Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధరాఘాతంపై ప్రజాగ్రహం కట్టెల పొయ్యిపై వంట | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 04,2022

ధరాఘాతంపై ప్రజాగ్రహం కట్టెల పొయ్యిపై వంట

- డీజిల్‌ ధరపై ఆటోలకు తాళ్లు కట్టి నిరసన
- ఖాళీ సిలిండర్లకు మోడీ బొమ్మలు, పూలదండలు
- రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నిరసన
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
        పెట్రోల్‌, డీజిల్‌, ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరల మంటపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. తక్షణం ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. సిలిండర్లను ఎత్తుకుని, ఎడ్ల బండ్లతో ర్యాలీలు నిర్వహించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయంటూ.. ఆటోలను తాళ్లతో లాగారు.
        జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆటో లాగి గ్యాస్‌ బండ పెట్టుకొని నిరసన తెలిపారు. కరీంనగర్‌ జల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టారు. జమ్మికుంట పట్టణంలో ఆటోకు తాళ్లు కట్టి లాగారు. కరీంనగర్‌ పట్టణంలో ప్లకార్డులతో నిరసన తెలిపి మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కొత్తపల్లి మండల కేంద్రంలో ఆటోకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు.
        ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్‌ సెంటర్లో ట్రాలీ ఆటోకి తాళ్లు కట్టి లాగుతూ.. గ్యాస్‌ బండను ఊరేగింపు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. వైరాలో కట్టల పొయ్యి పెట్టి వంట చేశారు. సత్తుపల్లిలో రాస్తారోకో చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సిద్దారంలో మహిళలు ఖాళీ గ్యాస్‌ బండను పక్కనబెట్టి, కట్టెల పొయ్యి మీద వంట చేశారు. ఏన్కూర్‌లో ఆటోను తాడుతో లాగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో మోటార్‌ సైకిళ్లకు తాడు కట్టి నిరసన తెలిపారు. చర్లలో వంటా వార్పు చేశారు.
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఆటోలకు తాళ్లు కట్టి లాగారు. ఆర్మూర్‌ పట్టణంలో సిలిండర్లకు పూలమాలవేసి నిరసన తెలిపారు.
        సిద్దిపేట పట్టణంలో చేపట్టిన నిరసనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు పాల్గొన్నారు. కరోనాతో దెబ్బతిన్న ప్రజలకు సబ్సిడీ రూపంలో సరుకులను అందించాల్సి పోయి.. నిత్యం ధరలను పెంచుతూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌ బీరంగూడ గుడి చౌరస్తాలో నిరసన కార్యక్రమంలో సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య జనంపై కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తోందని, ప్రతి వస్తువుపైనా ధరలు పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ధరల భారం తగ్గాలంటే ఎదురు తిరిగి పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. సంగారెడ్డి న్యూ బస్టాండ్‌ దగ్గర గ్యాస్‌ సిలిండర్‌, కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేశారు. పటాన్‌చెరు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
        సూర్యాపేట పట్టణ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌, సుందరయ్యనగర్‌లో నిరసన తెలిపారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండ పట్టణంలో ఆటోలకు తాళ్లు కట్టి లాగారు. పలు చోట్ల సిలిండర్లకు పూలమాల వేసి నిరసన తెలిపారు. మిర్యాలగూడ మండలం తడకమళ్లలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సిలిండర్లు, పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నూనె, కరెంట్‌, బస్‌ చార్జీల భారం వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులపై భారాలు మోపుతూ కార్పొరేట్‌ వ్యవస్థల బలోపేలానికి పాటుపడుతున్నాయని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు తిరగబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ పట్టణంలో పెద్ద బండలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
        యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, దిష్టిబొమ్మ దహనం చేశారు. తుర్కపల్లి మండలంలోని భువనగిరి-జగదేవ్‌పూర్‌ రహదారిపై పొయిలకట్టెలపై వంట చేశారు. అడ్డగూడూరు మండల కేంద్రంలో గ్యాస్‌ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఆలేరుటౌన్‌లో హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ధరలభూతం ప్లెక్లీ ప్రదర్శించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. జన్నారం, బెల్లపల్లి మండలాల్లో ఆటోను తాడుతో లాగుతూ, ఖాళీ లిసిండర్‌ను భుజాన వేసుకుని మోశారు.
        భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆటోకు తాడు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో గ్యాస్‌ సిలిండర్‌లు, కట్టెల పొయ్యిలతో నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆటోను తాళ్లతో లాగారు. మహిళలు ఖాళీ గ్యాస్‌ బండను నెత్తి మీద పెట్టుకొని ర్యాలీ చేపట్టారు.
హైదరాబాద్‌ సౌత్‌ సిటీ ఆధ్వర్యంలో ఐఎస్‌ సదన్‌ చౌరస్తా దగ్గర సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకొచ్చాక రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వకపోగా.. నిరుద్యోగం పెరిగిపోయిన తరుణంలో ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ఇప్పటికే ఉన్న భారాలు సరిపోవన్నట్టు.. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల వస్తువుల ధరలు పెంచి మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.