Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'బస్సు చార్జీల పెంపును ప్రజలు ఆమోదించారు' | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 24,2022

'బస్సు చార్జీల పెంపును ప్రజలు ఆమోదించారు'

- తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఇతరులకూ వైద్యం
- రెండు నెలల్లో 1,060 బస్సుల కొనుగోళ్లు ొ కార్గో విస్తరణ
- త్వరలో కారుణ్య నియామకాలు
- టీఎస్‌ఆర్టీసీ పాలకమండలి నిర్ణయాలు
- స్వరాష్ట్రంలో తొలి సమావేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
            ఆర్టీసీ యాజమాన్యం వివిధ రకాల సెస్సుల విధింపుతో పెరిగిన టిక్కెట్‌ చార్జీలను ప్రయాణీకులు ఆమోదించినట్టు టీఎస్‌ఆర్టీసీ పాలకమండలి (బోర్డు) అభిప్రాయపడింది. పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ రేట్ల వల్ల చార్జీలు పెంచాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రయాణీకులు అర్థం చేసుకున్నారనీ, తాము భయపడినట్టు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) ఏమీ తగ్గలేదని కూడా బోర్డు పేర్కొంది. టిక్కెట్‌ మూల ధర పెంపుపై మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత సెస్‌ల విధింపు వల్ల సంస్థకు దాదాపు రూ.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టు అధికారులు బోర్టుకు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు కేవలం ఆర్టీసీ కార్మికుల వైద్య సేవలకే పరిమితమైన తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసి, ఇతరులకు కూడా వైద్యసేవలు అందించాలని నిర్ణయించారు. అయితే దీని నిర్వహణను ప్రయివేటుకు అప్పగించాలా లేక ప్రభుత్వ సహకారంతో యాజమాన్య వాటాను ఏర్పాటు చేసుకొని, సెమీ గవర్నమెంట్‌ ఆస్పత్రిగా మార్పు చేయాలా అనే అంశంపై బోర్డు సమావేశంలో స్పష్టత రాలేదు. ఈ అంశాన్ని మరోసారి విస్త్రుతంగా చర్చించాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్లలో ఫార్మసీల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి టీఎస్‌ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది. 2013లో చివరి బోర్డు మీటింగ్‌ జరిగింది. ఆ తర్వాతి నుంచి టీఎస్‌ఆర్టీసీకి పూర్తి బోర్డు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు కూడా బోర్డులో తొమ్మిది మంది సభ్యులే ఉన్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులకు బోర్డులో స్థానం కల్పించలేదు. శనివారం జరిగిన బోర్డు సమావేశం చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ అధ్యక్షతన జరిగింది. 9 మంది సభ్యుల్లో చైర్మెన్‌తో సహా ఏడుగురు హాజరయ్యారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, కార్మిక, ఉపాధి కల్పనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, కేంద్ర రవాణాశాఖ డైరెక్టర్‌ పరేష్‌కుమార్‌గోయల్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పీ రవీందర్‌ హాజరయ్యారు. సుదీర్ఘకాలంగా సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టనందువల్ల దాదాపు 1,200 మంది కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయనీ, త్వరలో వాటిని చేపట్టాలని నిర్ణయించారు. రెండు నెలల్లో ఏసీ, నాన్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌కు చెందిన 1.060 బస్సులు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఉమ్మడి రాష్ట్ర నిర్ణయాలపైనా అంశాల వారీగా చర్చించారు. కార్గో విస్తరణతోపాటు ఆర్టీసీ నష్టాలపైనా సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్టీసీ ఖాళీ స్థలాలు, కమర్షియల్‌ అంశాలపైనా చర్చించారు. యాజమాన్యం ఇప్పుడు తీసుకుంటున్న చర్యల వల్ల సంస్థ త్వరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుందనే ఆశాభావాన్ని బోర్డు సభ్యులు వెల్లడించారు. గడచిన ఏడేండ్ల జమా ఖర్చుల లెక్కలకు ఆమోదం తెలిపారు. వీటికి ఆమోదం లభించడం తో బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు తీసుకొనేందుకు వెసులుబాటు కలుగుతుందని బోర్డు అభిప్రాయపడింది. కరోనా విపత్కర పరిస్థితులు, సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ తెచ్చేందుకు ఆర్టీసీ డ్రైవర్లు ఓడిస్సా వెళ్లి రావడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. కేవలం ప్రయాణాలపైనే ఆధారపడకుండా ఇతర మార్గాల్లోనూ అదనపు ఆదాయం కోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని పాలకమండలి భావించింది. డీజిల్‌ భారం నుంచి గట్టేక్కేందుకు ఆర్టీసీలో ఉన్న బస్సులనే ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్పు చేస్తూ పైలెట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టినట్టు సంస్థ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. అయితే వీటిలో టెక్నికల్‌గా అనేక సమస్యలు వచ్చాయనీ, వాటిని పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామనీ చెప్పారు. సీఎన్‌జీ బస్సుల కొనుగోలుపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డు సమావేశ అజెండాలో ఏడేండ్లకు సంబంధించిన దాదాపు 300 అంశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మినహా మెజారిటీ అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.