Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టెట్‌ అభ్యర్థులు ఆగం! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 14,2022

టెట్‌ అభ్యర్థులు ఆగం!

- దరఖాస్తు చేసుకోని వేలాది మంది మనోవేదన
- గడువు పెంచాలంటూ ప్రభుత్వానికి వేడుకోలు
- సవరించే అవకాశమివ్వని అధికారులు
- విద్యాశాఖ తీరుపై ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'మూడు రోజుల నుంచి టెట్‌ సర్వర్‌ డౌన్‌ అయ్యింది. అందుకే సకాలంలో ఫీజు చెల్లించలేకపోయాను. దాని వల్ల దరఖాస్తు చేయలేదు. ప్రభుత్వం మానవత్వంతో అర్థం చేసుకుని దరఖాస్తు గడువును పొడిగించాలి'అంటూ ఆదిలాబాద్‌కు చెందిన ఓ అభ్యర్థి నవతెలంగాణతో వాపోయారు.
'ఈనెల 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు అవకాశమున్నది. అయితే ఫీజు చెల్లింపు, దరఖాస్తు ఒకేసారి చేస్తే సరిపోతుందని నేను భావించాను. కానీ ఈనెల 11వ తేదీ వరకే ఫీజు చెల్లింపునకు గడువుందని తెలియదు. అందువల్ల దరఖాస్తు చేయలేదు. టెట్‌కు దరఖాస్తు చేయకపోతే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశముండదు. అధికారులు స్పందించి మరోసారి దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలి.'అంటూ నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన మరో అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు వివిధ కారణాలతో దరఖాస్తు చేయకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. తమ బతుకులు ఆగమవుతాయనీ, దరఖాస్తు చేసేందుకు గడువు పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసే గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ సేవలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం, సర్వర్‌ డౌన్‌ కావడం, ఆర్థిక, ఇతర సమస్యల కారణంగా సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఇంకోవైపు చాలా మంది పరీక్ష ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణ ప్రక్రియను చివరిరోజు చేయాలని భావించారు. కానీ దరఖాస్తు సమర్పణకు ఒక రోజు ముందే ఫీజు గడువు ముగియడంతో ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు గడువును పెంచకపోవడం పట్ల విద్యాశాఖ అధికారుల తీరుపట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అభ్యర్థుల మనోభావాలను అర్థం చేసుకుని టెట్‌ దరఖాస్తు గడువును పొడిగించాలంటూ డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాలు కోరుతున్నాయి.
భవిత ప్రశ్నార్ధకం
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్నది. అందుకే టెట్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అభ్యర్థులు ఎక్కువ మంది రాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే టెట్‌ను తెలంగాణలో చివరిసారిగా 2017, జులైలో నిర్వహించారు. సుమారు ఐదేండ్ల తర్వాత మళ్లీ టెట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే గతనెల 24న టెట్‌ నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) జారీ చేసింది. గతనెల 26వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 12వ తేదీ వరకు కల్పించింది. ఇక ఫీజు చెల్లింపునకు మార్చి 26 నుంచి ఈనెల 11వ తేదీ వరకు అవకాశమిచ్చింది. అంటే ఫీజు చెల్లింపునకు 17 రోజులు, దరఖాస్తు చేసేందుకు 18 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో అభ్యర్థులు సకాలంలో ఫీజు చెల్లించడంతోపాటు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇంకోవైపు దరఖాస్తుల్లో లోపాలు, తప్పులుంటే సవరణ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించకపోవడం పట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపడుతున్నారు. దీంతో అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జేఈఈ, నీట్‌ సహా ఎంసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఆలస్య రుసుంతోపాటు, దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశముంటుంది. కానీ టెట్‌ అధికారులు అలాంటి అవకాశం కల్పించకపోవడం గమనార్హం. ఇంకోవైపు దరఖాస్తుల్లో తప్పులుంటే హాల్‌టికెట్‌ జారీ చేయబోమనీ, పరీక్షలకు అనుమతివ్వబోమంటూ చెప్పడం దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్య రుసుంతోనైనా దరఖాస్తులు స్వీకరించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తప్పులుంటే హాల్‌టికెట్లు ఇవ్వబోమనడం సరికాదు : రామ్మోహన్‌రెడ్డి
టెట్‌ దరఖాస్తుల్లో తప్పులుంటే సవరించేందుకు అవకాశం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా అభ్యర్థులకు హాల్‌టికెట్లు ఇవ్వబోమంటూ ప్రచారం చేయడం సరైంది కాదని తెలంగాణ డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సవరణ అవకాశం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అభ్యర్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌ రాకుంటే అభ్యర్థుల భవిష్యత్‌ ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
టెట్‌ దరఖాస్తు గడువును పొడిగించాలి :
ఆర్‌ఎల్‌ మూర్తి
టెట్‌ దరఖాస్తు గడువును పొడిగించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి డిమాండ్‌ చేశారు. గత మూడు రోజులుగా టెట్‌ వెబ్‌సైట్‌ సర్వర్‌ డౌన్‌ కావడంతో అభ్యర్థులు ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు ఇబ్బంది పడ్డారని తెలిపారు. దరఖాస్తు చేసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మరో వారం రోజులపాటు దరఖాస్తు గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
టెట్‌కు 6.29 లక్షల దరఖాస్తులు
టెట్‌కు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. రికార్డుస్థాయిలో 6,29,352 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) డైరెక్టర్‌, టెట్‌ కన్వీనర్‌ ఎం రాధారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌ పేపర్‌-1కు 3,51,468, పేపర్‌-2కు 2,77,884 కలిపి మొత్తం 6,29,352 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. టెట్‌కు 3,80,589 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.