Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మన ఊరు.. మొక్కుబడి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 20,2022

మన ఊరు.. మొక్కుబడి

- వసతులు బాగున్న స్కూల్స్‌లోనే మళ్లీ సౌకర్యాలు!
- రూ.15 లక్షలలోపు అవసరమయ్యే స్కూల్స్‌కే తొలి ప్రాధాన్యం
- మండలానికి రెండేసి స్కూల్స్‌ ఎంపిక
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
            విద్యా, వైద్యరంగాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ.700 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన 'మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి' పథకం మొక్కబడిగా సాగుతోంది. ఈనెల 9వ తేదీ నుంచి ఈ పథకానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. మంత్రులందరూ తమతమ నియోజకవర్గాల్లో పనులు ప్రారంభించారు. పదిరోజులకు పైగా అవుతున్నా ఇంతవరకూ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కనీసం ఏ పాఠశాలకు ఎన్నేసి నిధులు కేటాయించారో కూడా అధికారులు అంచనాకు రాలేకపోతుండటంతో ఇదో మొక్కుబడి పథకంగానే సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా మొత్తం 12 రకాల వసతులు ఆయా పాఠశాలల్లో కల్పించాలని నిర్దేశించారు. మొదటి విడత ఎంపికైన పాఠశాలల్లో జూన్‌లో తిరిగి పాఠశాలలు తెరిచే నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పథకాన్ని ప్రారంభించి పదిరోజులవుతున్నా ఇంకా పలుచోట్ల ఆవిష్కరణలే కొనసాగుతున్న దృష్ట్యా సకాలంలో పనులు పూర్తవడం అసంభవమేనని అర్థమవుతోంది.
మొదలవని పనులు...
            ఖమ్మం జిల్లాలో మొత్తం 1,215 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో 426 స్కూల్స్‌ను మొదటి దశలో ఎంపిక చేశారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టేందుకు మండలానికి రెండు పాఠశాలలను గుర్తించారు. గరిష్ట విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలు ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి రూ.15లక్షలలోపు నిధులయ్యే పాఠశాలలను ఈ దఫా ఎంపిక చేశారు. ఈ నిధుల ద్వారా పాఠశాల భవనాల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్‌, తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్‌, భవనాలకు రంగులు, ప్రహరీ గోడలు, కిచెన్‌, డైనింగ్‌ హాల్స్‌ నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో నూతన గదులు, డిజిటల్‌ విద్యా పరికరాల కల్పన వంటి పనులు చేస్తారు. కానీ ఇంతవరకూ వీటిలో ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు. ఇంకా అంచనాల దగ్గరే అధికారులుండటం గమనార్హం. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు (ఎస్‌ఎంసీ) ఈ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. పూర్వ విద్యార్థులు, ఇతరత్ర దాతలు ముందుకొస్తే వారి పేర్లను ఆయా క్లాస్‌ రూమ్‌లు, పాఠశాల భవనానికి పెడతారు. కానీ జిల్లాలో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎస్‌ఎంసీ చైర్మెన్‌, హెడ్మాస్టర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మేయర్‌/ మున్సిపల్‌ చైర్మెన్‌/ సర్పంచ్‌ సమన్వయంతో ఈ పనులు నిర్వహిస్తారు. వీరిలో ఎస్‌ఎంసీ చైర్మెన్‌, హెచ్‌ఎం పేరుతో ఖాతా తెరుస్తారు. కానీ పనుల ప్రారంభ దిశగా పూర్తిస్థాయి ప్రయత్నాలు ఇంకా ఏ పాఠశాలలోనూ సాగుతున్నట్టు కనిపించడం లేదు.
తక్కువ బడ్జెట్‌ స్కూల్స్‌కే తొలి ప్రాధాన్యం
            విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలు ఎంపిక చేశామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్టంగా విద్యార్థులున్న స్కూల్స్‌ను తొలి విడత ఎంపిక చేశామంటున్నారు. కానీ తక్కువ బడ్జెట్‌ అయ్యే స్కూల్స్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చినట్టు అర్థమవుతోంది. ఉన్నంతలో వసతులు బాగున్న స్కూల్స్‌ను ఎంపిక చేశారనే విమర్శ ఉంది. వాటికి కాస్త మెరుగులు దిద్ది.. మెజార్టీ స్కూల్స్‌లో సౌకర్యాలు కల్పించినట్టు లెక్కలు చూపించుకునే యత్నాలు సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి దశలో పనులు నిర్వహించే పాఠశాలలకు ప్రభుత్వం కేవలం రూ.2 కోట్ల నిధులు మాత్రమే కేటాయించి.. తొలి దశలోనే 60శాతం విద్యార్థులు కవర్‌ అవుతున్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతోంది.
వసతులు బాగున్నా...
            కార్పొరేట్‌ స్కూల్స్‌ను తలపించే ఖమ్మంలోని రోటరీనగర్‌ పాఠశాల 'మన బస్తీ-మన బడి' కార్యక్రమానికి ఎంపికైంది. ఈ స్కూల్‌ నుంచే ఈ పథకానికి జిల్లా మంత్రి అజరు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఈ పాఠశాలలో వసతులు చాలా వరకూ మెరుగ్గా, భవనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేరు. విద్యార్థులు 270 మంది వరకు ఉన్న హైస్కూల్‌కు కనీసం అటెండర్‌, శానిటరీ వర్కర్‌ సైతం లేరు. సిబ్బంది కొరత వెంటాడుతున్నా వసతులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అటువంటి రోటరీనగర్‌ పాఠశాలను తొలి దశలో ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
అంచనాలు సిద్ధం చేస్తున్నాం
            గరిష్ట సంఖ్యలో విద్యార్థులు కవరయ్యేలా తొలి దశ పాఠశాలలు ఎంపిక చేశాం. ఈ విడత దాదాపు 60శాతం మంది విద్యార్థులు కవర్‌ అవుతున్నారు. జిల్లాలో 426 పాఠశాలల్లో పథకాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఆయా పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తదనుగుణంగా నిధులు మంజూరు చేసి పనులు చేపడతాం.
- యాదయ్య, ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి
సౌకర్యాలు మరింతగా మెరుగుపరుస్తాం
            మనబస్తీ- మనబడి పథకాన్ని ఉపయోగించుకుని పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తాం. కాంపౌండ్‌ వాల్‌ ఎత్తు లేపి, దానిపై ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయిస్తాం. ప్రాథమిక పాఠశాలకు రూ.13.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. 1997లో నిర్మించిన భవనం లీకేజీ అవుతోంది. దానికి మరమ్మతులు చేయిస్తాం. పాతబిల్డింగ్‌కు పెయింటింగ్‌ చేయిస్తాం. డైనింగ్‌హాల్‌ ఏర్పాటు చేస్తాం.
- మోత్కూరి మధు, రోటరీనగర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు

హైదరాబాద్‌లో ఇంకా అంచనాల దశల్లోనే..!
నవతెలంగాణ-సిటీబ్యూరో
           మన ఊరు-మన బడి పనులు హైదరాబాద్‌లో నత్తన డకన సాగుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదు పాయాల అభివృద్ధికి సంబంధించిన పనులు ఇంకా అంచనాలు రూపొందించే దశలోనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా తొలివిడు తలో 239 స్కూళ్లలో 8రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రభు త్వం ఎంపిక చేసింది. అయితే, ఇప్పటివరకు కేవలం 43 పాఠశా లల అంచనాలను రూపొందించి.. పరిపాలన అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో 34 పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కలెక్టర్‌ ఆమోదం తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అంచనాలు పూర్తి చేసి.. పనులు ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి వస్తా యా అన్నది అనుమానమే. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. కాగా జిల్లాలో ఫైలట్‌ ప్రాజెక్టు లో భాగం గా ఎంపిక మెహుబియా, అలీయా స్కూళ్లలో ఇప్పటివరకు 70శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.