Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధి హామీకి కేంద్రం ఉరి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 17,2022

ఉపాధి హామీకి కేంద్రం ఉరి

- 21న దేశవ్యాప్త ఉద్యమం : ఏఐఏడబ్ల్యూయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
         దేశంలోని వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ పేదలకు పని కల్పించడానికి ఉద్దేశించిన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) విమర్శించింది. ఆ చట్టాన్ని రక్షించాలనే డిమాండ్‌పై 21న దేశవ్యాప్తంగా ఉద్య మించాలనీ, జిల్లా కేంద్రాల్లో సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో ఐదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ సర్కారు మొదట బడ్జెట్‌లో కోత విధించిందని విమర్శించారు. నాలుగు శాతం ఉన్న నిధులను ఇప్పుడు 1.7 శాతానికి తగ్గించిందని వివరించారు. నిధులను తగ్గించడమంటే పరోక్షంగా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని తెలిపారు. ఉపాధి హామీకి రోజువారి వేతనం కాకుండా కొలతల ఆధారంగా వేతనాలు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం సర్క్యులర్‌ ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కార్మికులకు ఉదయం, సాయంత్రం రెండుపూటలా హాజరు తీసుకోవాలంటూ నిబంధన విధించడం సరైంది కాదన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కార్మికులు రెండుపూటలా ఉపాధి హామీ పనులకు వెళ్లడం సాధ్యమేనా?అని ప్రశ్నించారు. రోజుకు రూ.600 ఇచ్చి రెండుపూటలా హాజరు తీసుకోవాలని కోరారు. కానీ కేంద్రం అలాంటి చర్యలకు పూనుకోకుండా నిధులను తగ్గించడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం అమలుకు రూ.రెండు లక్షల కోట్లు ఇవ్వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని వివరించారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు రూ.1.73 లక్షల కోట్లు మాత్రమే కేటాయించిందని పేర్కొన్నారు. కూలీలు పనికిరావడం లేదనే నెపం మోపడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఇంతకుముందు 25 మందికి ఒక గ్రూపు ఉండేదనీ, దాన్ని ఇప్పుడు 40 మందికి ఒక గ్రూపు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఎండాకాలంలో సమ్మర్‌ అలవెన్స్‌ 30 నుంచి 50 శాతం అదనపు వేతనాలు చెల్లించే పద్ధతి ఉండేది గుర్తు చేశారు. ఏటా ఇది అమలు చేస్తారని పేర్కొన్నారు. పర్యావరణం, ఇతర విపత్తుల సమయంలో అదనపు వేతనాలు ప్రభుత్వాలు చెల్లిస్తాయని వివరించారు. ఇప్పుడు సమ్మర్‌ అలవెన్సును కేంద్రం రద్దు చేసిందని విమర్శించారు. నివాస ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలని చట్టం చెప్తున్నదని తెలిపారు. కానీ మోడీ ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోవడం లేదని పేర్కొన్నారు. చట్టం ఉందన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నదని వివరించారు. ఇంతకుముందు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లేవారని గుర్తు చేశారు. ఇప్పుడు పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచ్చి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని వివరించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే అటు పట్టణాల్లో, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పనుల్లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు పడతారనీ, కొనుగోలు శక్తి పడిపోతుందనీ, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులు విలవిల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూకుమ్మడిగా యుద్ధం చేస్తున్నదని విమర్శించారు. ఉపాధి హామీ ఎవరి దయాదాక్షిణ్యం కాదనీ, అది చట్టమనీ, బిక్ష కాదని గుర్తు చేశారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈనెల 21న దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఎస్‌కేఎం, కార్మిక సంఘాలను కోరతామని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో పిలుపునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.