Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహేశ్‌బ్యాంకు నిర్లక్ష్యం వల్లే హ్యాకింగ్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 31,2022

మహేశ్‌బ్యాంకు నిర్లక్ష్యం వల్లే హ్యాకింగ్‌

- బ్యాంకులకు సైబర్‌ ముప్పు
- సాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్‌పై అనుమానం
- నిందితులను పట్టుకోవడానికి ఇంటర్‌పోల్‌ సాయం : సీపీ సీవీ ఆనంద్‌
నవతెలంగాణ- సిటీబ్యూరో
       'బ్యాంకులకు సైబర్‌ ముప్పు పొంది. సైబర్‌ సెక్యూరిటీపై మహేష్‌బ్యాంకు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోంది. ఆర్‌బీఐ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. ఈ బ్యాంకు సాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్‌ ఇన్‌ఫ్రాసాఫ్ట్‌పై అనుమానాలు ఉన్నాయి. నిందితులు ఎక్కడ ఉన్నారో ఆచూకీ లేదు. వాళ్లను పట్టుకోవడానికి ఇంటర్‌పోల్‌ సాయం తీసుకుంటాం. ఈ కేసును విచారించడానికి టీఏ, డీఏల కోసం ఇప్పటి వరకు రూ.58 లక్షలు అయింది' అని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. బుధవారం సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మహేశ్‌బ్యాంక్‌ హ్యాకింగ్‌పై వివరించారు. తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకులోనూ రూ.1.90 కోట్ల కుంభకోణానికి మహేశ్‌ బ్యాంకు సంఘటనకు లింకు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. మహేశ్‌ బ్యాంకులో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులకు హ్యాకర్స్‌ లింకు పంపించారని, వీరిలో ఇద్దరు లింకు ఓపెన్‌ చేయడంతో బ్యాంకుకు సంబంధించిన వివరాలన్నీ హ్యాకర్‌ చేతిలోకెళ్లాయని తెలిపారు. దీంతో బ్యాంకు అధికారులు ఏపని చేసినా హ్యాకర్లు నేరుగా చూస్తారని చెప్పారు. ఏ బ్యాంకులోనైనా మాస్టర్‌ అడ్మిన్స్‌ ఇద్దరు మాత్రమే ఉంటారని, ఇక్కడ మాత్రం 10మంది ఉన్నారని అన్నారు. వీరందరికీ కామన్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉండటంతోపాటు సింగిల్‌ నెట్‌వర్క్‌, లోకల్‌ ఏరియా కనెక్షన్‌ ఒకటే ఉండటంతో సులభంగా హ్యాకింగ్‌ జరిగిందన్నారు. బ్యాంకుల సాఫ్ట్‌వేర్‌ స్ట్రాంగ్‌ఫైర్‌వాల్స్‌, ఇంట్రోజెన్‌ ప్రివెంటీవ్‌ సిస్టం ఉండాలని, కానీ మహేశ్‌ బ్యాంకులో ఇవేవీ లేకపోవడంతో హ్యాకింగ్‌ జరిగిందని అన్నారు.
రూ.10 లక్షలతో ముంబయికి చెందిన ఇన్‌ఫ్రాసాఫ్ట్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చిందని, ఇది నాసిరకంగా ఉందని తెలిపారు. మహేశ్‌ బ్యాంకులో రూ.12.48 కోట్లు కొల్లగొట్టడానికి నాలుగు ఫేక్‌ అకౌంట్లను సృష్టించారని, వీటిలో సాన్విక ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా రూ.4,00,40,361, షహనాజ్‌బేగం అకౌంట్‌ ద్వారా రూ.3,59, 55,390, హిందూస్తాన్‌ ట్రేడర్స్‌ (వినోద్‌రాటి) ద్వారా 4,83,25,985, సంపత్‌కుమార్‌ ద్వారా 4,99,999 కాజేశారని తెలిపారు. ఈ నాలుగు అకౌంట్ల ద్వారా దేశవ్యాప్తంగా ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, వెస్ట్‌బెంగాల్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 115 వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి మరో 398 అకౌంట్లను సృష్టించారని వివరించారు. షహనాజ్‌బేగం అనే వ్యక్తికి గోల్కొండలో సొంతిల్లు ఉందని, ఆమె ఎక్కువగా ముంబయిలో ఉంటున్నట్టు తెలిసిందని అన్నారు. సంపత్‌కుమార్‌ను స్టీఫెన్‌ఒరీ కలిసి బ్యాంకు లావాదేవీలు చేశారని, అందుకు సంపత్‌కుమార్‌కు రూ.5లక్షల కమీషన్‌ ఇచ్చారని, లబ్దిదారుని వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఒర్జీకి మనీ ట్రాన్స్‌ఫర్‌ కాలేదని అన్నారు. బ్యాంకుల నిబంధనలపై ఆర్‌బీఐ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లేదని, ఈ విషయంపై బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. హ్యాంకింగ్‌ విషయంలో ప్రధాన నిందితుడికి సహకరించిన స్టీఫెన్‌ ఒర్జి అనే వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులకు ప్రశంస పత్రాలు ఇస్తామని సీపీ తెలిపారు. ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, నెట్‌బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.