Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 13,2022

ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ

- మిర్యాలగూడలో ఘరానా మోసం
- గత నెలలో ఓ బాధితుడి ఆత్మహత్య
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
- ఇద్దరి అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితుడు
నవతెలంగాణ -మిర్యాలగూడ
           ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి వారి నుంచి సుమారు రూ.1.60 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టారు. ఈ ఘరానా మోసం మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డ్‌లో ఉంటున్న ఉమ్మడి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం మెదక్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వెంకట్‌రెడ్డి మిర్యాలగూడ నాగార్జున జూనియర్‌ కళాశాలలో పనిచేసిన సమయంలో 2017లో సుమారు 25 మంది వద్ద రూ.1.60 కోట్లు వసూలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఎయిడెడ్‌ స్కూల్స్‌ కాలేజీల్లో పోస్టులు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ఎయిడెడ్‌ పోస్టుల భర్తీ జీవో జారీ చేయగా ఆ జీవో చూపి నిరుద్యోగులకు ఆశ కల్పించారు. ఆ సంస్థ ఎడ్యుకేషన్‌ చైర్మెన్‌గా ఉన్న సిహెచ్‌.అంజనప్రసాద్‌ ద్వారా ఒంగోలు, కర్నూలు, బాపట్ల, మార్కాపురంలో ఉన్న కాలేజీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికారు. రూ.5 నుంచి 12 లక్షల చొప్పున వసూలు చేశారు. 2017 జులైలో పోస్టు ద్వారా సంస్థ పేరుతో 25 మందికి ఆర్డర్‌ కాపీలను పంపించారు. అక్టోబర్‌ 3వ తేదీ లోపు జాయినింగ్‌ కావాలని సూచించారు. తిరిగి అక్టోబర్‌ 1న పోస్టు ద్వారా మరో ఆర్డర్‌ కాపీని పంపించారు. ప్రస్తుతం కాలేజీలలో సమస్యలు ఉన్నాయని, జాయినింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆర్డర్‌ కాపీని పంపించారు. అప్పటి నుంచి రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. 2021 మేలో నిరుద్యోగులను అంజన ప్రసాద్‌, వెంకట్‌రెడ్డి తమ స్నేహితుడైన విజయరామరాజు వద్దకు తీసుకొని వెళ్లారు. 2021 సెప్టెంబర్‌ వరకు వేచి చూడండి.. అప్పటికి ఉద్యోగాలు రాకపోతే మీ డబ్బులు అక్టోబర్‌ 10 నాటికి తిరిగి ఇస్తామని చెప్పాడు. అప్పటి నుంచి డబ్బులు ఇవ్వకుండా రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. కాగా పట్టణానికి చెందిన బాధితుడు వెంకటేశ్వరరెడ్డి గత నెల 22న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధితులు వెంకట్‌రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ నిగడాల సురేష్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి మెదక్‌లో ఉన్న వెంకట్‌ రెడ్డి, విజయరామరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడైన అంజనప్రసాద్‌ పరారీలో ఉన్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 11 మంది నిరుద్యోగులు సుమారు రూ.60 లక్షల ఇచ్చారని అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మోసగాళ్లను నమ్మొద్దు : డీఎస్పీ
           ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. తొందరపడి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. పభుత్వ ఉద్యోగాలు, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దు. అలాంటి వారి వివరాలను పోలీసులకు అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చినవాల్ల గురించి గోప్యంగా ఉంచుతాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.