Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మిల్లర్లతో టీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మక్కు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 14,2022

మిల్లర్లతో టీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మక్కు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
'వరి ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనాలి. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలి. జీవో 111 రద్దు వెనుక భారీ ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఉందనీ, దానిపైన విచారణ జరిపించాలి. ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటును అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ అధ్యాపకులు వయసును ఏకపక్షంగా పెంచడం సరైంది కాదనీ, ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం తక్కువగా చూపించింది' అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్‌ నాయకులు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌, వి హనుమంతరావు, నాగం జనార్ధన్‌రెడ్డి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌ తదితరులు ఉన్నారు. అనంతరం రేవంత్‌, కోమరెట్డి వెంకట్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నేతలు రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ కాలయాపన చేశారని తెలిపారు. ఫలితంగా చాలా మంది రైతులు రైస్‌ మిల్లర్లకు, మధ్యదళారీలకు ఇప్పటికే రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధాన్యాన్ని మద్దతు ధరకు రైతుల నుంచి కొనాలని కోరారు. మద్ధతు ధర రాక రైతులు రూ.3000 - రూ 4000 కోట్లమేర నష్టపోయారని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చెప్పిందంటూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్న రైతుల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల్లో 8.34 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం లెక్క తప్పిందని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రైస్‌ మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యం ఎలా మాయమయ్యాయని ప్రశ్నించారు.
కరోనా కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఉన్న ప్రజలపై కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో భారం మోపుతుంటే, ఇటు రాష్ట్రం నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు కరెంట్‌ ఛార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పుడు విధానాలతో డిస్కమ్‌లు నష్టాల్లో కూరుకుపోయాయని గుర్తు చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదనీ, ప్రయివేటు బడాబాబుల నుంచి రూ.4800 కోట్లపై చిలుకు బిల్లులు వసూలు చేసుకోలేక ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని పేర్కొన్నారు. తక్షణం ప్రజలపై భారాలు తగ్గించేలా చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. 2017లో ఈ కేసును ప్రచారం కోసం వాడుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం... ఆ తర్వాత ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పబ్‌ల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి, చర్యలు తీసుకోవాలని కోరారు. బిస్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుర్మార్గంగా వాటిని 90 వేలకు కుదించి చూపుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3016 భృతికి దిక్కులేదనీ, వెంటనే నిరుద్యోగ భృతి కూడా ఇప్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటు చేయడమంటే, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడమేనని తెలిపారు. ఈ చర్యను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు.
జీవో 111 ఎత్తివేత సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా సీఎం చెప్పారనీ, ఆ కమిటీ నివేదిక రాకుండానే జీవో ఎత్తేస్తున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. దీని వెనుక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఉందని ఆరోపించారు. గడచిన ఐదేండ్లలో ఈ ప్రాంతంలో సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేద, మధ్య తరగతి రైతుల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. వారికి లబ్ధి చేకూర్చేలా సీఎం నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్దననీ, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.