Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధిలో నీడ కరువు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 21,2022

ఉపాధిలో నీడ కరువు

- మండుటెండల్లో పనులు చేస్తున్న కూలీలు
- పని ప్రదేశంలో కన్పించని కనీస వసతులు
- ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభం కాని పనులు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ఎండకు మగ్గిపోతున్నారు. పనులే సక్రమంగా కల్పించని ప్రభుత్వం.. కూలీలకు పని ప్రదేశంలో కనీసం నీడ సౌకర్యం.. తాగునీరు అందించడం లేదు. కూలీల కోసం వసతితోపాటు మెడికల్‌ కిట్‌, నీటి వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఎక్కడా అలాంటి సౌకర్యాలు కన్పించడం లేదు. దీంతో కూలీలు ఇండ్ల నుంచే నీటిని తీసుకెళ్తున్నారు. ఎండ తీవ్రత అధికమైతే సమీపంలో ఉండే చెట్ల కిందకు వెళ్తున్నారు. చెట్లు లేని ప్రదేశాల్లో ఎండకు మగ్గిపోతూ అనారోగ్యానికి గురవుతున్నారు.
          వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలో 28 గ్రామ పంచాయతీలున్నాయి. 370 శ్రమశక్తి సంఘాలున్నాయి. 6 వేల మంది కూలీలున్నారు. ప్రస్తుతం 2,400 మంది ఉపాధి హామీ చట్టం పనులు చేస్తున్నారు. ప్రతిరోజూ పనులకెళ్లే కూలీలకు పని ప్రదేశంలో నీడ సౌకర్యం లేక ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. రోజురోజుకూ ఎండల తీవ్రత అధికం కావడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ప్రారంభమై పాతిక రోజులైనా ఇంకా ఎక్కడా పనులు గుర్తించలేదు. కనీసం యాక్షన్‌ ప్లాన్‌ కూడా లేకపోవడంతో వారం రోజుల్లో రెండ్రోజులకు మించి పనులు కల్పించడం లేదు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికీ పనులు ప్రారంభించలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1693 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో మహబూబ్‌నగర్‌ 442, నాగర్‌కర్నూల్‌ 461, వనపర్తి 255, గద్వాల 255, నారాయణపేట 280 చొప్పున గ్రామ పంచాయతీలున్నాయి. 2,600 మజారా గ్రామాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 లక్షల జాబ్‌ కార్డులున్నాయి. అందులో గతేడాది 1.60 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించారు. అందులో 1250 మందికి మాత్రమే వంద రోజుల పని కల్పించారు. 5,600కు పైగా శ్రమశక్తి సంఘాలుండేవి. ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించినప్పుడే అవి ఉనికిలో లేకుండా పోయాయి. గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌, టీఏ, ఏపీఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసేవారు. ప్రస్తుతం పనుల బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. దీంతో గ్రామ పరిపాలన, ఇతర పారిశుధ్యం వంటి పనులు చేయించేందుకే వారికి సమయం సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఉపాధి పనులపై అంతంత మాత్రంగానే పర్యవేక్షణ చేస్తున్నారు. పని చేసే ప్రదేశాల్లో ఎక్కడా కూడా కూలీల కోసం టెంట్లు ఏర్పాటు చేయలేదు. ఎవరి నీరు వారే వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మెడికల్‌ కిట్లు, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు మచ్చుకైనా కన్పించవు. పనులు చేసినా చాలా మందికి కూలి డబ్బులు వేయలేదు. అటు వ్యవసాయ పనుల్లేక, ఇటు ఉపాధి కూలి డబ్బులు విడుదల చేయకపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులకు గురౌతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా బకాయిలున్నట్టు తెలుస్తోంది.

పనుల్లేక..
గిరి- లింగాల మండలం
- నాగర్‌కర్నూల్‌ జిల్లా
మాకు ఈ ఏడాది ఉపాధి పనుల్లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. పది రోజుల నుంచి ఉపాధి పనుల కోసం ఎదురు చూస్తున్నా.. పనులు చూపించడంలేదు.

ఉపాధి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
కడియాల మోహన్‌- వ్యకాస జిల్లా అధ్యక్షులు- మహబూబ్‌నగర్‌
ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా పనులు గుర్తించలేదు. వెంటనే పనులు గుర్తించి పని కల్పించాలి. వేసవిలో నీడ, నీటి సౌకర్యం కల్పించాలి. అలాగే, పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి.
కేంద్రం విధానాలతో కూలీలకు ఇక్కట్లు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎండలు మండిపోతుండటం ఉపాధిహామీ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎండలకు ఉపాధి కూలీలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8గంటలకే మాడ పగిలిపోయే విధంగా ఎండ ఉండటం..పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచే తాగునీటిని తీసుకెళ్తున్నారు. ఇప్పటికే వడదెబ్బ కారణంగా నిర్మల్‌ జిల్లాలో ఓ మహిళ మృతి చెందడం, వివిధ ప్రాంతాల్లో పలువురు కూలీలు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం నూతన హాజరు విధానం తీసుకురావడం కూలీలకు మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా హాజరు వేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విధానం కూలీలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. గతంలో ఉదయం 6గంటలకు పనికి వెళ్లి ఎండ తీవ్రత పెరగకముందే ఇంటికొచ్చేసే కూలీలు తాజా నిబంధనలతో మిట్టమధ్యాహ్నం కూడా పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా ఎండ ప్రభావానికి గురై అనారోగ్యం బారినపడాల్సి వస్తోందని పలువురు కూలీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనిపించని మెడికల్‌ కిట్లు
నవతెలంగాణ-మల్హర్‌రావు
'ఉపాధి హామీ పనుల్లో రోజూ ఎర్రటి ఎండలో పని చేసినా.. కూలి గిట్టుబాటు కావడం లేదు. భూమి గట్టిగా ఉండడం వల్ల ఎక్కువగా పని చేయలేక పోతున్నాం. ప్రభుత్వం స్పందించి కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలి.' అని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మల్హర్‌రావు మండలంలోని లక్ష్మీ అనే కూలీ ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పనుల్లో పాటించాల్సిన నిబంధనలు, నియమాలు ప్రభుత్వం, అధికారులు గాలికొదిలేస్తున్నారు. కూలీలు మండుటెండలో పనులు చేయాల్సి వస్తోంది. తాగడానికి మంచినీరు, వడదెబ్బ తగలకుండా వోఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్లు లాంటి సదుపాయాలు ఎక్కడా.. కనిపించడం లేదు. గతంలో పని చేసే చోట టెంట్లు వేసేవారు ప్రస్తుతం వేయడం లేదని కూలీలు తెలిపారు. పనిచేసే చోట టెంట్లతోపాటు మెడికల్‌ కిట్లు ఏర్పాటుచేయాలని చిన మల్లయ్య అనే కూలీ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.