Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 14,2022

రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం

- జీఎస్టీ పేరుతో పెత్తనం చేసే కుట్ర : ఓయూలో జాతీయ సదస్సులో వక్తలు
- ''కేంద్ర, రాష్ట్రాల మధ్య భావసారూప్యత కొరవడితే భారత జాతికి ప్రమాదం'' అంశంపై సదస్సు
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని సదస్సులో వక్తలు ఆరోపించారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న డబ్బును తన గుప్పిట్లో పెట్టుకుని ఆధిపత్యం చలాయించే కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్ర జాబితాలోని అంశాలను సాకుగా తీసుకుని పెత్తనం చేసే కేంద్రం కుట్రను తిప్పికొట్టాలని, రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో 'ఓయూ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ లా'' ఆధ్వర్యంలో ఇక్కడి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటినరీ సెమినార్‌ హాల్‌లో ''సమాఖ్య భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య భావసారూప్యత కొరవడితే భారత జాతికి ప్రమాదం'' అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఇది రెండురోజులు కొనసాగనుంది. మొదటిరోజు రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, ఓయూ లా డీన్‌, సెమినార్‌ నిర్వాహకులు ప్రొ.గాలి వినోద్‌కుమార్‌, ఓయూ లా డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కేంద్రం దిగజారుస్తోందన్నారు. రాష్ట్రాలపై ఉమ్మడి అంశాల ఆధారంగా పెత్తనం చేయాలని చూస్తోందని, నియంతృత్వ విధానాలు అమలు చేస్తోందని, ఇది సరైంది కాదని అన్నారు.
ఎంపీ కె.కేశరావు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోని అంశాలను సవరించి రాష్ట్రాలకు సంపూర్ణమైన అధికారం దక్కేలా రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు కలిగిన మన దేశం రాష్ట్రాల సమాఖ్య భారతదేశం అని, అధికరణ ఒకటి దీనిని స్పష్టం చేసిందని చెప్పారు. అందుకు బిన్నంగా బీజేపీ ప్రభుత్వం ఒకే భాష, ఒకే దేశం, ఒకే పన్నులు, విద్యా విధానాలతో రాష్ట్రాల హక్కులను హరించాలని చూస్తోందన్నారు. సమైక్య భారతదేశం ఏర్పడాలంటే భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రజలందరికీ వర్తించాలన్నారు.
ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించరాదని, ఇది రాజ్యాంగంలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిధిలోని విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం వంటి మౌలిక అంశాలపై గుత్తాధిపత్యం చలాయించే యత్నం చేస్తోందని చెప్పారు.
సెమినార్‌ నిర్వాహకులు, అధ్యక్షత వహించిన ఓయూ లా విభాగం డీన్‌ ప్రో.గాలి.వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే కేంద్రీకృత నియంతృత్వ విధానాలను అమలు చేయాలని చెప్పారని, సాధారణ సమయంలో కాదని తెలిపారు. రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు కొనసాగాలన్నారు. అన్ని మతాలు, భాషలు, ప్రాంతాలను సమానంగా గౌరవించాలన్నారు. సదస్సులో నేషనల్‌ లా యూనివర్సిటీ కొచ్చి వీసీ ప్రొ.కెసి.సన్నీ, ఓయూ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లా వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాధిక యాదవ్‌, లీగల్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. రాంప్రసాద్‌, ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాల్స్‌, స్కాలర్స్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.