Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అగ్గువకే అమ్ముకుంటున్నరు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 01,2022

అగ్గువకే అమ్ముకుంటున్నరు..

- ధాన్యం అమ్మకాలు షురూ
- నిజామాబాద్‌లో క్విింటాకు రూ.1400
- ప్రభుత్వ కొనుగోలుపై స్పష్టత కరువు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వడ్ల రాజకీయం
నవతెలంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
       రబీ సీజన్‌ ధాన్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై స్పష్టత లేకపోవడంతో రైతులు వ్యాపారులకు అగ్గువకు అమ్ముకుంటున్నారు. రబీ సీజన్‌లో ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1940 ప్రకటించగా.. నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం రైతులు రూ.1400-రూ.1450కే విక్రయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టకుండా పరస్పర విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీసే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండగా.. రైతులు బలవుతున్నారు. ఇప్పటికే వర్ని, చందూరు మండలాల్లో అమ్మకాలు జరుగుతుండగా.. బోధన్‌ ప్రాంతంలో కోతలు షురూ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని ముందుగానే ప్రకటించడంతో ఇదే అదునుగా వ్యాపారులు, దళారులు రంగంలోకి దిగారు. అతి తక్కువ ధరకు రైతు నుంచి కొనుగోలు చేస్తున్నారు.
నిజామాబాద్‌ జిల్లాలో రబీ సీజన్‌లో సాధారణ విస్తీర్ణం 2,64,087 ఎకరాలు కాగా.. 3,49,898 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్‌లో మొత్తం 4,77,472 ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. 73 శాతం వరి సాగైంది. ఎస్సారెస్పీతో పాటు నిజాంసాగర్‌లో నిండుగా నీరు ఉండటంతో పంటలకు నీటి కొరత ఏర్పడలేదు. రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 9.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది 2020-21 సీజన్‌లో 438 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 7,49,076 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతేడాది పది లక్షల టన్నుల దిగుబడి రాగా.. సుమారు 7.5 లక్షల మెట్రిక్‌ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే, ఈ యేడాది 9.5 లక్షల టన్నుల దిగుబడిలో 2.5 లక్షల టన్నులు వాణిజ్య, స్థానిక అవసరాలకు పోను.. మిగిలిన ఏడు లక్షల టన్నుల ధాన్యం సేకరించేది ఎవరన్నది తేలడం లేదు. ప్రతియేటా కొనుగోలుకు ముందు వ్యవసాయ, పౌరసరఫరాలు, మిల్లర్లతో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశం ఏర్పాటు చేసి కొనుగోళ్లకు సంబంధించి సమీక్ష నిర్వహించేవారు. కానీ ఈ యేడు ఇప్పటి వరకు అలాంటి సమావేశమేమీ జరగలేదు.
వ్యాపారులకు అమ్మకాలు..
       వర్ని, చందూరు తదితర మండలాల్లో రైతులు రబీ ధాన్యం అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుతం క్వింటా ధాన్యం రూ.1400-రూ.1450 పలుకుతోంది. కోతలు ప్రారంభ దశలో ఉండటంతో ఈ మాత్రం ధర లభిస్తోందని, మోస్రా, రెంజల్‌, కోటగిరి తదితర మండలాల్లోనూ కోతలు ప్రారంభిస్తే ఈ ధర మరింత పతనం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బోధన్‌లో వరి కోతలు ప్రారంభించారు. హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన వరి కోత మిషన్లతో రైతులు వరి కోతలు షురూ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప కొనుగోళ్లపై మాట మాట్లాడ్డం లేదు.
కొనుగోలు కేంద్రాలపై సమాచారం లేదు: గోవింద్‌- జిల్లా వ్యవసాయాధికారి
       రబీ సీజన్‌లో జిల్లాలో 9.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖగా అంచనా వేశాం. గతడాదితో పోల్చితే ఈ యేడాది 50 వేల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు.
దళారులకు అమ్ముకుంటున్నాం : రవి(భవానీపేట్‌- బోధన్‌)
       ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత లేదు. రోజుకొక మాట చెబుతున్నారు. ఎండలు మండుతున్నాయి. పంట కోయకపోతే గింజ ఎండిపోయి దిగుబడి తగ్గుతుంది. కోసిన తరువాత కూడా రెండు, మూడు రోజుల్లో పంట ఎండుతది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై నిర్దిష్టమైన సమయం ప్రకటిస్తే వేచి చూడొచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలు రాలేదు. అందుకే బయట దళారులకు అమ్ముకుంటున్నాం. క్వింటాకు రూ.1400-1500 చెల్లిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.