Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏజెన్సీలో వెంచర్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 18,2022

ఏజెన్సీలో వెంచర్లు

- యథేచ్ఛగా రియల్‌ దందా
- జోరుగా సాగుతున్న భూముల క్రయవిక్రయాలు
- 1/70 చట్టానికి తూట్లు..పీసా కమిటీ అనుమతుల్లేవ్‌
- తెలిసినా.. అధికారులు గప్‌ చుప్‌
          రియల్టర్ల కండ్లు ఇపుడు ఏజెన్సీ ప్రాంతాలపై పడింది. ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ అన్నట్టుగా రియల్‌ దందా కొనసాగుతోంది. అటవీ భూముల్లోనూ అడుగుపెట్టాలంటే..దానికి కొన్ని రూల్స్‌ ఉన్నాయి. కానీ ఇవేం వారికి పట్టడంలేదు. పొక్లయినర్లతో పచ్చని చెట్లను తొలగించి మరీ ప్లాట్లకు హద్దులు వేస్తున్నారు. అయితే దీని వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉన్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ఈ అక్రమ దందా జరుగుతున్నా.. అధికారులు గమ్మునుంటున్నారు.దీంతో రియల్‌ దందాకు అడ్డు అదుపులేకుండా పోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
నవతెలంగాణ- ఇంద్రవెల్లి
           ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రియల్‌ దందా మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోంది. కొందరు రియల్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఏజెన్సీలో అమల్లో ఉన్న 1/70చట్టంతో పాటు పీసా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చట్టాలను కఠినంగా అమలు చేసి ఏజెన్సీ భూములను సంరక్షించాల్సిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు అటు వైపు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇందులో కొందరు అధికారుల అండదండలతోనే ఈ తతంగం సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
           ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూముల క్రయవిక్రయాలు జరపడం చట్టరీత్యా నిషేదం. ఏజెన్సీ ప్రాంతంలో 1970కి ముందు భూములు కొనుగోలు చేసిన వారికే భూ పట్టా ఉంటుంది. తర్వాత కొనుగోలు చేసిన గిరిజనేతరులకు ఎల్‌.టీ.ఆర్‌ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులు భూ క్రయ, విక్రయాలు చేయడం చట్టరీత్యా నిషిద్ధం. ఇంద్రవెల్లి మండలంలో మాత్రం ఆ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. మండల శివారులోని సర్వే.నెం.243తో పాటు హార్కాపూర్‌, ఈశ్వర్‌నగర్‌, ధనోర(బి), ఏమాయికుంట తదితర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు అక్రమంగా ప్లాట్లుగా మారుస్తున్నారు. ఒక్కో ప్లాటును రూ.15లక్షల నుంచి రూ.17లక్షల వరకు విక్రయించి రూ.కోట్లలో అక్రమంగా ఆర్జిస్తున్నారు. భారీగా స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఎలాంటి నాలా రుసుముతో పాటు పంచాయతీ అనుమతులు లేకుండా ఈ అక్రమ దందా చాపకింద నీరులా కొనసాగుతోంది. ఒకవేళ అనుమతి తీసుకున్న భూముల్లో ప్లాట్లు చేయాలంటే నిబంధనల ప్రకారం కచ్చితంగా 10శాతం భూమిని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. 16ఫీట్ల రోడ్డు, ప్రభుత్వ పాఠశాల, ఇతర అవసరాలకు ఈ భూమిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీ ప్రాంతంలో భూములు కొనుగోలు, అమ్మకం ప్రక్రియనే నిషేదంలో ఉంది. అలాంటప్పుడు ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా అధికారికంగా రిజిస్ట్రేషన్లు కావు. కానీ స్థానిక పంచాయతీ నుంచి అనుమతి తీసుకొని ఇంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యధేచ్ఛగా పీసా చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూ క్రయవిక్రయాలు జరిగితే పీసా కమిటీ అనుమతులు లేనిదే ముట్టుకొనే వీలుండదు. అది కూడా ఇక్కడి గిరిజనులకే ఆ హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ రియల్‌ దళారులు మాత్రం ఆయా చట్టాలను కాలరాసి నిబంధనలు విస్మరిస్తున్నారు. ప్లాట్ల ధరలు విపరీతంగా పెంచి విక్రయించడం ద్వారా గిరిజనులకు ఆవాసం కోసం స్థలం కరువయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అక్రమార్కుల ధనదాహం కారణంగా పచ్చని పంట పొలాలు కనిపించకుండాపోయే ప్రమాదం తలెత్తింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏజెన్సీలో రియల్‌ దందా ఆగడాలకు అడ్డకట్ట వేయాలని గిరిజనులు కోరుతున్నారు.
రియల్‌ దందా ఆపకపోతే ఆందోళన చేస్తాం :
సెడ్మకి రామారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షులు
           ఏజెన్సీలో జరుగుతున్న ఆక్రమ భూ దందాకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు అడ్డుకట్ట వేయాలి. సంబంధిత అధికారులు మామూళ్లకు ఆశపడి గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. వెంటనే వీటిని ఆపకపోతే ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేస్తాం. అయినా కొనసాగితే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం.
అధికారులు చర్యలు తీసుకోవాలి
           జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం జరుగుతోంది. 1970 తర్వాత నుంచి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలను పూర్తిగా నిషేధించింది. గిరిజనులు భూమి కొనుగోలు చేయాలన్నా కలెక్టర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మారుస్తున్నట్టు మా దృష్టికీ వచ్చింది. ఇలాంటి వాటితో భవిష్యత్తులో గిరిజనుల అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుంది. అధికారులు వెంటనే వీటిపై దృష్టి సారించి ఏజెన్సీ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి. లేనిపక్షంలో ఆందోళన చేపడతాం.

- తొడసం భీంరావు, టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.