Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీఎస్‌ఆర్టీసీలో ఎస్‌ఆర్‌బీఎస్‌ రద్దు? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 09,2022

టీఎస్‌ఆర్టీసీలో ఎస్‌ఆర్‌బీఎస్‌ రద్దు?

- కార్మికుల ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బ
- ఇప్పటికే మూసివేత దిశలో సీసీఎస్‌
- ఈపీఎస్‌ రద్దుపైనా యాజమాన్యం సమాలోచనలు
- ఆందోళనలో ఆర్టీసీ కార్మికులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
            తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అనగానే దానికింద 'సామాజిక బాధ్యత' అనే ట్యాగ్‌లైన్‌ ఉండేది. క్రమేణా ఇప్పుడు ఆ ట్యాగ్‌లైన్‌ను చెరిపేసి, పక్కా 'వ్యాపార, వాణిజ్య సంస్థ' అనే ముద్ర వేసుకుంటున్నది. ఇప్పటికే ఆర్టీసీకి అనుబంధంగా ఉన్న అనేక యూనిట్లు మూతపడ్డాయి. సంస్థలో కొత్తగా ఎలాంటి రిక్రూట్‌మెంట్లు లేవు. పైపెచ్చు స్వచ్ఛంద ఉద్యోగ విమరణ (వీఆర్‌ఎస్‌)ను అమల్లోకి తెస్తారనే ప్రచారం జరుగుతున్నది. దీనికోసం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో అనధికారికంగా రిజిస్టర్లు పెట్టి కార్మికులతో సంతకాలు కూడా పెట్టించుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు తమ జీతాల సొమ్ము ద్వారా ఏర్పాటు చేసుకున్న కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌) కూడా దాదాపు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నట్టు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. తాజాగా... రిటైర్‌మెంట్‌ తర్వాత ఎలాంటి పెన్షన్‌ సౌకర్యం లేని ఆర్టీసీ కార్మికులకు, కాస్తో కూస్తో ఆర్థిక చేయూతనిచ్చే స్టాప్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ స్కీం (ఎస్‌ఆర్‌బీఎస్‌)ను కూడా ఎత్తేసే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఇప్పటికే అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. యాజమాన్యం వాటికి వివరణ ఇచ్చే కనీస ప్రయత్నం కూడా చేయట్లేదు. ఫలితంగా కార్మికుల్లో తమ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తమవుతున్నది. సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం దాదాపు 30-35 ఏండ్లు కష్టించి పనిచేస్తూ, సర్వీస్‌ చేస్తే... ఒంట్లో సత్తువ సన్నగిల్లి, రిటైర్‌మెంట్‌ అయ్యాక మీ బతుకులతో మాకేం సంబంధం అన్నట్టే యాజమాన్యం వ్యవహరిస్తుండటాన్ని కార్మికులు తప్పుపడుతున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) పేరుతో పలు సంస్థల నుంచి నిధులు తెస్తున్న యాజమాన్యం...కార్మికుల పట్ల సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీలో 1989లో కార్మికుల జీతాల్లోంచి నెలకు రూ.40 కట్‌ చేస్తూ, యాజమాన్య మ్యాచింగ్‌ గ్రాంటును కలుపుతూ రిటైర్‌ అయిన వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు ఎస్‌ఆర్‌బీఎస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ మొత్తం పెరుగుతూ వచ్చి ప్రస్తుతం కార్మికుల జీతంలోంచి నెలకు రూ.250 కట్‌ అవుతుంది. వారి సర్వీసును బట్టి రిటైర్‌మెంట్‌ తర్వాత నెలకు రూ.720 నుంచి రూ.3,200 వరకు క్యాస్‌ బెనిఫిట్‌ (ఎమ్‌సీబీ) ఇస్తారు. ఆర్టీసీలో ప్రతి వేతన ఒప్పందం సమయంలోనూ దీనిపై యాజమాన్యం ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంట్‌ను ప్రకటిస్తుంది. చివరగా 2013 సంవత్సరానికి సంబంధించిన వేతన సవరణ 2015లో జరిగింది. అప్పట్లో ఎస్‌ఆర్‌బీఎస్‌కు 6.5 శాతం మ్యాచింగ్‌ గ్రాంటును ప్రకటించారు. కాన్నీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. 2011 తర్వాతి నుంచి ఈ స్కీంకు యాజమాన్య మ్యాచింగ్‌ గ్రాంట్‌ను ఇవ్వట్లేదని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఆర్టీసీలో ఈ స్కీం ద్వారా ప్రస్తుతం 26,900 మంది రిటైర్డ్‌ కార్మికులు లబ్ది పొందుతున్నారు. 2022 నుంచి ఏటా దాదాపు రెండువేల మంది రిటైర్‌ అవుతారు. వారందరికీ ఎస్‌ఆర్‌బీఎస్‌ ద్వారా ఆర్థిక లబ్ది చేకూర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ఉన్న ఆదాయ వనరుల దృష్ట్యా రిటైర్‌ కార్మికుల సామాజిక బాధ్యతగా ఉన్న ఈ స్కీంను వదిలించుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని అధికారులు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ వద్ద వ్యక్తంచేసినట్టు సమాచారం. దీనిపై ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు సంస్థలో ప్రచారం జరుగుతున్నది. 2015లో జరిగిన వేతన ఒప్పందంలో ఎస్‌ఆర్‌బీఎస్‌లో కార్మికుల వాటా సొమ్మును రూ.250 నుంచి రూ.500కు పెంచి, కనీస ఆర్థిక ప్రయోజన మొత్తాన్ని రూ.5వేలకు పెంచాలని ప్రతిపాదించారు. దీనిపై అప్పటి ఆర్టీసీ యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘాల నేతలు సంతకాలు చేశారు. ఈ స్కీంను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుదల చేయరాదని 1989 అనుబంధ బైలాస్‌లో పేర్కొన్నారు. కార్మిక సంఘాల లెక్కల ప్రకారం ప్రస్తుతం ఈ స్కీం రూ.12 కోట్ల మిగులుతో ఉంది. అయినా కొత్త రిక్రూట్‌మెంట్లు లేనందున, భవిష్యత్‌లో రిటైర్‌మెంట్లు అధికం అవుతున్నాయి కాబట్టి ఈ స్కీంను ఇప్పుడే వదిలించుకుంటే బాగుంటుందనే యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీలో 48వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఐదేండ్లలో పదివేల మందికి పైగా రిటైర్‌ అవుతారని అంచనా. ఇవే కారణాలు చెప్తూ ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)లో అంతర్భాగంగా ఉన్న ఎంప్లాయీ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌)ను కూడా రద్దు చేసే యోచనలో యాజమాన్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ఏడాది నుంచి రిటైర్‌ అయ్యే ఆర్టీసీ కార్మికులకు ఈపీఎస్‌ ద్వారా సర్వీసును బట్టి నెలకు రూ.3,600 వరకు పెన్షన్‌ వస్తుంది. ఆర్టీసీని పూర్తిగా వ్యాపార, వాణిజ్య సంస్థగా మార్చడంపైనే యాజమాన్యం దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే తమకు రావాల్సిన రెండు ఫిట్‌మెంట్లు, ఆరు డిఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందక భవిష్యత్‌పై బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
కార్మికులపై సామాజిక భద్రతా దాడి
12న డిమాండ్స్‌ డే-టీఎస్‌ఆర్టీసీ జేఏసీ
            ఆర్టీసీ కార్మికుల సామాజిక భద్రతపై జరుగుతున్న యాజమాన్య దాడిని తక్షణం నిలిపేయాలని టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. వీఆర్‌ఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌ రద్దు, ఈపీఎస్‌ రద్దు అనుమానాలను తక్షణం నివృత్తి చేయాలని జేఏసీ నేతలు కోరారు. కార్మిక సమస్యల పరిష్కారం, పెండింగ్‌ డిమాండ్ల సాధన కోసం ఈనెల 12న డిమాండ్స్‌ డే నిర్వహిస్తున్నట్టు జేఏసీ కన్వీనర్‌ వీఎస్‌ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 5న జరిగిన జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోజు కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.