Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తిరోగమనం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 17,2022

తిరోగమనం

- మూసివేత దిశగా సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కు
- 70 యూనిట్లలో ఇప్పటికే 10 యూనిట్లు మూసివేత
- పాత ఇనుపసామాను కింద 300 మరమగ్గాల అమ్మకం
- పెరిగిన నూలు ధర.. మార్కెట్‌లోనేమో తగ్గిన వస్త్రం ధర
- ఈసారి బతుకమ్మ ఆర్డరూ.. రాలే..
- చేసే పనేదీ లేక మగ్గాలను అమ్ముకుంటున్న దైన్యం
- బతుకమ్మ ఆర్డర్లు వచ్చే మ్యాక్‌ సొసైటీలదీ ఇదే పరిస్థితి..
- పది మంది చేతుల్లోనే పరిశ్రమ
            ముసురుకొచ్చిన సమస్యలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను మూసివేసే దిశగా తీసుకెళ్తున్నాయి. మార్కెట్‌లో యారన్‌ ధర పెరిగితే.. వస్త్రం ధర మాత్రం తగ్గడంతో గిట్టుబాటుకావడం లేదు. మరోవైపు ప్రభుత్వం బతుకమ్మ ఆర్డర్లు ఇస్తున్నా.. వాటి లాభాలు పరిశ్రమల్లోని పట్టుమని పదిమంది ఓనర్ల జేబుల్లోకే వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ ఆర్డర్ల ఊసే లేక, గతంలో ఇస్తామన్న యారన్‌ సబ్సిడీ ఖాతాలో జమకాక ఆసాములు అప్పులపాలవుతున్నారు. కనీసం ఇస్తామన్న విద్యుత్‌ రాయితీ ఇవ్వకపోవడంతో కనీస కూలి గిట్టుబాటుకావడం లేదు. దీనికితోడు కరోనా ధాటికి రెండేండ్లు విలవిల్లాడిన పరిశ్రమ ఇప్పుడు కోలుకునే పరిస్థితిలో లేక.. మరమగ్గాల భాగాలను పాత ఇనుపసామానుకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులపై నవతెలంగాణ ప్రత్యేక కథనం...
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్లటౌన్‌
             ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2003లో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో అప్పటి సర్కారు తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో టెక్స్‌టైల్‌పార్క్‌ ఏర్పాటు చేసింది. 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.7.76కోట్లతో ఆధునిక మరమగ్గాలను తెచ్చి వస్త్ర పరిశ్రమనే ఏర్పాటు చేసింది. అయితే, 217 ప్లాట్లతో పార్క్‌లో స్థలం కేటాయించినా కేవలం 70 పరిశ్రమలు మాత్రమే ప్రారంభమై ఇన్నాళ్లూ వస్త్రం ఉత్పత్తి చేశాయి.
విద్యుత్‌ సబ్సిడీ రాదు.. సర్కారు ఆర్డర్లు అందవు..
టెక్స్‌టైల్‌ పార్క్‌లోని పరిశ్రమలకు ఇచ్చిన విద్యుత్‌ కనెక్షన్‌కు చార్జీ చేసే యూనిట్‌కు రూ.7లో సగం మేర సర్కారే రాయితీ రూపంలో భరిస్తుందని తెలిపింది. ఆరేండ్లు గడిచినా ఇంతవరకు రూపాయి సబ్సిడీ కూడా చెల్లించలేదు. స్థానిక ఎమ్మెల్యే, పురపాలకశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌ 2021 జూన్‌లో చేనేత జౌళిశాఖ అధికారులు, టెక్స్‌టైల్‌ పార్క్‌లోని యజమానులతో సమావేశం నిర్వహించారు. 2015 నుంచి 2020 మధ్య ఇవ్వాల్సిన విద్యుత్‌ రాయితీని చెల్లిస్తామని చెప్పారు. ఆయన హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ రూపాయి అందలేదు. మరోవైపు టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఉత్పత్తి చేస్తున్న వస్త్రానికి వినియోగించే ముడిసరుకు యారన్‌ (నూలు) ధర విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు కిలో నూలు ధర రూ.140పలకగా.. ఇప్పుడు రూ.200కు చేరింది. ముడి సరుకు ధర పెరగడంతో ఉత్పత్తి వ్యయమూ పెరిగింది. కానీ ఆ ఉత్పత్తులకు ధర మాత్రం మార్కెట్‌లో పెరగ లేదు. దీంతో వ్యాపారులు నష్టాలు చవి చూశారు. ఈ అంశమూ వస్త్ర పరిశ్రమ మూతకు కారణమైంది.
ఇంకోవైపు ఐదేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల ఆర్డరు తప్ప మరే ఇతర ఆర్డరూ రావడం లేదు. ఇప్పుడు 2022కు సంబంధించిన బతుకమ్మ చీరల ఆర్డరూ టెక్స్‌టైల్‌ పార్కుకు కేటాయించకపోవడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. 1500 అత్యాధునిక మరమగ్గాలతో సుమారు 70 పరిశ్రమలున్న టెక్స్‌టైల్‌ పార్క్‌లో పది యూనిట్ల మేర సుమారు 300 మరమగ్గాలను అమ్మేశారు. అటు మార్కెట్‌లో గిట్టుబాటు రేటు రాక, ఇటు సర్కారు ఆర్డర్లూ రాక చేసేదేముందని మరమగ్గాలన్నీ అమ్ముకుంటున్నట్టు యజమానులు 'నవతెలంగాణ'తో తెలిపారు.
పదిమంది చేతుల్లోనే పరిశ్రమ..
              సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ... రూ.కోట్లు పెట్టుబడి పెట్టగలిగే కొద్ది మంది యజమానుల చేతుల్లోనే ఉంది. ఆ పది మందే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా, అధికారపార్టీ కీలక నేతలుగా ఉన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని రాయితీలు తీసుకొచ్చినా వారి జేబులే నిండుతున్నాయి తప్ప ఆసాములు, కార్మికుల బతుకులు ఎండుతూనే ఉన్నాయి. అందుకు ఈ చిన్న ఉదాహరణే అద్దం పడుతోంది. సిరిసిల్లలో 10 సాంచెలలోపు ఆసాములు 12 మంది చొప్పున ఏర్పడి.. ఒక్కో మ్యాక్‌ సొసైటీ 180 వరకు ఉన్నాయి. ఇక 25 సాంచెలు.. ఆపై ఉన్న ఆసాములు చిన్న తరహా పరిశ్రమ పేరుతో ఉన్నవారు 190 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రతియేటా ఆర్డరు ఇస్తున్న రూ.350కోట్ల విలువజేసే బతుకమ్మ చీరలను నేసేందుకు మ్యాక్‌ సొసైటీలు, ఈ చిన్నతరహా పరిశ్రమలకే అప్పగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం పెట్టుబడి పెట్టే శక్తిలేని ఆసాములు చివరికి యజమానుల చెంతకే వెళ్తున్నారు. చీరల ముడిసరుకుపై పెట్టుబడి పెట్టే యజమాని ఒక్కో మీటర్‌పై ప్రభుత్వం ఇచ్చే రూ.33లోంచి రూ.7 వరకు లాభం చూసుకుని మిగతాది ఆసాములు, కార్మికులకు కూలి, ఇతర ఖర్చులకు చూపుతున్నాడు. మీటర్‌పై మిగులుతున్న ఏడు రూపాయలే లక్షల మీటర్లలో వచ్చే ఆర్డర్‌పై రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు. ఎటొచ్చీ సాంచెలు నడిపే ఆసాములు, వారి దగ్గర పని చేసే కార్మికులే నష్టపోతున్నారు.
ప్రభుత్వ ఆర్డర్లు సహా విద్యుత్‌ రాయితీ ఇవ్వాలి
అన్నల్‌ దాస్‌ అనిల్‌- టెక్స్‌టైల్‌ పార్క్‌ యజమానుల సంఘం అధ్యక్షులు
నూలు ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్‌లో వస్త్రాలకు గిరాకీ పెద్దగా లేదు. సర్కారు ఆర్డర్లూ మూన్నాళ్ల ముచ్చటగానే ఉన్నాయి. విద్యుత్‌ రాయితీ సహా ప్రభుత్వ ఆర్డర్లు పెంచితే మేము ఏమైనా బతికి బయటపడతాం. లేదంటే అప్పుల ఊబి తప్పదు.
రోడ్డున పడనున్న కార్మికులు
          టెక్స్‌టైల్‌ పార్క్‌ మూతపడితే కనీసంగా వెయ్యి మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడతాయి. వీరికి ఇప్పటికే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేక వచ్చిన కూలికి పని చేసుకుంటున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లులు భరించలేక కూలీలను తీసుకోవడం లేదు. ఉన్న వారికి ఇచ్చే కూలి ఇవ్వలేకపోతున్నారు.

- కోడం రమణ

టెక్స్‌టైల్‌ పార్కు వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.