Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొండపల్లి దుర్గాదేవి అస్తమయం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 20,2022

కొండపల్లి దుర్గాదేవి అస్తమయం

- ఐద్వా రాష్ట్ర నాయకురాలిగా బాధ్యతలు
- కేఎల్‌ సతీమణిగా విప్లవోద్యమాల నిర్మాణం
- మహిళా రాజకీయ పాఠశాలల నిర్వహణ
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం సంతాపం
- నేడు మధ్యాహ్నం ఖమ్మం సీపీఐ(ఎం) కార్యాలయానికి భౌతికకాయం
నవతెలంగాణ- ఖమ్మం
              ఐద్వా రాష్ట్ర సీనియర్‌ నాయకులు కొండపల్లి దుర్గాదేవి(89) మంగళవారం కన్నుమూశారు. దుర్గాదేవి ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్‌ నాయకులు కేఎల్‌ నర్సింహారావు సతీమణి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దుర్గాదేవి మృతిపట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గం సంతాపం ప్రకటించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంచనున్నట్టు దుర్గాదేవి కుటుంబసభ్యులు తెలిపారు. అక్కడ్నుంచి భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయానికి తీసుకొస్తారు. ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు ప్రారంభమవుతాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు.
మహిళా ఉద్యమంలో దుర్గాదేవి..
              దుర్గాదేవి ఏప్రిల్‌ 10, 1933లో జన్మించారు. ఆమె తండ్రి నేదునూరి రాఘవరావు స్వాతంత్య్ర ఉద్యమంలో పనిచేశారు. కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న కుటుంబం. మొట్టమొదటి కమ్యూనిస్టు రాజకీయ పాఠశాల రాఘవరావు ఇంట్లో, ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి రామనాథం, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, రావినారాయణరెడ్డి వంటి సాయుధ పోరాట నేతలు హాజరయ్యారు. తన సమీప బంధువు కొండపల్లి లక్ష్మీనర్సింహారావుతో దుర్గాదేవికి 14 ఏండ్ల వయస్సులో 1949లో విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వివాహం జరిగింది. 1954లో ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర మహిళా సంఘంలో పనిచేశారు. భారత కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చిన తర్వాత తొలిసారి సీపీఐ(ఎం) ప్లీనం కేఎల్‌ దుర్గాదేవి ఇంట్లోనే నిర్వహించారు. మల్లు స్వరాజ్యం, మోటూరు ఉదయం స్ఫూర్తితో 1972లో బయ్యారం మండలం సత్యనారాయణపురంలో మహిళా రాజకీయ పాఠశాలను దుర్గాదేవి నాయకత్వంలో ఏర్పాటు చేశారు. 1974లో మహిళా సంఘం పునరుద్ధరణలో భాగంగా ఖమ్మంలో రాష్ట్ర మహిళా మహాసభ ఏర్పాటు చేశారు. ఆ మహాసభలో మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా దుర్గాదేవి ఎన్నికయ్యారు. నాటి నుంచి ఐద్వా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిగా, పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. దుర్గాదేవి, కేఎల్‌ నర్సింహారావు దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు కొండపల్లి ఉత్తమ్‌కుమార్‌, చిన్న కుమారుడు కొండపల్లి పావన్‌, కుమార్తె కొమరవెల్లి సుధా. అందరూ ఉన్నత విద్యలు అభ్యసించారు. వీరిలో ఉత్తమ్‌కుమార్‌ ప్రముఖ న్యాయవాది, గతేడాది మృతిచెందారు. 2015లో కుమార్తె సుధా చనిపోయారు. దుర్గాదేవి తమ పిల్లలను సైతం కమ్యూనిస్టు బాటలోనే నడిపించారు. పీడిత ప్రజల సేవలోనే కుటుంబమంతా కొనసాగుతోంది.
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సంతాపం
              ఐద్వా రాష్ట్ర నాయకులు కొండపల్లి దుర్గాదేవి మృతి పట్ల సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం, కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసింది. పార్టీ ఖమ్మం జిల్లా నాయకురాలిగా మహిళా ఉద్యమంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన గొప్ప పోరాట యోధురాలని నేతలు గుర్తు చేశారు. ఆమె మరణం పార్టీకి, మహిళా సంఘానికి తీరని లోటని, ఆమె ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. తుదిశ్వాస వరకు పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు.
ఐద్వా సంతాపం
              ఐద్వా సీనియర్‌ నాయకురాలు, ఖమ్మం జిల్లా మహిళా సంఘం నిర్మాత కొండపల్లి దుర్గాదేవి మరణం పట్ల అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, కార్యదర్శి మల్లు లక్ష్మి, జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి, సీనియర్‌ నాయకులు పుతుంబాక భారతి, అల్లూరి మన్మోహిని, టి జ్యోతి, బి హైమావతి, కెఎన్‌ ఆశాలత, డి ఇందిరా, బి సరళ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మియాపూర్‌ సుగుణ మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.