Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్ర విధానాల వల్లే వ్యవసాయం కుదేలు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 20,2022

కేంద్ర విధానాల వల్లే వ్యవసాయం కుదేలు..

- మోడీ సర్కారువి తిరోగమన విధానాలు
- సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌
- ఎరువుల నిల్వలపై ఆరా ొ విచ్చలవిడి డీఏపీ వాడకం తగదు
- కల్తీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో వ్యవసాయరంగం కుదేలైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి బీజేపీవి తిరోగమన విధానాలని విమర్శించారు. రైతుల్ని ప్రోత్సహించటానికి బదులుగా... వారిని నిరుత్సాహ పరుస్తున్నారని తెలిపారు. పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుం డా వాటి ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో వ్యవసాయరంగం కీలకంగా మారిందని తెలిపారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తున్నదనీ, తమ ప్రభుత్వం చేపట్టిన మిగతా ప్రాజెక్టులు వచ్చే ఏడాదిలో పూర్తవుతాయని స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌... ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ పురోగతిపై ఆయన ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై జాబ్‌ చార్ట్‌ తయారు చేయాలని ఆదేశించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభంలోపే అవసరమైన ఎరువులు, విత్తనాలను సమకూర్చుకోవాలని సూచించారు. కల్తీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. వ్యవసాయ రంగం బలోపేతానికి... జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక(డిస్ట్రిక్ట్‌ అగ్రికల్చర్‌ యాక్షన్‌ ప్లాన్‌)ను రూపొందించాలని కోరారు. ఈ ప్రక్రియలో కలెక్టర్లు, ఆర్డీవోలను కూడా భాగస్వాములను చేయాలని ఆదేశించారు. యూరియా, ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తూ వాటిని తగు మోతాదులో వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. పంటల మార్పిడి ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవటం తక్షణావసరమని నొక్కి చెప్పారు. ఈ దిశగా తగు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మారుతున్న కాలాన్నిబట్టి ఎరువులను ఎలా వాడాలనే విషయమై రైతు వేదికల ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డీఏపీ, ఎరువులు, యూరియా తదితర నిల్వలపై సీఎం ఈ సందర్భంగా ఆరా తీశారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ఎరువుల లభ్యత అవసరానికి మించి ఉండబోదని అధికారులు కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ పత్తికి డిమాండ్‌ పెరుగుతున్న అంశంపై కూడా ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ఆ పంట సాగును మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. మిర్చికి కూడా ఊహించని రీతిలో క్వింటాల్‌కు రూ.42 వేలకు పైగా ధర పలుకుతున్నదని చెప్పారు. కందికి సైతం మార్కెట్లో బాగా గిరాకీ ఉన్న నేపథ్యంలో... ఆ పంటకు సంబంధించి వ్యవసాయశాఖ నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. పొద్దు తిరుగుడు విస్తీర్ణాన్ని కూడా పెంచాలన్నారు. కల్తీ విత్తన తయారీదారులను కట్టడి చేసేందుకు వీలుగా పోలీసు యంత్రాంగం సహాయ, సహకారాలను తీసుకోవాలనీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఇప్పటి నుంచే రంగంలోకి దించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ వేగం పుంజుకున్నదని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితరాలను సమకూర్చుకున్నామని సీఎంకు వివరించారు. మొత్తం 6,983 కేంద్రాలను ఏర్పాటు చేయగా... ఇప్పటికే 536 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. వాటిలో ఇప్పటికే 32 కేంద్రాల నుంచి సేకరణ మొదలైందనీ, 1,200 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, రాహుల్‌ బొజ్జా, స్మితా సభర్వాల్‌తోపాటు వ్యవసాయ, పౌరసరఫరాలశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.