Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అభివృద్ధి పేరుతో దళితుల భూములను లాక్కునే కుట్ర | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 10,2022

అభివృద్ధి పేరుతో దళితుల భూములను లాక్కునే కుట్ర

- 70ఏండ్లుగా సాగులో ఉన్న రైతులు
- వందల ఎకరాలను స్వాధీనం చేసుకునేే ప్రయత్నం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
           భూమిలేని ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి పంపిణీ చేస్తానన్న సీఎం కేసీఆర్‌.. పంపిణీ మాట అటుంచితే.. వారికి ఉన్న భూములనే లాక్కుంటున్నారు. ఎపుడో ఏండ్ల కిందట దళితులకు నాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని అభివృద్ధి పేరిట లాక్కునే కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్న భూముల్లో సగానికంటే ఎక్కువగా దళితుల భూములే ఉన్నాయి. గుంటలు, ఎకర, రెండెకరాల భూములు కలిగిన వారి నుంచే తీసుకుంటున్నారు. ఇప్పుడు ల్యాండ్‌ ఫుల్లింగ్‌ పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో విలువైన దళితుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోంది.
ఎన్నికల హామీల్లో భాగంగా దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని ఉద్యమం నుంచి రెండోసారి సీఎం అయ్యే వరకు కేసీఆర్‌ ప్రకటించారు. కానీ పంపిణీ సంగతి పక్కకు పోయింది.. ఎక్కడెక్కడ విలువైన భూములున్నాయో వాటిని లాక్కుని కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో చౌటుప్పల్‌ మండలం ఎస్‌లింగోటం గ్రామంలో 130 మంది దళిత, బలహీనవర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. 252 సర్వే నెంబర్‌లో ఏ 83-36ఎకరాలు, 268 సర్వే నెంబర్‌లో ఏ 57-32 ఎకరాలు, 269 సర్వేనెంబర్‌లో 11 ఎకరాల భూమిని ఇచ్చింది. మొత్తంగా 152.28ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం 135 కుటుంబాలకు పంపిణీ చేసింది. అయితే, 1970లో భూమి ఇచ్చినప్పటికీ.. 1975లో పాసుపుస్తకాలు ఇచ్చారు. ప్రస్తుతం రైతుబంధు, పంటరుణాలు కూడా రైతులకు అందుతున్నాయి. లక్షలు ఖర్చు చేసి సాగుకు అనుకూలం చేసిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన ఆ భూముల్లో మొదట్లో రాళ్లు, రప్పలు, చెట్టు, పుట్టలు ఉండేవి. వాటన్నింటినీ తొలగించి రైతులు సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. బావులు తవ్వారు. బోర్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఆ భూమిలో మూడోతరం సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం భూమిలో 70 బోర్లున్నాయి. రైతు పిట్టల శంకరయ్య పంటల సాగుకై నీటి వసతి కోసం రెండు బావులు తవ్వి, తిరిగి పూడ్చి వేశారు. సుమారు 21బోర్లు వేశారు. ఆయనొక్కడే దాదాపు 20లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పాడు. ఇతర రైతులు కూడా భూమి చదును కోసం ఇప్పటి వరకు సుమారు. రూ.10లక్షల చొప్పున ఖర్చు చేసినట్టు తెలిపారు. 75శాతం వరి, 25శాతం పత్తి, కంది, ఇతర పంటలను సాగు చేస్తున్నారు.
మెహర్‌ నగర్‌లో 182 ఏకరాల భూములకు ఎసరు
           పోచంపల్లి మండలం మోహర్‌నగర్‌లో సుమారు 70ఏండ్లకు పైగా దళితులు అసైన్డు భూములను సాగు చేసుకుంటున్నారు. 153సర్వే నెంబర్‌లో 72ఎకరాలు, 321 సర్వేనెంబర్‌లో 110ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మొత్తంగా 130 కుటుంబాలు 182ఎకరాల భూమిని సేద్యం చేసుకుంటున్నారు.
రియల్‌ బ్రోకర్‌గా ప్రభుత్వం
           తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు.. కట్టడానికి బట్టలేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వాలు అసైన్డ్‌ భూములను కేటాయించాయి. ఆ భూమి వల్ల ఆత్మగౌరవం పెరుగుతుందని, స్వశక్తితో జీవిస్తారని ప్రభుత్వం ఆశించింది. రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో చౌటుప్పల్‌ మండలంలో ఒక్క ఎకరం భూమిని కూడా పేదలకు పంచని ప్రభుత్వానికి.. దళితుల భూములపై కన్ను పడింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వమే రియల్‌ బ్రోకర్‌గా మారి పేదల అసైన్డు భూములను గుంజుకుంటోందని పలువురు బాధితులు తెలిపారు.
నోటికాడి ముద్దను లాక్కుంటున్నారు
తూర్పింటి లక్ష్మమ్మ- ఎస్‌ లింగోటం- చౌటుప్పల మండలం
           వ్యవసాయం చేసుకుంటే తప్ప పూటగడవని పరిస్థితి మాది. ఈ భూమిలో మూడోతరానికి సంబంధించిన కుటుంబం సాగు చేస్తుంది. నోటి కాడి ముద్దను ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం. తమ భూమిని బలవం తంగా లాక్కుంటే విషంతాగి ప్రభుత్వం కార్యాలయాల ముందే సాముహికం గా ఆత్మహత్య చేసుకుంటాం. ప్రాణం పోయినా భూములను ఇవ్వం.
భూముల్లో అడుగు పెట్టనివ్వం
తూర్పింటి రాములు - కన్వీనర్‌ ఎస్‌. లింగోటం- భూ పరిరక్షణ కమిటీి
           ఏండ్ల తరబడి భూమిని సేద్యానికి అనుకూలంగా చేసుకున్న తమను బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్లగొట్టడం అన్యాయం. ఏ స్థాయి వాళ్లు వచ్చినా మా భూముల్లో అడుగుపెట్టనివ్వం. భూములు తీసుకోవడం ఆపేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన చేసే వరకు కలిసికట్టుగా పోరాడుతాం.
ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా మారడం దురదృష్టం
కొండమడుగు నర్సింహా
           పేదల భూములను లాక్కుని ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పనిచేయడం దురదృష్టకరం. సెంటు భూమి ఇవ్వని సర్కార్‌ ఉన్న భూములను గుంజుకోవడం ఏం న్యాయం. ప్రభుత్వం తన విదానాన్ని మార్చుకోవాలి. లేకపోతే దళితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు నిర్వహిస్తాం.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.