Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నెలాఖరుల్లోగా అపెక్స్‌ కౌన్సిల్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 19,2022

నెలాఖరుల్లోగా అపెక్స్‌ కౌన్సిల్‌

- జలవివాదాలపై దృష్టి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
           తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశగా మరోసారి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి కానుంది. ఈ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్వహించే ఈ సమావేశంలోనైనా కృష్ణా జలాల పున:పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి దృష్టిసారించే అవకాశాలు లేకపోలేదు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటిలో ప్రత్యేకించి కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోసారి చర్చ జరగనుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంలో రెండు రాష్ట్రాల మధ్య అనేక అభ్యంతరాలు, అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 2020, అక్టోబరు ఆరున అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి జరిగిన విషయం విదితమే. ఈ భేటిలో తెలంగాణ, ఏపీ ముఖ్మంత్రులు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఇప్పటివరకు రెండు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలు జరిగాయి. ఈ నెలాఖరున మూడో కౌన్సిల్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గోదావరి నదీపైన ఎలాంటి అంతరాష్ట్ర ప్రాజెక్టులు లేనికారణంగా జీఆర్‌ఎంబీ బోర్డు అవసరం లేదని తెలంగాణ చెబుతుండగా, దాదాపు నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమమని ఏపీ సర్కారు అంటున్నది. కృష్ణానదీ పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా బేసిన్‌ అవతలకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పున:పంపిణీ చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అదిప్పుడు మరింత తీవ్రమైంది. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యూనల్‌(కేడబ్ల్యూడీటీ-2) ప్రకారం నదీ జలాల పున:పంపిణీ జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. కృష్ణానదిలో నీటి లభ్యత ఆధారంగా 75 శాతం ప్రాతిపదికన తెలంగాణకు 574 టీఎంసీలు ఇవాల్సి ఉందని ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు నీటి కేటాయింపులు పున:పంపిణీ చేయాలని కోరినా కేఆర్‌ఎంబీ స్పందించడం లేదనీ, గతంలో మాదిరిగానే 299 టీఎంసీలనే కేటాయిస్తున్నదని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో అంతరాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్‌ 3 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి, ప్రధానంగా కృష్ణా నదీ నీటి పంపిణీకి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో ఢిల్లీలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణా జలాల వివాదాల అంశాలతోపాటు గోదావరి నదీపై నిర్మిస్తున్న ఆరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు అనుమతులను త్వరగా మంజూరు చేసేలా ఆయా శాఖలను ఆదేశించాలని అపెక్స్‌ కౌన్సిల్‌ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపిస్తుందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కౌన్సిల్‌ భేటిలో చర్చించాల్సిన అంశాలు ఇంకా ఖరారు కాలేదు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటికి ముందే జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ బోర్డుల సమావేశాలు నిర్విహించనున్నట్టు సమాచారం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.