Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 04,2022

ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు

- అదుపులేని ధరలు.. అరికట్టలేని మోడీ సర్కారు
- రాష్ట్రంలో పెంచిన విద్యుత్‌, బస్‌చార్జీలు తగ్గించాలి
- ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
- కేంద్రంపై పోరులో ప్రతిపక్షాలను కలుపుకుపోవాలి
- ధరల వ్యతిరేక ర్యాలీలో తమ్మినేని
నవతెలంగాణ ప్రతినిధి- హైదరాబాదు
         రోజు రోజుకూ పెరుగుతున్న చమురు ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలను మోడి సర్కారు అరికట్టలేక పోతున్నదని సీపీఐ( ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పెంచిన పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెరిగిన ధరలకు నిరసనగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని మాకినేని బసవపున్నయ్య భవన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ''పెరిగే ధరలకు హద్దే లేదు.. ఏలేటోనికి బుద్దేలేదు.. ఏం కొనేటట్టుందీ..ఏం తినేటట్టుంది? అదుపు లేని ధరలు.. అరికట్టలేని ప్రభుత్వం... పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలు తగ్గించాలి. సామాన్యులపై భారాలు మోపుతున్న మోడీ సర్కార్‌ డౌన్‌..డౌన్‌. విద్యుత్‌, ఆర్టీసీ బస్‌ చార్జీలు తగ్గించాలి'' తదితర నినాదాలతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ హోరెత్తింది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు ప్రజల బతుకులపై ఈటల్లా వదులుతున్న మోడీ వేషధారణ సబికులను ఆకట్టుకుంది. పెరిగిన డీజిల్‌ ధరలతో సామాన్య ఆటోవాలా పడుతున్న బాధలను వ్యక్తం చేస్తున్న తీరుకు ప్రతిరూపంగా ఆటోకు తాళ్లుకట్టి సీపీఐ(ఎం) నాయకులు లాక్కొచ్చారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ అంతర్జాతీయంగా పెరిగిన ధరలకు అనుగుణంగా డిజిల్‌, పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని చెప్పటం తప్పన్నారు. చమురు ధరలు పెంచటమనేది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. ధరలు పెరుగుతున్న ప్రతి సందర్భంలో 45 శాతం పన్నులు వేయటమేంటో చెప్పాలని ప్రశ్నించారు. పదే పదే ధరలు ఎందుకు పెంచుతున్నారు? దీనికి గల కారణాలేంటి? ఆ మేరకు పన్నుల భారాన్ని ఎందుకు మోపుతున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా? అని నిలదీశారు. ధరలను అదుపుచేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఏందో తెలియాలంటే.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ధరల పెరుగుదలలో ఎవరి వాటా ఎంతో తేలిపోతుందన్నారు.
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే...
         ధాన్యం కొనుగోలు బాధ్యత పూర్తిగా కేంద్రప్రభుత్వానిదేనని తమ్మినేని చెప్పారు. కేంద్రం మాయ మాటలు చెప్పి తెలంగాణను అవమానిస్తున్నదని తెలిపారు. గతంలో ఏ విధంగానైతే ధాన్యం కొన్నారో..అదే విధంగా ఎందుకు కొనటం లేదో చెప్పాలన్నారు. ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ధాన్యం కోనుగోలు కోసం కేంద్రంపై జరిగే పోరాటం టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల యుద్ధంలా మార్చుతున్నాయని విమర్శించారు. ఇరు పార్టీల విమర్శల వరకు పరిమితం చేయటం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారం కావాలన్న చిత్తశుద్ధి నిజంగా ఉంటే వామపక్ష, ప్రతిపక్ష పార్టీలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత కేసీఆర్‌ పై ఉందన్నారు. అలాంటి ప్రయత్నం ఇప్పటికైనా చేస్తే మంచిదని సూచించారు.
విద్యుత్‌, బస్సు ఛార్జీలు తగ్గించాలి
         మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా పెరిగిన చమురు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు సతమతమవుతుంటే...మేమేం తక్కువ కాదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా విద్యుత్‌, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు చంద్రబాబు నాయుడు కరెంటు చార్జీలు పెంచితే పెద్ద ఎత్తున ఉద్యమం చేశామని చెప్పారు. ముగ్గురు కార్యకర్తలు కూడా చనిపోయారని గుర్తుచేశారు. ఆ ఉద్యమం ఫలితంగానే 20 ఏండ్లు కరెంటు చార్జీలు పెరచేందుకు ఏ ప్రభుత్వాలు ధైర్యం చేయలేదని చెప్పారు. కానీ..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎక్కువ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాలను వేసిందన్నారు. తక్షణం పెంచిన విద్యుత్‌, ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఐక్యంగా ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.
         వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉపాధి దెబ్బతిని, ఉద్యోగాలు కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ధరల భారాలు మోపటం ప్రభుత్వాలకు సమంజసమేనా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదలకు ఉక్రెయిన్‌ యుద్ధం కారణమని చెప్పటం సరికాదన్నారు. యుద్ధానికి ముందు కూడా ధరలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. వారం పదిరోజులుగా పెరిగిన ధరల వల్ల ఒక్కో కుటుంబంపై రూ.1500నుంచి రూ.2000వరకు అదనపు భారం పడుతున్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికుల కుటుంబాల జీవనం ఎలా సాగిస్తామని ప్రశ్నించారు. నగదు బదిలీతో ప్రజలను మోసం చేయబోతున్నారని ఆనాడే సీపీఐ(ఎం) చెప్పిందనీ, వంటగ్యాస్‌ సబ్సిడీ ఎలా పడిపోతున్నదో చూస్తే..నగదు బదిలీ రహస్యం అర్థమవుతున్నదని వివరించారు. శ్రీలంకలో ఇదే పరిస్థితిని అనుసరించటం వల్లనే అక్కడ సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. ఆ సంక్షోభం నుంచి భారత ప్రభుత్వం పాఠాలు తీసుకునే పరిస్థితి కనిపించటం లేదని తెలిపారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణ జ్యోతి మాట్లాడుతూ పెరిగిన ధరల ప్రభావం ఎక్కువగా మహిళలమీదనే ఉంటుందన్నారు. వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌తోపాటు రాష్ట్ర నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.