Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పచ్చతెలంగాణపై కేంద్రం పగ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2022

పచ్చతెలంగాణపై కేంద్రం పగ

- మోడీ ప్రభుత్వం రైతులను వంచించింది
- నూకలు తినమన్న పార్టీ తోకలు కత్తిరించాలి
- బీజేపీని తరిమి కొట్టడం ఖాయం
- ధరలు పెంపుపై చీమకుట్టినట్టు లేదు : మంత్రులు
- ధాన్యం కొనుగోళ్ల కోసం టీఆర్‌ఎస్‌ నిరసన దీక్షలు
నవతెలంగాణ - మొఫసిల్‌ యంత్రాంగం
        టీఆర్‌ఎస్‌ వడ్ల పోరు ఉధృతం చేసింది. కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కారు. కలెక్టరేట్ల ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. మోడీ ప్రభుత్వం వంచించిందని, నూకలు తీనమని చెబుతున్న బీజేపీకి తోకలు కత్తిరించి సాగనంపుతామని హెచ్చరించారు. పచ్చబడి పాడిపంటలు పండుతున్న తెలంగాణపై పగబట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుకుంటూపోతోందని, ఆ పార్టీ నాయకులకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు.
        కరీంనగర్‌ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్‌, సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో రైతుదీక్ష చేపట్టారు. కేంద్రం ఎఫ్‌సీఐని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందన్నారు. సిలిండర్‌ ధరను వెయ్యి చేసి ప్రజలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కు చేస్తోందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రైతులను మోసం చేశారన్నారు. అందరూ వరి వేయాలని, తానే స్వయంగా కేంద్రంతో ధాన్యం కొనిపిస్తానని మాట్లాడి ఇప్పుడు జారుకుంటూ రాజకీయం చేస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం రైతులను వంచించిందని, తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలంటూ కేంద్ర మంత్రి గోయల్‌ నోరుపారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకలు తినాలన్న పార్టీ తోకలు కత్తించి ఇంటికి పంపుతామని హెచ్చరించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో దున్నపోతుపై కేంద్ర ప్రభుత్వం అని రాసి ప్రదర్శించారు.
        నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని..నేడు తెలంగాణ రైతులకోసం మళ్లీ రోడ్డెక్కామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసనదీక్షలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కారు లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీలాగా పనిచేస్తున్నదని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అని విమర్శించారు.
        వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని, అదే తరహాలో ఉద్యమాలు చేసి కేంద్రం ధాన్యం కొనేవరకు పోరాడుతామని తెలిపారు.
        మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్‌లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం వడ్లు కొనే వరకు బీజేపీని వదలబోమన్నారు.
        వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పచ్చబడ్డ తెలంగాణపై కేంద్రం పగబట్టిందని, అందుకే వరి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
        రైతుల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు కోసం కలిసి అందరం కొట్లాడుదామని రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 'నిరసన దీక్ష'లో ఆయన పాల్గొన్నారు.
        ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్షలోరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు. వడ్ల కంకులను మెడలో వేసుకొని నిరసన తెలిపారు.
        తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం భేషరతుగా కొనుగోలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
        సంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
        నల్లగొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మెన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.