Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతుల కోసం పోరాడుతాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 07,2022

రైతుల కోసం పోరాడుతాం

- కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని..
-  జాతీయ రహదారి దిగ్బందం.. నిలిచిన వాహనాలు
- పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ- విలేకరులు
రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు. దాంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో పోలీసులు రాస్తారోకోలను అడ్డుకున్నారు. తెలంగాణలో రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని, రైతుల కోసం ఎంతకైనా పోరాడుతామని మంత్రులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ జాతీయ రహదారి కిసాన్‌గూడ చౌరస్తా వద్ద జడ్పీ చైర్‌పర్సన్‌ అనితా హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు రాస్తారోకో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలోని జాతీయ రహదారిని సుమారు గంటన్నర పాటు రాస్తారోకో నిర్వహించి దిగ్బంధించారు. దాంతో వాహనాలు ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. నిర్మల్‌ జిల్లా కడ్తాల్‌ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసనలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా, ఆదిలాబాద్‌ జిల్లా జందాపూర్‌ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసనలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్‌ తరహాలో రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పండించిన వడ్లను కొనుగోలు చేయిస్తామని చెప్పిన రాష్ట్ర బీజేపీ నాయకులు పంట చేతికి రాగానే ముఖం చాటేశారని విమర్శించారు. కేంద్రం కొనుగోలు చేసే వరకు రాష్ట్ర రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మెన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఖానాపూర్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, రాథోడ్‌ బాపురావు పాల్గొన్నారు.
గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద హైదరాబాద్‌-బెంగుళూరు జాతీయ రహదారిపై మాజీ ఎంపీ మంద జగన్నాధం, అలంపూర్‌ నియోజకవర్గ పార్టీ మాజీ ఇంచార్జి మంద శ్రీనాధ్‌, నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, నాయకులు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. రహదారి పొడవునా భారీ ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు రాస్తారోకోను విరమింపజేసే యత్నం చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని ముంబయి జాతీయ రహదారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అధ్యక్షతన దిగ్బంధించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మెన్‌ భూపాల్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కందిలో జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, మాణిక్‌ రావు, పద్మా దేవేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా జహీరాబాద్‌, న్యాల్కల్‌, నారాయణఖేడ్‌, కల్హేర్‌ మండలాల్లో నిరసన చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిని టీఆర్‌ఎస్‌ నాయకులు దిగ్బంధనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్యెల్యే వనమా మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని, లేనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారి ఏడుకోట్లతండా వద్ద గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్‌ చైర్మెన్‌ తిరునగర్‌ భార్గవ్‌ పాల్గొన్నారు. దామరచర్ల మండలకేందంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దవూర మండలకేంద్రంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ రాస్తారోకోలో పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారి తెలంగాణ ముఖద్వారం రామాపురం ఎక్స్‌రోడ్డు వద్ద ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్‌, శానంపూడిసైదిరెడ్డి.. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ జాతీయ రహదారి 65పై రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూర గ్రామం వద్ద గల సాలూర-బొంబాయి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం తెలుసుకున్న రూరల్‌ సీఐ రవీందర్‌ నాయక్‌, ఎస్‌ఐ సందీప్‌ పోలీసు సిబ్బందితో ధర్నా స్థలానికి చేరుకుని పలువురు నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించి అరెస్టు చేశారు. నాయకుల అరెస్టును అడ్డుకోబోయిన కార్యకర్తలనూ అరెస్టు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.