోట్లు చొప్పున ఏడాదికి రూ.1,800 కోట్ల భారం ఆర్టీసీ ప్రయాణీకులపై పడుతున్నదని రవాణారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో టీఎస్‌ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలనే కార్మిక సంఘాల డిమాండ్‌ను పట్టించుకోని ప్రభుత్వం దొడ్డిదారిలో ఈ తరహా భారాలు మోపుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే కార్మికుల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌)ను యాజమాన్యం తోసిపుచ్చలేదు. అవసరమైన చోట్ల దాన్ని అమలు చేస్తామని స్వయంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ప్రకటిం చడం గమనార్హం. ఉన్న బస్సులకు జీపీఎస్‌ సిస్టం అమలు చేస్తూ ఇన్ఫర్మేషన్‌ సెస్‌ పేరుతో మరో రూపాయి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించిన ట్టు తెలిసింది.అలాగే రూట్లు, సర్వీసుల కుదింపు అంశం కూడా చర్చనీయా ంశంగా ఉంది. కొత్త బస్సులు కొనకుండా, ఉన్న బస్సులతోనే లాభాలు ఆర్జించడం ఎలా అనే దానిపైనే యాజమాన్యం దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.
కొత్తగా రిటైర్డ్‌ ఐపీఎస్‌...
       తాజాగా ఈ తరహా విధాన నిర్ణయాల అమలు కోసం టీఎస్‌ఆర్టీసీలోకి మరో రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌కు కీలకబాధ్యతలు అప్పగిస్తూ సోమవారం సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రిటైర్ట్‌ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ వీ రవీందర్‌ను టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా నియమించారు.
       ఈ పోస్టు ఆర్టీసీలో లేదు. కేవలం సదరు రిటైర్డ్‌ ఐపీఎస్‌ కోసమే సృష్టించినట్టు సమాచారం. ఎమ్‌డీ తీసుకొనే కీలక నిర్ణయాల అమలు బాధ్యత సదరు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిదేనని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. దానితో పాటు సంస్థలోని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, హెచ్‌ఓడీలు, రీజినల్‌ మేనేజర్లకు మధ్య ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తూ, ఎమ్‌డీ తీసుకొనే నిర్ణయాలకు అనుసంధానకర్తగా పనిచేస్తారు. ఆయనకు దాదాపు రూ.1.10 లక్షల నెలజీతం ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.