Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైస్‌మిల్లర్లతో టీఆర్‌ఎస్‌ సర్కారు కుమ్మక్కు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 12,2022

రైస్‌మిల్లర్లతో టీఆర్‌ఎస్‌ సర్కారు కుమ్మక్కు

- అందుకే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం
- కేసీఆర్‌ అంటే కల్వకుంట్ల కరప్షన్‌రావు
- ఇందిరాపార్కు వద్ద దీక్షలో కేంద్ర మంత్రి మురళీధరన్‌
- కేసీఆర్‌ చేతనైతే వడ్లు కొను..లేకుంటే గద్దె దిగు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
           రైస్‌ మిల్లుల యజమానులతో టీఆర్‌ఎస్‌ కుమ్మక్కు అవ్వటం వల్లనే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతున్నదనీ, దీనివల్ల తక్కువ రేటుకు అమ్ముకుని రైతులు మోసపోతున్నారని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్‌ ఆరోపించారు. కేసీఆర్‌ అంటే కల్వకుంట్ల కరప్షన్‌రావు, కమీషన్‌రావు అని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిపార్కు వద్ద 'కేసీఆర్‌ వడ్లు కొను లేదా గద్దె దిగు' నినాదంతో బీజేపీ రైతు దీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మురళీధరన్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నం చేయట్లేదని విమర్శించారు. ఏడేండ్లలో తెలంగాణలోని రైతుల కోసం కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని వివరించారు. అసలు కేసీఆర్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అక్కడి వరకు వెళ్లి కేంద్రాన్ని కనీసం ఏమైనా అడిగారా? అని ప్రశ్నించారు. కమీషన్‌రావు మన సైనికులను, సైనికాధికారులను కాకుండా పాకిస్థాన్‌ వాళ్ళను నమ్ముతాడని ఆరోపించారు. కేసీఆర్‌ దేశాన్ని మిస్‌ లీడ్‌ చేస్తూ 'చీఫ్‌ మిస్‌ లీడర్‌' అయ్యాడన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్‌ మాట్లాడుతూ..డాడీ డాడీ సీఎం చేయి అని కేటీఆర్‌ గొడవపెడుతుంటే కుర్చీ పోతుందనే భయంతో కేసీఆర్‌ ప్యాడీప్యాడీ అని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు, కరెంటుబిల్లుల అంశాన్ని పక్కదోవపట్టించేందుకే ఢిల్లీ ధర్నా డ్రామాలన్నారు. ఫిబ్రవరిలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఈసారి తెలంగాణ నుంచి ధాన్యం ఇవ్వడం లేదని చెప్పి రైతుల బతుకులు ఆగం చేసింది నిజం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతలకు ఊడిగం చేసేటోళ్లకు రైతు సమన్వయ సమితుల బాధ్యతలప్పగించారని విమర్శించారు. కేసీఆర్‌ చేతనైతే వడ్లు కొను.. లేదంటే గద్దె దిగు అన్నారు. రాష్ట్రం ధాన్యం సేకరిస్తే కేంద్రం కొనటానికి సిద్ధంగా ఉందని చెప్పారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..పీకే వచ్చాడంటేనే కేసీఆర్‌ పని ఖతమైనట్టేనన్నారు. వ్యవసాయాన్ని, దానికి అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ రంగాన్ని కేసీఆర్‌ నాశనం చేశాడని విమర్శించారు. గవర్నర్‌ వ్యవస్థను అవమానించేలా వ్యవహరించడం సంస్కారం కాదన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఖజానా ఖాళీ కావడంతోనే ధాన్యం కొంటలేడనీ, కనీసం ఉద్యోగులకు జీతమిచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని విమర్శించారు. పీయూష్‌ గోయల్‌ నూకలు తినమని చెప్పాడా కేటీఆర్‌ అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో ఎంపీలు బాపూరావు, డి.అర్వింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ వివేక్‌, రవీంద్రనాయక్‌, నేతలు జి.మనోహర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌, ప్రేమేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.