Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రామునిపై కాదు.. ఢిల్లీ సింహాసనంపైనే ప్రేమ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 17,2022

రామునిపై కాదు.. ఢిల్లీ సింహాసనంపైనే ప్రేమ

- దేశం నుంచి మతతత్వ బీజేపీని తరిమికొడదాం..
- మచ్చలేని నాయకుడు.. ఏజెన్సీ సుందరయ్య కుంజా బొజ్జి
- బొజ్జి స్థూపావిష్కరణ సభలో తమ్మినేని
నవతెలంగాణ-భద్రాచలం
          ప్రజలను రెచ్చగొడుతూ.. దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న బీజేపీకి రామునిపై ప్రేమ కాదని.. ఢిల్లీ సింహాసనంపైనే ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజుపేట కాలనీలో స్మారక స్థూపాన్ని తమ్మినేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించారు. తమ్మినేని మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన సైనికుడు, మచ్చలేని నాయకుడు, ఏజెన్సీ సుందరయ్య భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. రాబోయే కాలంలో భద్రాచలంలో సీపీఐ(ఎం) జెండా గెలిచి తీరాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ ప్రతి కార్యకర్తా, నాయకుడు ప్రజా నాయకుడిగా మారాలని చెప్పారు. మన లోపాలను ఆత్మపరిశీలన చేసుకుని, రాబోయే ఎన్నికలకు నేటి నుంచే సైనికుల వలె పని చేసేలా ముందుకు సాగాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక దేశ సంపదను అమ్మేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు పెట్రో ఉత్పత్తుల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ దేశ ప్రజలపై మోడీ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోపుతోందని విమర్శించారు. ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తూ, పోరాటాలను, ఉద్యమాలను అణచి వేసేందుకు నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజలను రెచ్చగొట్టేందుకు చేస్తున్నట్టే తెలంగాణాలోనూ ఆ విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వామపక్ష శక్తులు, ప్రాంతీయ శక్తులు ముందుకు సాగాలని కోరారు. దుర్మార్గమైన విధానాలను అవలంబిస్తూ దేశంలో కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ సంపదను అప్పజెప్పే పనిలో కేంద్రం ఉందని విమర్శించారు. భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్‌ మీడియం బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సీనియర్‌ నాయకులు పి.సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న అరాచక, దుర్మార్గ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. సమాజాన్ని చదివిన బొజ్జి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. భద్రాచలంలో వరద ముప్పు నుంచి కరకట్ట నిర్మాణం, రెండో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌ గ్రేడ్‌ చేయటంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కుంజా బొజ్జి అహర్నిశలు కృషి చేశారని వివరించారు.కుంజా బొజ్జి ప్రథమ వర్ధంతి సందర్భంగా నవతెలంగాణ తీసుకొచ్చిన ప్రత్యేక సంచికను తమ్మినేని ఆవిష్కరించారు. అదేవిధంగా బొజ్జి స్థూపాన్ని నిర్మించిన మేస్త్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌, గూగులోత్‌ ధర్మ నాయక్‌, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ, నాయకులు యం.బి.నర్సారెడ్డి, కొలగాని బ్రహ్మచారి, కారం పుల్లయ్య, గడ్డం స్వామి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, కుంజా బొజ్జి కుమార్తె, సీఐటీయూ నాయకులు పి.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.