Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎంజీఎం ఐసీయూలో ఎలుకలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 01,2022

ఎంజీఎం ఐసీయూలో ఎలుకలు

- రోగి కాళ్లు, వేళ్లు కొరికిన వైనం
- సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం
- సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
- గతంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు
- ఇద్దరు వైద్యుల సస్పెన్షన్‌
నవతెలంగాణ-మట్టెవాడ
          వరంగల్‌ ఎంజీఎం ఆర్‌ఐసీయూలో ఎలుకలు కలకలం సృష్టించాయి. సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చికిత్స పొందుతున్న రోగి కాలు, చేతిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సీరియస్‌ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించి.. సూపరింటెండెంట్‌ను బదిలీ చేశారు. గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
          హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని రోజులు ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందినా తగ్గకపోగా.. ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో ఈనెల 27న ఎంజీఎంలో చేర్చారు. ఆర్‌ఐసీయూలో ఉంచి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం రాత్రి శ్రీనివాస్‌ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో కట్టు కట్టారు. గురువారం ఉదయానికి ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడిమ వద్ద కూడా ఎలుకలు కొరకడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. దీనిపై కుటుంబసభ్యులు ఆందోళన చెంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వరంగల్‌ అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీవాత్సవ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకొని ఆర్‌ఐసీయూలోని బాధితుడిని పరిశీలించారు. అధికారులను తీవ్రంగా మందలించారు. దీనిపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించడం లేదని సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు చెప్పారు. ఆర్‌ఐసీయూ పురాతన భవనంలో ఉండటం వల్ల ఎలుకల బెడద ఉండి ఉంటుందన్నారు. ఆర్‌ఐసీయూ పక్కనే వంటగది ఉండటం ఒక కారణం కావచ్చని చెప్పుకొచ్చారు. అయితే, సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
          ఎంజీఎం ఘటనను ప్రభుత్వం వెంటనే సీరియస్‌గా తీసుకుంది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేదిక రూపంలో పంపించాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాంతో వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిపతులు ఆర్‌ఐసీయు, ఆస్పత్రి ప్రాంగణం అంతా పరిశీలించారు. ఘటనకు కారణాలను ఆరా తీసిన విచారణ అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఎంజీఎం సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావును బదిలీ చేయడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు వైద్యులను సస్పెండ్‌ చేసింది. గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
అడుగడుగునా నిర్లక్ష్యం
          ఎంజీఎం ఆస్పత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎలుకల దాడి జరిగిన భవనం ఎమర్జెన్సీ విభాగం పై అంతస్తులో ఉంటుంది. ఎంజీఎం సూపరింటెండెంట్‌ చెప్పినట్టుగా పురాతనమైనది కాదు. ఈ భవనం నిర్మించి రెండు దశాబ్దాలు కూడా పూర్తి కాలేదు. బిల్డింగ్‌కు ఎటువంటి కన్నాలూ లేవు. అయినప్పటికీ ఎలుకలు ఎలా వస్తున్నాయి వాటిని ఎలా నిర్మూలించాలని పట్టించుకునే నాధుడే లేడు. పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ వెనుక వైపున ఆర్‌ఐసీయులోని మూత్రశాలల నుంచి కిందికి వచ్చే పైపుల వద్ద ఎలుకలు భారీ కన్నాలు చేశాయి. వాటిని పూడ్చకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.