Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హిందూ దేశంగా మార్చడమే విద్య కాషాయీకరణ లక్ష్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 01,2022

హిందూ దేశంగా మార్చడమే విద్య కాషాయీకరణ లక్ష్యం

- మానవాళికి పనికొచ్చేది హేతువాదం
- బీజేపీ నాయకులు చెప్పేది 'హేటు'వాదం
- అబద్ధపు ప్రచారాలతో కొనసాగుతున్న పాలన
- ఎస్వీకే వెబినార్‌లో ప్రొఫెసర్‌ దేవరాజు మహారాజు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            భారత్‌ను హిందూ దేశంగా మార్చడమే విద్య కాషాయీకరణ లక్ష్యమని కేంద్ర సాహిత్య అకాడమి గ్రహీత, ప్రొఫెసర్‌ దేవరాజు మహారాజు చెప్పారు. విద్య కార్పొరేటీకరణ అంటే ఈ దేశాన్ని, విద్యారంగాన్ని విదేశీ కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడమేనని అన్నారు. విద్య కేంద్రీకరణ అంటే బీజేపీ గుప్పిట్లోనే ఆ రంగం ఉండాలన్న అభిప్రాయముందన్నారు. 'విద్య కాషాయీకరణ దేని కోసం'అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో గురువారం వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన వక్తగా మాట్లాడుతూ విద్య కాషాయీకరణ, హిందూదేశంగా మార్చడమనే ప్రయత్నాలు అయిదారేండ్ల నుంచి కాకుండా స్వాతంత్య్రానికి ముందు నుంచి జరుగుతున్నాయని వివరించారు. అందులో హేతుబద్ధత లేదన్నారు. మూఢత్వం మాత్రమే ఉందని చెప్పారు. సర్వ మానవాళికి పనికొచ్చేది హేతువాదమని అన్నారు. కానీ బీజేపీ నాయకులు 'హేటు'వాదం (శత్రువులుగా చూడడం) గురించి చెప్తున్నారని విమర్శించారు. విద్య కాషాయీకరణలో భాగంగా ఆరు నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను ప్రవేశపెడుతున్నట్టు గుజరాత్‌ మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ దేశాన్ని 300 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లడానికి ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు. విద్యావంతులు మూర్ఖుల్లా, మూఢవిశ్వాసాలతో వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీలు ముఖ్యం కాదనీ, విజ్ఞానం ప్రధానమని అన్నారు. ప్రతి ఒక్కరూ సైన్స్‌, కామన్‌సెన్స్‌తో ఆలోచించాలని సూచించారు. పురాణాల్లో రాముడు, రావణుడు కల్పిత పాత్రలని అన్నారు. అసంబద్ధ ప్రకటనలతో బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏది నిజమో, ఏది అబద్ధమో ప్రజలు ఆలోచించాలని కోరారు. గతంలో తెలుగువాచకంలోనే మతపరమైన అంశాలుండేవని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లోనూ అవి ఉంటున్నాయని వివరించారు. వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ జరిగిందంటూ ప్రధానమంత్రి మోడీ వంటి వారు ప్రసంగిస్తున్నారని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో విశ్వానికి సంబంధించిన పరిజ్ఞానం తెలుసుకోవాలని అన్నారు. జ్యోతిష్యం, మూఢత్వం పెంచే పాఠ్యాంశాలను చేర్చడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకుపోదామా?, పురాణాల స్ఫూర్తితో ముందుకుపోదామా?అని ప్రశ్నించారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలతోపాటు హిందూ దేవాలయాలను ముస్లిం రాజులతోపాటు ఈ దేశంలోని హిందూ రాజులు దాడి చేసి ఆస్తులను దోచుకున్నారని వివరించారు. కశ్మీర్‌ఫైల్స్‌ సినిమాను చూడాలని ప్రధానిస్థాయి వ్యక్తి చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
            వ్యాపారం కోసం కాకుండా ఆ సినిమా ద్వారా వచ్చే డబ్బును కశ్మీర్‌ పండితుల పునరావాసానికి వినయోగించాలంటూ చెప్పిన కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేశారని చెప్పారు. అబద్ధాలతో, అర్ధసత్యాలతో కశ్మీర్‌ఫైల్స్‌ సినిమా తీశారని విమర్శించారు. కిసాన్‌ఫైల్స్‌, గుజరాత్‌ఫైల్స్‌, ఢిల్లీఫైల్స్‌, సీఏఏ ఫైల్స్‌, డీమానిటైజేషన్‌ ఫైల్స్‌ వంటి సినిమాలు తీయాల్సిన అవసరముందన్నారు. ప్రజాబలం ముందు ఎంతటి నియంత అయినా నిలబడలేరని అన్నారు. రైతులు అచంచల విశ్వాసంతో చేసిన ఉద్యమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిరాకతప్పలేదని గుర్తు చేశారు. వివేకం ముందు మూర్ఖత్వం నిలబడలేదని చెప్పారు. జై శ్రీరాం అంటూ నినాదాలిస్తే దేశభక్తులు కాబోరని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే అన్నారని గుర్తు చేశారు. భారత్‌ ఎప్పటికీ విశ్వగురు కాదు, కాలేదన్నారు. పూజల వల్ల, శ్లోకాల వల్ల మనుషులను బతికించలేమని అన్నారు. వైద్య విజ్ఞానమే మనుషులను బతికిస్తుందన్నారు. అబద్ధపు ప్రచారాలతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారనీ, యువకులు హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. భక్తి ఎంత ఉంటే ఇమ్యూనిటీ అంత పెరుగుతుందని చినజీయర్‌ స్వామి వ్యాఖ్యానించిన దేవరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాభక్తులైన ఆయన కరోనాకు భయపడి మాస్క్‌ ఎందుకు వేసుకున్నారనీ, వ్యాక్సిన్‌ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. శాస్త్రీయ విద్యావిధానాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.