Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిరుపేదల ఇండ్లపై కేంద్రం పేచీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 13,2022

నిరుపేదల ఇండ్లపై కేంద్రం పేచీ

- లబ్దిదారుల జాబితా కావాలంటూ షరతులు
- నిధుల విడుదలకు ససేమిరా
- అసహానంలో కేసీఆర్‌ సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
             గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లులేని నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న పథకాలకు కేంద్రం వైఖరితో విఘాతం కలిగే ప్రమాదం కనిపిస్తున్నది. ఎన్డీయే సర్కారు అమలుచేస్తున్న ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన పథకం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటే తమకు ముందుగా లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కేంద్రం షరతులు పెట్టడమే ఇందుకు సాక్షం. అయితే, తాము రాష్ట్రంలో ప్రతిష్టాత్మక డబుల్‌ బెడ్‌రూం పథకాన్ని అమలుచేస్తున్నామనీ, లబ్ధిదారుల జాబితా ముందుగా ఇవ్వడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇలా అయితే తాము మొత్తం నిధులు ఇవ్వబోమంటూ కేంద్రం అల్టిమేటమ్‌ ఇస్తుండగా, పేదల సొంతింటి కలను నిజంచేసే ప్రయత్నాలకు మోడీ సర్కారు ఇలా ఆటంకాలు సృష్టిస్తే ఎలా అని కేసీఆర్‌ సర్కారు అభిప్రాయపడుతున్నది. రాష్ట్రం ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా ఈ తరహాలోనే పథకాన్ని అమలుచేస్తే, ఇదివరకు తాము ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుంటామని కేంద్రం బెదిరిస్తున్నట్టు సమాచారం. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో ఉప్పునిప్పులా వాతావరణం మారినట్టు తెలిసింది.
             కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ఇండ్లు లేని నిరుపేదలకు గృహనిర్మాణం కోసం నిధులు కేటాయించింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ) పథకానికి రూ. 20 వేల కోట్లు, పీఎంఏవై(అర్భన్‌)కు రూ.28 వేల కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా గ్రామాల్లో 50 లక్షల ఇండ్లు, పట్టణాల్లో 30 లక్షల ఇండ్లను కట్టాలని భావిస్తున్నది. తమ మార్గదర్శకాలను పాటించకపోతే ఇచ్చిన డబ్బులను కూడా తాము వెనక్కి తీసుకుంటామని పట్టుబడుతున్నది. ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల జాబితాను తమకు ముందుగా అందజేస్తేనే తాము నిధులు విడుదల చేస్తామని చెబుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్‌బెడ్‌రూం పథకం పీఎంఏవై నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కేంద్రం కుంటిసాకులు వెతికే ప్రయత్నం చేస్తున్నది. అందుకే తాము డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు నిధులు ఇవ్వబోమని చెబుతున్నది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితులు ధరల నేపథ్యంలో కేంద్రం ఇచ్చే 14 శాతంతో ఇండ్ల నిర్మాణం సాధ్యమేనా ? అని రాష్ట్రం వాధిస్తోంది. పరిస్థితిని అర్థం చేసుకుని కేంద్రం తమ పథకానికి అనుగుణంగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నది.
             కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామణ ఆవాస్‌ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్‌ యోజన పథకాలను అమలుచేస్తున్నది. ఇందులో 2016-17లో రాష్ట్రానికి మొత్తం 50,959 ఇండ్లను కేటాయించింది. అందుకు కేంద్ర ప్రభుత్వ వాటాను ఇస్తామని తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు మోడ్‌(ఈ-టెండర్‌)లతో గృహాల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. అలాగే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పథకానికి రూపకల్పన చేసింది. రూ.5.04 లక్షలతో ఇండ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందడగు వేసింది. అయితే కేంద్రం నిధులతో కలుపుకుని నిర్మాణం చేపడుతున్నది. రూ.5.04 లక్షలతో కేంద్రం వాటా(రూ.72 వేలు) ఇస్తుంది. మిగతా 86 శాతం (రూ.4.32 లక్షలు) రాష్ట్రం ప్రభుత్వం చెల్లిస్తున్నది. కేంద్రం అనుమతిచ్చిన 50,959 ఇండ్ల నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.2,568.33 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.381.58 కోట్లు కాగా, రాష్ట్రం వాటా మిగతా రూ.2,186.75 కోట్లు. కాగా కేంద్రం చెల్లించాల్సిన స్వల్ప వాటాలో ఇప్పటికే రూ.190 కోట్లు ఇవ్వగా, మిగతా రూ. 191.58 కోట్లను పనిగట్టుకుని తొక్కిపట్టింది. ఈ నిధుల పెండింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణమంటూ కుంటిసాకులు చెబుతున్నది. తాము అడిగినట్టు లబ్ధిదారుల జాబితా ఇస్తేనే మిగతా నిధులు విడుదలచేస్తామని బెదిరిస్తున్నది. లేకపోతే ఇప్పటికే ఇచ్చిన నిధులు తిరిగిపంపాలంటూ అల్టిమేటమ్‌ ఇస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్రం చెప్పినట్టు జాబితా ఇవ్వడమా ? లేక కేంద్రం ఇచ్చే 14 శాతం నిధులు వదులుకోవడమా ? అనేది తేల్చుకోవాల్సి ఉంది. అయితే సిబ్బంది కరోనా బారిన పడటంతో లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చోటుచేసుకోవడంతో జాబితాను అప్‌లోడ్‌ చేయడం ఆలస్యమవుతున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలి జాబితాను పంపామని, రెండో జాబితానూ త్వరలోనే పంపిస్తామనీ, కొంత సమయం కావాలని పేరు రాయడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.