Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎదురుచూపులేనా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 09,2022

ఎదురుచూపులేనా?

- ఏప్రిల్‌ 9 వచ్చే..కొత్త పింఛన్‌రాలే...
- అన్ని అర్హతలున్నా నోచుకోనోళ్లు 3.15 లక్షల మంది
- ఒక్కొక్కరు నష్టపోయింది సుమారు రూ.80 వేలపైనే
- వికలాంగులు కోల్పోయింది రూ.1.20 లక్షపైనే
- 57 ఏండ్లపైబడిన వారిని కలిపితే ఆశావాహుల సంఖ్య 11 లక్షలకుపైనే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
             'ఇగొస్తరు..అగొస్తరు..పది రోజుల్లో పడ్తరు...ఫస్ట్‌ నుంచి వస్తరు...ఆగినోల్లు ఆగిరు..జరాగండి..ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అందరికీ ఇస్తం...' సీఎం, మంత్రుల నుంచి అధికారుల దాకా అందరి నోటా ఇదే మాట. స్త్రీనిధి వార్షికోత్సవంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావూ ఈ నెల నుంచే ఇస్తామని చెప్పారు. దీంతో ఆశావాహులంతా సంబురపడ్డారు. ఏప్రిల్‌ వచ్చిందిగానీ కొత్త పింఛన్‌ మాత్రం రాలేదు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను, సర్కారు తీరును చూస్తుంటే ఆ హామీలు, మాటలు మరోమారు నీటిమీది రాతల్లాగే మిగిలేటట్టు ఉంది. మార్చి మొదటి వారంలో ఇవ్వాల్సిన పింఛన్లను రాష్ట్ర సర్కారు నెలాఖర్లో ఇచ్చింది. దీనినిబట్టే కొత్త పింఛన్ల మంజూరు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. 'ఏప్రిల్‌ వచ్చింది..ఇగనైనా పడ్తయా బిడ్డా మా పింఛన్లు. రెండేండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నం' అంటూ ఆశావాహులు సర్పంచ్‌లు, ఎంపీటీసీల చుట్టూ తిరుగుతున్నరు. వాళ్లేమో ఏం చెప్పాలో అర్థం కాక 'వొస్తరు.. వొస్తరు..జర ఆగండి' అంటూ షరామామూలుగానే సమాధానమిచ్చి దాటవేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో 65 ఏండ్లు దాటినవారు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హత కలినవారు సెర్ప్‌ అధికారుల లెక్కల ప్రకారమే 3.15 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుని పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా సొంతపనులు చేసుకోనివారు, ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నవారే. వారిలో 1,59,452 మంది వితంతువులున్నారు. వికలాంగులు 55,619 మంది. వీరంతా పింఛన్‌కు అర్హులని రాష్ట్ర సర్కారు కూడా తేల్చింది. దేనితోనూ సంబంధం లేకుండా వీరికి పింఛన్‌ వర్తింపజేయాలి. కానీ, రాష్ట్ర సర్కారు 2018 ముందస్తు ఎన్నికల తర్వాత నుంచి నాన్చుతూనే ఉన్నది. 2018 ఆగస్టులో పించన్‌ లబ్దిదారుల సంఖ్య 39.42 లక్షల మంది ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 36.42 లక్షలకు తగ్గిపోయింది. అంటే రాష్ట్రంలో ఇస్తున్న పింఛన్ల సంఖ్య దాదాపు మూడు లక్షల వరకు తగ్గింది. ఆ స్థానంలో 65 ఏండ్లు దాటినవారినీ, వితంతువులు, వికలాంగులు, తదితర అర్హతలున్నవారిని చేర్చితే వారికన్నా న్యాయం జరిగేది. అదీ చేయలేదు. 65 ఏండ్లు దాటిన వృద్ధులు పింఛన్‌ అందక గడిచిన 40 నెలల్లో ఒక్కొక్కరు సగటున 80 వేల దాకా నష్టపోయారు. అదే వికలాంగులైతే 1,20,000 దాకా కోల్పోయారు. సెర్ప్‌ గణాంకాల ప్రకారమే రాష్ట్ర సర్కారు పింఛన్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తూ ప్రతినెలా 16.77 కోట్ల రూపాయలను మిగిల్చుకుంటున్నదని తేలింది.
             2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజీ నెం.12, పాయింట్‌ నెం.2లో ఆసరా పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ పొందుపర్చింది. ఆ ప్రకటనతో అర్హులైన దాదాపు 11 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకుని ఏండ్ల పడాంతరం ఎదురుచూస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి) కొత్త పింఛన్లు ఇస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గ కసరత్తు ప్రారంభించకపోవడం శోచనీయం. మార్గదర్శకాలనూ విడుదల చేయలేదు. దీంతో అధికారపార్టీ నాయకులు, అధికారుల చుట్టూ ఆశావాహులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
న్యాయపోరాటానికెళ్తాం...: కొండల్‌రెడ్డి
        ఆసరా పింఛన్ల సాధన కమిటీ నేత, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌
త్వరలోనే ఇస్తాం..ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇస్తాం..అంటే సర్కారుపై గౌరవంతో ఓపికగా ఎదురుచూశాం. ఈసారీ కేసీఆర్‌ ప్రభుత్వం మాటతప్పింది. మూడున్నరేండ్లుగా ఇదే తంతు. ధనిక రాష్ట్రమే కదా? ఇవ్వలేరా? నాలుగేండ్ల కాలంలో తగ్గిన పింఛన్లు మూడు లక్షలకుపైనే. వాటిస్థానంలో కొత్తవారికి ఇవ్వొచ్చుగదా? ఆ పని సర్కారు ఎందుకు చేయట్లేదు? ఇంకో పది రోజులు ఎదురుచూస్తాం. అయినా, కొత్త పింఛన్లు ఇవ్వకపోతే న్యాయపోరాటానికి సిద్ధమవుతాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.