Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మాక్సివిజన్ ఐ హాస్పిటల్ భారీ విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 70 మంది పూర్తి సమయం వైద్యులతో 21 కంటి వైద్య హాస్పిటళ్ళను నిర్వహిస్తోంది. ఇతర పొరుగు రాష్ట్రాలపై కూడా కీలక దృష్టి కేంద్రీకరిస్తున్నామని మాక్సివిజన్ గ్రూపు చైర్మెన్ డాక్టర్ జిఎస్కె వేలు తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఆయన మాక్సివిజన్ గ్రూపు వ్యవస్థాపకులు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ తమిళనాడు, కర్నాటక, గుజరాత్లో విస్తరించనున్నామన్నారు.