Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆంగ్ల టీచర్ల భవిష్యత్తేంది? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 20,2022

ఆంగ్ల టీచర్ల భవిష్యత్తేంది?

-కొన్నేండ్లుగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ భోదన
- వచ్చే యేడాది వీరికి అవకాశం దక్కేనా?
- ఆంగ్ల విద్య ట్రైనింగ్‌కు దూరం
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
             రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య బోధన ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో గత కొన్నేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ బోధించిన టీచర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆయా పాఠశాలల్లో మళ్లీ వీరికి అవకాశం కల్పిస్తారా? ప్రభుత్వ టీచర్లతో విద్యాబోధన చేయిస్తారన్నది ప్రభుత్వం ఇంకా తేల్చలేదు. ఒకవేళ ప్రభుత్వ టీచర్లతో విద్యాబోధన చేయిస్తే తాము రోడ్డునపడతామని ప్రయివేటు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో 602 స్కూళ్లలో ఆంగ్ల బోధన చేస్తున్నారు. కాగా వచ్చే యేడాది ఇంగ్లీష్‌ బోధనకు సంబంధించి సమీక్షా సమావేశాల్లో ఉన్నతాధికారులు మౌఖికంగా చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ఉత్తర్వులు మాత్రం రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆంగ్ల విద్యాబోధన జరుగుతున్న విషయం తెలిసిందే.
             ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ప్రధాన అజెండాగా ప్రకటిస్తూ.. ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని ప్రకటించింది. అయితే ఇప్పటికే ఐదారేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ(స్కూల్‌ మేనేజెమెంట్‌ కమిటీ)ల ఆధ్వర్యంలో ఆంగ్ల మాధ్యమం బోధన చేపట్టారు. అయితే, మూడేండ్లుగా ఎస్‌ఎంసీలు తీర్మానం చేస్తే విద్యాశాఖ అధికారికంగా ఆంగ్ల మాధ్యమ బోధనకు అనుమతిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ప్రస్తుతం 602 స్కూళ్లలో ఆంగ్ల బోధన జరుగుతోంది. అందులో 326 ప్రాథమిక, 77 ప్రాథమికోన్నత, 184 ఉన్నత స్కూళ్లలో ఇంగ్లీష్‌ బోధన చేపడుతున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి ఇస్తుండగా.. ఆపై తరగతులకు కమిషనర్‌స్థాయి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమం విద్య అందించేందుకు ఎస్‌ఎంసీ ఆసక్తిగా ఉంటే.. ఆ మేరకు తీర్మానం చేసి విద్యాశాఖ అధికారులకు పంపాల్సి ఉంటుంది. అయితే ఆంగ్ల బోధన టీచర్ల నియామకం, జీతభత్యాలు ఇవన్నీ ఎస్‌ఎంసీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పేరెంట్స్‌ కమిటీ, ఎస్‌ఎంసీ, కొన్ని ప్రాంతాల్లో వీడీసీల సహకారంతో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల బోధన చేపడుతున్నారు. స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను నియమించుకుంటున్నారు. ఉన్నత పాఠశాలలో 10 మంది తీసుకుంటుండగా, ప్రాథమికోన్నతకు ఆరుగురు, ప్రాథమిక పాఠశాలకు ఇద్దరి నుంచి ముగ్గురిని నియమించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ టీచర్లను ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదు. కోవిడ్‌ సమయంలోనూ ప్రయివేటు స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు కూడా ఆర్థిక సాయం ప్రకటించిన సర్కారు.. ప్రభుత్వ స్కూళ్లలో బోధిస్తున్న ఈ టీచర్లను మాత్రం కనికరించలేదు. అయినప్పటికీ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ బోధనలో రాజీ పడకుండా సేవలందిస్తున్నారు.

మూడేండ్లుగా సేవలందిస్తున్నా
             నాళేశ్వర్‌ ప్రభుత్వ పాఠశాలలో మూడేండ్ల నుంచి విద్యా వాలంటీర్‌గా సేవలు అందిస్తున్నా. ప్రస్తుతం ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలను చేస్తున్నందున ఎన్నో రోజులుగా సేవలందిస్తున్న తమను తీసుకోవాలని కోరుతున్నాము.

- రాధిక, నాళేశ్వరం, నవీపేట్‌ మండలం

మార్గదర్శకాలు రాలేదు
             వచ్చే యేడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమ బోధన గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాము ఏమీ చెప్పలేమని అంటున్నారు. ప్రయివేటు టీచర్లకు అవకాశం కల్పిస్తారా లేక ప్రభుత్వ టీచర్లను నియమిస్తారా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

- విద్యాశాఖ అధికారులు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.