Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొనకుండ ఉండలేం...! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 15,2022

కొనకుండ ఉండలేం...!

- పేదోడి ఫ్రిజ్‌కు భలే గిరాకీ
- వేసవిలో మట్టి కుండలకు డిమాండ్‌
- ఫ్రిజ్‌ల రాకతో కుదేలైన కుమ్మరుల చేతివృత్తి
- ఎండాకాలంలో ఆదరణ అపూర్వం
నవతెలంగాణ- నల్లగొండ
            ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో పట్టణాలతో పాటు పల్లెల్లోని ప్రజలు కుండల్లోని చల్లటి నీటినే తాగేందుకు ఇష్టపడు తున్నారు. ప్రకృతి సిద్ధంగా నీటిని చల్లబర్చే గుణం మట్టి కుండలకు ఉండటంతో వీటిలోని నీటినే తాగేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. పట్టణాలు, పల్లెల్లో ఇప్పటికి చాలా మంది ఫ్రిజ్‌లు వాడుతున్నా, మార్కెట్‌లో దొరికే వివిధ ఆకృతుల్లో తయారు చేస్తున్న మట్టి కుండలను కూడా వారి హౌదాకు తగ్గట్టుగా కొనుగోలు చేసి వాటిలో నీటిని తాగుతున్నారంటే అతిశయోక్తికాదు. ఎన్నిరకాల ఫ్రిజ్‌లు వచ్చినా నేటికీ పేదోడి ఫ్రిజ్‌గా పేరున్న కుండలకు మాత్రం ఆదరణ తగ్గలేదు. కుండల అడుగుభాగంలో ఇసుక మట్టిని కలిపి వాటిలో వడ్ల గింజలు వేసి కుండకు చుట్టూగుడ్డను చుట్టి తరుచూ వాటిని తడుపుతూ ఉండటంతో కుండల్లో నీళ్లు ఎక్కువగా చల్లబడుతాయి. దీంతో వీటి గిరాకీ ఎక్కువగానే ఉంది. ఈ కుండలు వివిధ సైజులు, ఆకృతులను బట్టి వాటి ధర నిర్ణయించబడి ఉంటుంది. ప్రస్తుతం నల్లగొండజిల్లా వ్యాప్తంగా రూ.30 నుంచి రూ.100 వరకు రేట్లలో లభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా పట్టణ ప్రాంతాల్లో కుండలకు ఆదరణ ఉండటంతో రేట్లు కూడా ఒకే రకంగా ఉండవు.
వృత్తే ఆధారం.. జీవనం..
            అందరికీ అందుబాటులో ఉండే ధరలతోపాటు, చల్లని నీటిని, చక్కని ఆరోగ్యాన్ని అందించే కుండల తయారీ వెనుక ఎంతో మంది చెమటచుక్కలు ఉన్నాయి. ఎంతో శ్రమకోర్చి తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తేగానీ మంచి ఆకృతిలో ఉన్న కుండలు గానీ, కుజాలు గానీ తయారు కావు. కుండల తయారీలో కూడా ఎంతో ఓర్పు, నేర్పుతోపాటు కళానైపుణ్యం కూడా ఉండాలి. కుమ్మరి వృత్తి కనుమరుగవుతున్న నేటికాలంలో ఇప్పటికీ అందమైన కళా ఖండాలుగా కుండలు కన్పిస్తున్నాయంటే అవి కొందరి కళానైపుణ్యంతో పాటు కులవృత్తినే దైవంగా భావించే వారి వల్ల మాత్రమే నేడు మనం చూడగల్లుతున్నాం. ఇలాప్రతీ వేసవి వచ్చిదంటే చాలా కుండల తయారీదారులు తమ పనిలో నిమగమవుతారు.
ఇలా తయారు చేస్తారు.
            కుండలను తయారు చేసేందుకు మట్టికోసం పరుగులు పెట్టాల్సిన పనిలేదు. మండల కేంద్రాలు, గ్రామాల్లో చెరువులు అధికంగా ఉండటంతో తయారీకి అవసరమయ్యే ఒండ్రుమట్టి పుష్కలంగా దొరుకుతుంది. మట్టిని తీసుకొచ్చి దానిని జల్లెడపడతారు. మట్టిలో ఉన్న వ్యర్థపదార్థాలు తొలగించాక ఒక తొట్టిలో పోసి నానబెడతారు. అనంతరం బాగా కలియబెడుతూ కాళ్లతో తొక్కుతారు. బాగా చిక్కగా జిగటగా రాగానే ఒక రోజుపాటు తొట్టిలోనే ఉంచుతారు. మరుసటిరోజు ముద్దలుగా తీసి సారెపై పెట్టి వివిధ ఆకృతుల్లో మట్టి కుండలు తయారవుతాయి. వాటిని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టి కొలిమిలో కాల్చడంతో కుండలు పటిష్టంగా తయారవుతాయి. ఇలా తయారైన కుండలను ఆయా కేంద్రాల్లో అమ్మకానికి ఉంచుతారు. అంతేకాకుండా సంతల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు.
ఫ్రిజ్‌ నీరు ఆరోగ్యానికి చేటు..
            వేసవిలో దాహార్తిని తీర్చేందుకు వేలాది రూపాయలు ఖర్చుచేసి కొనుకుంటున్న ఫ్రిజ్‌లు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. చల్లని మట్టికుండల్లో నీటిని తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రతిఇంట్లో కూరగాయలు మొదలు నిత్యం వాడుకునే వస్తువులను నిల్వ ఉంచుకునేందుకు ఫ్రిజ్‌ నిత్యావసర వస్తువైంది. తక్కువ ఖర్చుతో ఎలాంటి కరెంటు ఖర్చులూ లేకుండా స్వచ్ఛమైన చల్లటి నీటిని ఇచ్చే కుండలను వాడితే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.