Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అరకొర ప్రాధాన్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 24,2022

అరకొర ప్రాధాన్యం

- నామమాత్రంగా తెరుచుకున్న కొనుగోలు కేంద్రాలు
- కొన్నిచోట్ల ప్రారంభం.. మరికొన్నిచోట్ల ఆలస్యం
- ప్రయివేటు వ్యాపారులకు ఇప్పటికే సగం పంట విక్రయం
- వర్షాలు వస్తాయని రైతుల్లో ఆందోళన
నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధులు - ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌
            యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పిన ప్రభుత్వం.. చివరికి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమైన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా, ఆ స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కేంద్రాలు తెరుచుకోలేదు. వరి వేయొద్దనడంతో చాలామంది రైతులు సాగు చేయలేదు. వరి తప్ప ఇతర పంటలు పండని మాగాణి భూముల్లోనే పంట సేద్యం చేశారు. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏప్రిల్‌ 11వ తేదీన ఢిల్లీలో దీక్ష చేశారు. అయినా, కేంద్రం నుంచి స్పందనలేకపోవడంతో 13వ తేదీ నుంచి తామే కొంటామంటూ.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లకు సిద్ధమైంది. క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1960గా నిర్ధారించింది. నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే ముందుగానే ధాన్యం వచ్చిన చోట్ల రైతులు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. చాలా తక్కువ ధరకు ధాన్యాన్ని రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులు ప్రయివేటు వ్యాపారులకు క్వింటాల్‌ రూ.1200 నుంచి రూ.1650 వరకు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని ప్రకటించినంత వేగంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఎక్కడైతే ధాన్యం వచ్చిదో అక్కడే కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కేంద్రాల వద్ద కూలీల కొరత కూడా వేధిస్తోంది. వర్షాలు, ఈదురుగాలులు పడితే ..తీవ్ర నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
            వానాకాలం తరహాలోనే ఖమ్మం జిల్లాలో 236 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటి వరకు 189 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. వాస్తవానికి 40లోపు కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో 25 మంది రైతులు 221.320 మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయించారు. వీరికి ప్రభుత్వం రూ.43,37,872 చెల్లించింది. హెక్టార్‌కు 2.300 మెట్రిక్‌ టన్నుల చొప్పున 1.05 లక్షల ఎకరాలకు 2,42,896 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలు అంచనా వేశాయి. జూన్‌ నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్ధారించారు. అయితే, ఇప్పటికే సగానికి పైగా ధాన్యం ప్రయివేటు వ్యాపారులకు విక్రయించినట్టు రైతులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లా వ్యాప్తంగా 154 ధాన్యం కొనుగోలు కేంద్రాల 55వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ..
            ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 20లక్షలకు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి 948 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 2.25కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు 451 కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం 8254 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే సేకరణ చేశారు. 95లక్షల గన్నీబ్యాగులు అందుబాటులో పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క గింజ కూడ కొనుగోలు చేయలేదు. ఈ కాలంలో వర్షాలు, ఈదురుగాలులు సంభవించడం సహజం .. అందుకే కొనుగోళ్లు వేగంగా జరిగితే రైతులకు ఎలాంటి నష్టం ఉండదు.
నిజామాబాద్‌లో డబ్బుల చెల్లింపుల్లో ఆలస్యం..
            ధాన్యం అమ్మిన రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభం కాలేదు. కొనుగోలుకు సంబంధించిన ట్యాబ్‌ ఎంట్రీ పూర్తిస్థాయిలో జరగడం లేదు. నిజామాబాద్‌ జిల్లాలో 43,582 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 382 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలు మాత్రమే ట్యాబ్‌లో ఎంట్రీ చేశారు. రైతులకు సుమారు రూ.86 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.
వరంగల్‌, మహబూబ్‌నగర్‌లో..
            వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పూర్తిస్థాయిలో కేంద్రాలు ఏర్పాటు కాలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాట్లు ఆలస్యం కావడంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినా .. ధాన్యం పూర్తిస్థాయిలో రావడం లేదని అధికారులు తెలిపారు. వరంగల్‌ జిల్లాలోనూ 2,3 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. 460 కేంద్రాలకు గాను 412 కేంద్రాలు ప్రారంభించి నప్పటికీ.. కేవలం 234 కేంద్రాల్లోనే కొనుగోలు జరుగుతోంది.

పచ్చివడ్లే అమ్ముతున్నాం...
            ఊళ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంకా ప్రారంభం కాలేదు. యంత్రాలతో కోత కోయగానే పచ్చివడ్లనే స్థానిక వ్యాపారికి అమ్మాను. క్వింటాల్‌ రూ.1,650 చొప్పున అమ్మా. భూమి కౌలుకు తీసుకుని ఏడు ఎకరాల్లో వరి వేశా. కౌలు కాకుండా ఎకరానికి రూ.20వేల చొప్పున పెట్టుబడి పెట్టా. మొత్తం 177 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొత్తం హెచ్‌ఎంటీ సన్నరకం వడ్లనే పెట్టా. కానీ ఏమంత లాభం లేదు.
- బోడా శంకర్‌, కౌలు రైతు, బంధంపల్లి, తిరుమలాయపాలెం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.