Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ముస్లిం యువతకు ఉపాధికల్పనేదీ? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 11,2022

ముస్లిం యువతకు ఉపాధికల్పనేదీ?

- ఆటోడ్రైవర్లు, మెకానిక్‌లు మారుతున్న యువకులు
- ఎక్కువ మందికి ఆధారం వీధి వ్యాపారమే
- రుణాలకు దరఖాస్తు పెట్టుకున్నా సర్కారుకు పట్టదే
- 1.12 లక్షల మంది రుణం కోసం దరఖాస్తు
- ఇచ్చింది ఏడెనిమిది వేల మందికే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
             ''సౌకా దస్‌..సౌకా దస్‌..''...'బీస్‌ రూపారు..బీస్‌ రూపారు...' 'పది..పది..' అంటూ కోటిలో ఏ వీధికెళ్లినా వినిపించే అరుపులివే. కానీ, కరోనా ఆ వీధి వ్యాపారుల పట్ల ప్రాణసంకటంగా మారింది. అందులోనూ ముస్లిం మైనార్టీల మీద ఎక్కువ ప్రభావం చూపింది. బతుకుదెరువు కోసం తోపుడు బండ్లు, పుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలతో పాటు ఫంచర్లు వేసే వారిలో ముస్లింలే ఎక్కువ. మొత్తం వ్యాపారుల్లో 68 శాతం మంది వీరే. దీనికితోడు ఆటోలు నడపడటం, భవన నిర్మాణ కార్మికులు, వంటవారిగా పనిచేయడంలోనూ వారే ముందు వరుసలో ఉన్నారు. వీరంతా స్వయం ఉపాధి కోసం సర్కారుకు దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోవటం లేదు. ఉపాధి లేక.. అరకొరగా నడుస్తున్న వీధి వ్యాపారాలు...రోజంతా ఆటో నడిపినా మిగులుతున్న అత్తెసరు ఆదాయంతో ముస్లిం కుటుంబాలు దుర్భర బతుకులీడుస్తున్నారు.
             రాష్ట్రంలో ముస్లిం జనాభా 46 లక్షలు (2011 జనాభా లెక్కల ప్రకారం). అందులో ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 26 లక్షల మంది ఉన్నారు. వారి జనాభాలో 63శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న వారు 68శాతం మంది ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవించే వారు మొత్తం జనాభాలో 68శాతం మంది ఉన్నరంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పాతబస్తీలో బహుదూర్‌పురా, ఖాజాపహడ్‌ దర్గా ఏరియాలో ప్రతి 100 మంది ముస్లింలలో 63 మంది ఆటో డ్రైవర్లుగా బతుకులీడుస్తున్నారు. అందులో ప్రతి వంద మందిలో పది మందికే సొంత ఆటోలున్నాయి. మిగతా వారంతా కిరాయి ఆటోలపై ఆధారపడి బతుకుతున్నారు. వీరు రోజంతా(15 గంటలదాకా) ఆటో నడిపినా గిరాకీని బట్టి రోజుకు రూ.1000 నుంచి 1200 మిగిలితే ఒట్టు. అందులో ప్యూయల్‌ ఖర్చులు రూ.500 పోనూ, ఆటో అద్దె రూ.300 వరకు కట్టగా రూ.300-400కి మించి మిగలవు. ఐదారు మంది కుటుంబ సభ్యులు ఆ డబ్బులతో వెళ్లదీయాలి. ఆటో డ్రైవర్లలో ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారు. ఫైనాన్స్‌లో వాహనాలు తీసుకుని నడుపుతూ జీవించేవారు కిస్తీలు కట్టలేదని వారి వాహనాలను ఫైనాన్షియర్లు తిరిగి తీసుకెళ్లి పోతున్నారు. ప్రయివేటు ఫైనాన్షియర్ల వద్ద అప్పులు తెచ్చి వ్యాపారం చేసే వారికి అసలు, వడ్డీ కలిసి అప్పు మోయలేని భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వీధి వ్యాపారం...భయం..భయం..
             పూట గడవాలంటే..చిన్న చిన్న వ్యాపారాలే మాకు దిక్కుని పలువురు ముస్లిం యువకులు ఆవాజ్‌ సర్వేలో చెప్పారు. కరోనా కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారిలో ముస్లిం మైనార్టీలే ఎక్కువ. నూటికి 98 శాతం మంది వీధి వ్యాపారాలతో పాటు( ఫుట్‌పాత్‌లపై పూలు, పండ్లు, కూరగాయలు, చెప్పులు, బట్టల అమ్మకం, పంచర్‌ కొట్లు, తదితర పనులు చేసుకోవడం) హోటళ్లు, బేకరీల్లో పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారే. కరోనా దెబ్బతో వీరి వ్యాపారాలన్నీ దెబ్బతినిపోయాయి. పనులు దొరక్క అర్ధాకలితో బతుకుతున్నారు. వీధి వ్యాపారులు పొద్దస్తమానం వ్యాపారం చేసినా రూ.1000 నుంచి రూ.1500 బేరం జరగదు. అందులోనూ అన్నీ పోనూ రోజుకు రూ.300 నుంచి 500 మిగులుతాయి. ఒకవేళ పోలీసులు చలాన్‌ వేస్తే చచ్చినట్టు కట్టాల్సిందే. ఆరోజు ఉత్త చేతుల్తో ఇంటికెళ్లాల్సిందే. ఆ కుటుంబం పస్తులుండాల్సిందే. ఇదీ క్షేత్రస్థాయి పరిస్థితి. సొంతవ్యాపారం చేసుకువాలని ముందుకొచ్చే ముస్లిం యువతకు సర్కారు చేయూతనందించడంలో పూర్తి వైఫ్యలం చెందింది.
స్వయం ఉపాధికి ఆసరా ఏదీ?
             మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలిస్తామని 2015-16 ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో 82 వేల మంది ఆన్‌లైన్‌ ద్వారా, 30 వేల మంది ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకున్నారు. అంటే మొత్తం లక్షా 12 వేల మంది నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్లు వివిధ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డుల కోసం అప్పులు చేసి, వాటిని తీసుకుని మీసేవ కేంద్రాల ముందు రోజుల తరబడి బారులు తీరిన లైన్‌లో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎనిమిది వేల మందికి మాత్రమే రుణాలు అందజేశారు. అదీ రూ.50 వేల నుంచి లక్ష రూపాయల లోపు వారికే లోన్‌ శాంక్షన్‌ లేఖలు వచ్చాయి. అందులోనూ సగం మందికి బ్యాంకులు సెక్యూరిటీ లేదని లోన్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 500 మందికి మాత్రమే రుణాలు ఇస్తే.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉపాది అవకాశాలు మెరుగవ్వాలంటే ఎన్నేండ్లు పడుతున్నదో సర్కారు పెద్దలే చెప్పాలి. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు బడ్జెట్‌ కేటాయింపులు లేక అర్హులైన వారికి రుణాలందటం లేదన్న విమర్శలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రుణాలు అందకపోవటంతో ప్రయివేటు ఫైనాన్షియర్ల ఉచ్చులో పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. చిరు వ్యాపారాలు చేసుకోవడం, ఆటోలు అద్దెకు తీసుకుని నడపడం వంటివి చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.