Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మిక రాజ్యస్థాపనతోనే దోపిడీ, వివక్షకు అడ్డుకట్ట | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 18,2022

కార్మిక రాజ్యస్థాపనతోనే దోపిడీ, వివక్షకు అడ్డుకట్ట

- అంబేద్కర్‌, ఫూలే, రణదీవె స్ఫూర్తితో పోరాడాలి
- 'సామాజిక సమస్యలు-కార్మిక వర్గ దృక్పథం'పై సీఐటీయూ సెమినార్‌లో ఎస్‌.వీరయ్య
- కేవీపీఎస్‌ పోరాటాలకు సీఐటీయూ రూ.2 లక్షల విరాళం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
           కార్మికులంతా ఐక్య పోరాటంతో సమాజ సమూల మార్పునకు కృషి చేయాలనీ, కార్మిక రాజ్య స్థాపనతోనే దోపిడీ, వివక్ష రూపాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య చెప్పారు. అంబేద్కర్‌, ఫూలే, బీటీ రణదీవె లాంటి మహనీయుల స్ఫూర్తితో కులవివక్ష మీద పోరాడాలనీ, కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలనే కార్యాచరణతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో 'సామాజిక సమస్యలు-కార్మిక వర్గ దృక్పథం' అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. కుల నిర్మూలన కోసం పోరాడుతున్న కేవీపీఎస్‌ సంఘానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ రూ.2 లక్షల రూపాయలను అందజేసింది. ఆయన మాట్లాడుతూ.. అత్యంత ఆధునిక పరిశ్రమలు అని చెప్పుకునే పరిశ్రమల్లో కూడా దళితులు,గిరిజనులు,మహిళలు సామాజిక వివక్షను యాజమా న్యాలు, సూపర్‌వైజర్ల నుంచే కాకుండా వెనుకబాటు రీత్యా తోటి కార్మికుల నుంచి ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. పారిశుధ్య కార్మికులు తాగునీళ్లను అడిగితే తిరస్కరించడమో, పైనుంచి ఎత్తిపోస్తున్న పరిస్థితి హైదరాబాద్‌ మహానగరంలోనూ ప్రత్యక్షంగా చూస్తున్నామ న్నారు. కార్మిక సంఘాలు ఆర్థిక సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాలనూ ఎత్తుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. రణదీవె, అంబేద్కర్‌, జ్యోతిబాఫూలేలు కుల వివక్షకు వ్యతిరేకంగానే కాకుండా మహిళా హక్కుల కోసం పోరాడిన తీరును వివరించారు. వారిని కొన్ని కులాలకో, కొందరికో పరిమితం చేయడం సబబు కాదన్నారు. ముచ్చింతల్‌లో రామానుజుని పెద్ద విగ్రహానికి సమతామూర్తి అని పేరుపెట్టి ఎన్నికల్లో రాజకీయ ప్రచారం చేసుకున్నది కేంద్రంలోని బీజేపీ పార్టీ, ప్రధానమంత్రి అని విమర్శించారు. ఆ విగ్రహావిష్కరణలో గద్దర్‌పోయి పాటపాడాడనీ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. రామానుజులు చెప్పిన విషయం ఆనాటి కాల పరిస్థితులకు గొప్పదే కావొచ్చన్నారు. కానీ, అన్ని కులాల వాళ్లు దేవుడు దగ్గరకు పోవడమే సమానత్వమా? ఎలా అవుతుందని ప్రశ్నించారు. కులాలున్న తర్వాత కులాలన్నీ సమానమెలా అవుతాయని నిలదీశారు. మోడీ సమతా విగ్రహాన్ని ఆవిష్కరించి ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకున్న తీరును వివరించారు. అందుకే, ఆనాడే అంబేద్కర్‌ కుల నిర్మూలన అని చెప్పాడని గుర్తుచేశారు. కులవ్యవస్థను ధ్వంసం చేయకుండా భారత సమాజం ముందుకు పోదని నొక్కిచెప్పాడన్నారు. 21వ శతాబ్దంలో ఉన్న మనం ఇంకా ముందు చూపుతో, ఆధునిక సిద్ధాంతంతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. సమాజాన్ని సమూల ంగా మార్చే ఆధునిక నినాదాలు ప్రజల నినాదాలుగా ఉండాలన్నారు. గత నినాదాలే యథాతధంగా తీసుకుంటే కులాలను నిర్మూలించలేమనీ, మరింత బలపడేందుకు దోహదం చేసినట్టు అవుతుందని చెప్పారు. ఆధిపత్యవాదుల దాడులను తిప్పికొట్టేందుకు, తమ గొప్పతనాన్ని చెప్పుకునేందుకు ఆనాటి కాలంలో వచ్చినవే కుల పురాణాలు అన్నారు. అవీ నేడు మనుషులను కులాలుగా విడగొట్టేందుకే దోహదపడుతున్నా యన్నారు. కులం పేర తోకలు తగిలించుకునే పోటీ ప్రారంభమైందనీ, ఇది ముమ్మాటికీ కుల అస్థిత్వాన్ని మరింత బలోపేతం చేయడమేనని చెప్పారు. కులం తోకలు అవసరం లేదని తన పేరులోని రెడ్డిని తీసేసి సుందరయ్య దేశానికే ఆదర్శంగా నిలిచిన మహనీయుడన్నారు. గతంలో ఓ పరిశ్రమలో కార్మిక, ఉద్యోగ సంఘాలుంటే నేడు కులాల పేరుతో సంఘాలు పుట్టుకొచ్చాయనీ, తమ సొంత ప్రయోజనాల కోసం పాలకవ ర్గాలు, యాజమాన్యాలు వాటిని ప్రోత్సహిస్తున్నారని వివరించారు. అవి పుట్టుకురావడానికి గల కారణం ఏమిటనే విషయాన్ని కార్మిక సంఘాలు గ్రహించాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్మికుల ఆర్థిక సమస్యలకే పరిమితం కాకుండా వారికొచ్చే అన్ని రకాల సమస్యలనూ పరిష్కారం కోసం యూనియన్లు పనిచేస్తే ఇలాంటివి పుట్టుకురావన్నారు. వివక్ష, లైంగిక వేధింపులను కూడా యూనియన్‌ ప్రశ్నిస్తుందనే నమ్మకం ఉంటే అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి పోరాడుతారని చెప్పారు. అది ప్రజలను ఐక్యం కాకుండా చేయడమేనన్నారు. ఇది కుల నిర్మూలనకు ఉపయోగపడదనీ, ఇలా చేయడం ఆ నేతల ఆశయాలకు తూట్లు పొడవడమేనని చెప్పారు. ఆధునీక, శాస్త్రీయ పద్ధతుల్లో కుల నిర్మూలన కోసం, సమసమాజ స్థాపన కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఏది సమానత్వ భావనకు దోహం చేస్తుంది? ఏది కుల నిర్మూలనకు ఉపయోగపడుతుంది? ఏది కార్మిక వర్గ ఐక్యతకు ఉపయోగపడుతుంది? అనే విషయాలను గ్రహించాలన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌నే నిర్వీర్యం చేశాక రిజర్వేషన్‌ అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. దోపిడీ సమాజం నుంచి విముక్తి కల్పించి సమసమాజం దిశగా కార్మికులంతా ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ..కార్మికులు తమ హక్కుల కోసం పోరాడకుండా కులం, మతం పేరుతో యాజమాన్యాలు, పాలకులు చీల్చి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఆధునిక సమాజంలోనూ కులవివక్ష విషకోరలతో బుసలు కొడుతోందన్నారు. ఈ విషయంలో తమకు జరుగుతున్న నష్టాన్ని కార్మికులు గ్రహించి ఐక్యం ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సమాజంలోని అసమానతలు రూపుమాపడంతో సీఐటీయూగా తమ శక్తిమేరకు పోరాడుతామని హామీనిచ్చారు. కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ, స్కైలాబ్‌ మాట్లాడుతూ.. తమ పోరాటానికి ఆర్థిక సహాయం అందజేసి సీఐటీయూ కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీకి, తమ రెక్కల కష్టాన్ని సహాయంగా ఇచ్చిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాడే బాధ్యత సీఐటీయూపైనా ఉందని చెప్పారు. నేడు మన దేశంలో పశువులకిచ్చిన గౌరవం కూడా కొన్ని సామాజిక తరగతుల మనుషులకు ఇవ్వడం లేదని వాపోయారు. ఇలాంటి వివక్ష పోవాలనే తాము పోరాడుతున్నామని చెప్పారు. హిందూ మతంలోని అంటరానితనం, వివక్ష నచ్చకనే బౌద్ధంలో చేరానని అంబేద్కర్‌ ప్రకటించుకున్నారని చెప్పారు. దళితులకు దగ్గరయ్యేందుకు నేడు అదే హిందూత్వవాదులు అంబేద్కర్‌ను వాడుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ..ప్రతిపోరాటంలోనూ, కార్మికవర్గ రాజ్య స్థాపనలో మహిళల పాత్ర కీలకంగా ఉండాలన్నారు. ఢిల్లీ రైతాంగ పోరాటంలో మహిళా రైతుల పోరాటతత్వాన్నీ, ధీరత్వాన్ని వివరించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన వహించారు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ నాయకులను వేదిక మీదకి ఆహ్వానించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌రావు వందన సమర్పణ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.