Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తాడోపేడో | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 12,2022

తాడోపేడో

- 24 గంటల్లో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం ప్రకటించండి
- కేంద్రానికి సీఎం కేసీఆర్‌ అల్టిమేటం
- జైలుకు పంపుతారా.. దమ్ముంటే రండి
- భూకంపం సృష్టిస్తాం
- కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను పరిగెత్తిస్తాం
- ఢిల్లీ దీక్షలో సీఎం కేసీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
           రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదో 24 గంటల్లో తేల్చి చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారనీ, తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. దేశంలోని రైతులు బిచ్చగాళ్లు కాదనీ, దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రధాని మోడీ, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాననీ, తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల గురించి ప్రస్తావిస్తే సీబీఐ, ఈడీల పేరు చెప్పి ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు...దమ్ముంటే రండి  అని సవాల్‌ విసిరారు. దేశంలో భూకంపం సృష్టిస్తామంటూ కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని విమర్శించారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా... వాళ్ల దగ్గరకు ఈడీ, సీబీఐ ఎందుకు వెళ్లదని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులను ఇలాగే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోయల్‌ పరుగులు తీయాల్సిందే...
           ''హిట్లర్‌, నెపోలియన్‌ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు ఎందుకు ఇంత అహంకారం. దేశంలో భూకంపం సృష్టించి, ఆయన్ని పరుగులు పెట్టిస్తాం'' అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ''కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలంటూ ఉల్టాపల్టా మాట్లాడుతున్నారు. ఆయనకు రైతులపై ఏమైనా అవగాహన ఉందా... అంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడతారు. మా రైతులను, మంత్రులను అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోం'' అని హెచ్చరించారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు సిగ్గుండాలి..
           కేంద్రం పంట మార్పిడి చేయాలని సూచించిందని తాను రైతులకు చెప్పానన్నారు. కానీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు ఉద్దేశపూర్వకంగా రైతులు ధాన్యం పండిస్తే, కేంద్రంతో కొనిపిస్తామంటూ బీరాలు పలికారని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనాలని తాము ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే, సిగ్గులేకుండా ఇప్పుడు హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద వాళ్లు పోటీగా ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ హిందీలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
కేంద్రానికే సిగ్గుచేటు : రాకేశ్‌ తికాయత్‌
           దేశంలో రైతులు మరణిస్తూనే ఉండాలా...అని జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చి దీక్షలు చేస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన నిరసన దీక్షకు ఆయన సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలనీ, లేకుంటే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో 13 నెలల పాటు ఉద్యమించామని చెప్పారు. కేంద్రం ఏడాదికి మూడు విడతలుగా రైతులకు రూ. 6 వేలు ఇస్తూ, వారిని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు.
జ్యోతిబా పూలేకు నివాళులు
           రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టింది. దీక్షలు ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్‌, జాతీయ రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాలు సమర్పించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
వెరీ స్పెషల్‌ ఎమ్మెల్యే సండ్ర
           ఢిల్లీ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నలుపు రంగు ప్యాంటు, షర్టు ధరించిన ఆయన కావడిలో ముందువైపు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో, వెనుక వరి కంకులు వేసుకొని, ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి వచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.