Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సీన్‌ రిపీట్‌! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 18,2022

సీన్‌ రిపీట్‌!

- చెక్‌ డ్యామ్‌ నిర్మాణాల్లో నాసిరకం పనులు
- గతేడాది వరదల్లో కొట్టుకుపోయిన వైనం
- రెండోసారి చేపట్టిన పనుల్లోనూ నాసిరకం
- ప్రజాధనం దుర్వినియోగం
నవతెలంగాణ-మల్హర్‌రావు
           భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులోని మానేరుపై ప్రభుత్వం చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణ పనులు మున్నాండ్ల ముచ్చటగా నాసిరకంగా చేపడుతున్నారు. సంబంధిత ఇరిగేషన్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో గుత్తేదారులు ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్న చందంగా మారింది. గతేడాది ఇదే నెలలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అకాలంగా కురిసిన వర్షాలకు చెక్‌డ్యామ్‌ల పనుల ప్రారంభంలోనే నీటిపాలయ్యాయి. ప్రస్తుతం కూడా నిర్మాణాల్లో అడుగడుగునా డొల్లతనం, నాసిరకపు పనులు కొట్టొచ్చినట్టు దర్శనమిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని పలు గ్రామాల్లో కోట్ల రూపాయలతో చేపట్టిన చెక్‌డ్యామ్‌ నిర్మాణాల్లో అధికారపార్టీ నేతలు, సంబంధిత అధికారులు కుమ్మక్కై కోట్ల నిధులు మింగేసేందుకు యత్నిస్తున్నట్టు బహిరంగ ఆరోపణలూ వస్తున్నాయి.
           పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దునున్న తాడిచెర్ల ఖమ్మంపల్లి, సోమన్‌పల్లి, పీవీనగర్‌, చిన్నఓదల, మల్లారం గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా రూ.14.31 కోట్లతో ఖమ్మంపల్లి నుంచి తాడిచెర్ల మానేరు ఒడ్డు వరకు, రూ.13.40 కోట్లతో సోమన్‌పల్లి, పీవీనగర్‌ మానేరుపై ఒడ్డు వరకు, రూ.14.50 కోట్లతో చిన్న ఓదాల నుంచి మల్లారం మానేరు ఒడ్డు వరకు.. నిర్మాణాలు చేపట్టడానికి సెప్టెంబర్‌ 15, 2020న ఒప్పందం చేసుకున్నారు. 2021 ఫిబ్రవరి 21న నాటి మంత్రి ఈటల రాజేందర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. గతేడాది ఇదే నెలలో పనులు ప్రారంభించగా ప్రభుత్వం రూ.5కోట్లు మంజూరు చేసింది. గుత్తేదారు పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే భారీ వర్షాల మూలంగా మానేరు నదిపై వరదలు రావడంతో చేసిన సగం పనులు నాసిరకంగా చేపట్టడంతో చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. దాంతో పని ప్రదేశంలో నాలుగు బండరాళ్లు, ఇసుక దిబ్బలు మాత్రమే మిగలగా, కోట్ల నిధులు నీటిలో కలిసిపోయి ఇసుక పాలవ్వడంతో ఎంత మేరకు పనులు జరిగాయో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్‌కు పార్ట్‌ పేమెంట్‌ కింద రూ.5లక్షలు మంజూరైనట్టు తెలిసింది. రెండవసారి నిర్మాణ పనులు చేపట్టి మూడు వారాలు దాటుతున్నా పనులు ఇంకా పునాదుల్లోనే కొనసాగుతున్నాయి. దీనికితోడు నాసిరకమైన పనులు చేపట్టడం గమనార్హం. గ్రేడ్‌-53 సిమెంట్‌కు బదులు తక్కువ గ్రేడ్‌ ఉన్న సిమెంట్‌ వాడుతున్నారని, నాసిరకమైన ఇనుపరాడ్లు వినియోగిస్తున్నారని, భూమి లోపలి నుంచి 10ఫీట్ల పిల్లర్లు, 5 ఫీట్ల గోడ నిర్మించకుండా తూతూ మంత్రంగా బెడ్లు పోసి వదిలేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో ఇష్టారీతిన పనులు చేపుడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏడాది పూర్తయినా పనుల్లో అలసత్వం
           భూపాలపల్లి జిల్లా ఖమ్మంపల్లి మానేరుపై నుంచి తాడిచెర్ల ఒడ్డు వరకు డీఎఫ్టీ నిధుల కింద రూ.16.62 కోట్లు, అడవి సోమన్‌పల్లి మానేరుపై నుంచి పీవీనగర్‌ ఒడ్డు వరకు రూ.14.22 కోట్లు మంజూరైనట్టు తెలిసింది. అగ్రిమెంట్‌ మాత్రం ఖమ్మంపల్లి తాడిచెర్ల వరకు రూ. 14.31, సోమన్‌పల్లి, పీవీనగర్‌ది రూ.13.40 కోట్లతో అయింది. మొదటిసారి అగ్రిమెంట్‌ చేసుకుప్పటి నుంచి మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలి. కానీ ప్రస్తుతం ఏడాది పూర్తయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మానేరుపై 500 మీటర్ల పొడవుతో నిర్మాణం చేయనున్న చెక్‌డ్యామ్‌ల కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికైనా పనులు త్వరగా నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి : మలహల్‌రావు, ఎంపీపీ
         మానేరుపై నిర్మాణం చేస్తున్న చెక్‌డ్యామ్‌ పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలి. కోట్ల రూపాయలతో చేపడుతున్న చెక్‌డ్యామ్‌లు పది కాలాలపాటు ఉండాలంటే నిబంధనలు పాటించాలి. లేదంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తాం.
నిబంధనల మేరకే పనులు : రమేష్‌ బాబు, మంథని డీఈ చెక్‌ డ్యామ్‌ నిర్మాణాల్లో నిబంధనల మేరకు గుత్తేదారులు పనులు నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవు. నిర్మాణ పనులపై సంబంధిత ఏఈ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.