Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధి జోలికొస్తే ఉద్యమం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 19,2022

ఉపాధి జోలికొస్తే ఉద్యమం

- ప్రభుత్వాలకు గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్ర సదస్సు హెచ్చరిక
- 21న జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
             గ్రామీణ ఉపాధి హామీ చట్టం జోలికి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి గుణపాఠం చెప్తామని ఏడు కార్మిక సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. ఈ పథకాన్ని పట్టణాలకూ విస్తరింపచేయాలనీ, నిధుల కేటాయింపు పెంచాలనీ డిమాండ్‌ చేసింది. ఏడు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 'గ్రామీణ ఉపాధి హామీ రక్షణ' అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు బీ ప్రసాద్‌, భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ (బీకేఎమ్‌యూ) రాష్ట్ర అధ్యక్షులు కే కాంతయ్య అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌, రాష్ట్ర అధ్యక్షులు జీ నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ పద్మ, బీకేఎమ్‌యూ జాతీయ నాయకులు తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర కార్యదర్శి బాలమల్లేష్‌, దళిత బహుజన ఫ్రంట్‌ (డీబీఎఫ్‌) జాతీయ నాయకులు శంకర్‌, పీపుల్స్‌ మానిటరింగ్‌ కమిటీ (పీఎమ్‌సీ) నాయకులు శివలింగం, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారులు యూనియన్‌ (టీవీవీయూ) నాయకులు వెంకటయ్య, దళిత బహుజన శ్రామిక యూనియన్‌ (డీబీఎస్‌యూ) నాయకులు రమేష్‌, నేషనల్‌ అగ్రికల్చర్‌ పీపుల్స్‌ మోనిటరింగ్‌ (ఎన్‌ఏపీఎమ్‌) నాయకులు ఎమ్‌ సంఘమిత్ర, పద్మ, కల్పన, బూదమ్మ తదితరులు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని మార్చే అధికారం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి లేదనీ, దాన్ని కమ్యూనిస్టుల పోరాటంతో యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని గుర్తుచేశారు. ఈ పథకానికి నిధులు తగ్గించి, గ్రామీణ ఉపాధి అవకాశాలను మోడీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బకొట్టిందని విమర్శించారు. ఉపాధిహామీని కూలీలకు కాకుండా కాంట్రాక్టర్లకు పనికొచ్చేలా మార్పులు చేసే కుట్రల్ని కేంద్రం చేస్తున్నదని చెప్పారు. యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యల్ని తిప్పికొడతామని హెచ్చరించారు. దళితులు, గిరిజనులు, బీసీలు ఈ స్కీం ద్వారా లబ్దిపొందుతున్నారనీ, వారిలోనూ 54 శాతం మంది మహిళలే ఉన్నారని గణాంకాలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుపై కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోదనీ, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడు తరహాలో పట్టణాల్లో పనికల్పనకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. అరకొర కూలీలు ఇస్తూ, నడివేసవిలో రెండుపూటలా ఫోటోలు, సంతకాలు పెట్టాలంటే కుదరదని తేల్చిచెప్పారు. కూలీలే పనికి రావట్లేదనే ప్రచారం చేసేందుకే కేంద్రం ఈ తరహా నిబంధనలు పెడుతున్నదని వివరించారు. 'ఊరికో కోడి-ఇంటికో ఈక' అన్నట్టు ఈ పథకానికి నిధుల కేటా యింపు ఉన్నదని ఎద్దేవా చేశారు. పోరాడితేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందనీ, తల్లి కూడా పోరాడే బిడ్డలకు జన్మనిస్తుందనీ, అదే చైతన్యం ప్రజల్లో కలగాలని పిలుపునిచ్చారు. వేసవికాలంలో కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించారు. పని ప్రదేశంలో నీడ, నీళ్లు కల్పించకుండా నానా అవస్థలు పెడుతున్నారనీ, కూలీలు నీడకోసం మట్టిదిబ్బల కిందకు వెళ్లి మృత్యువాత పడుతున్నారంటూ పలు ఉదాహరణలు వివరించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు కూలి రేట్లు పెంచా లని కోరారు. అంతకుముందు ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు 'ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఏప్రిల్‌ 21న జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలి' అనే అంశంపై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిలో ఏడు డిమాండ్లతోపాటు పలు అంశాలను ప్రస్తావిం చారు. ఈ తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.