Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్లాస్టిక్‌ ఫ్రీజోన్లుగా అడవులు, పార్కులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 24,2022

ప్లాస్టిక్‌ ఫ్రీజోన్లుగా అడవులు, పార్కులు

- చెత్త, ప్లాస్టిక్‌ సేకరణకు ప్రత్యేక బృందాలు
- రీసైక్లింగ్‌ కేంద్రాల ఏర్పాటు
- అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ప్లాస్టిక్‌ రీసైకిల్‌ విధానం విజయవంతం
- రాష్ట్రవ్యాప్తంగా అమలుకు అటవీశాఖ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
                మనరాష్ట్రంలోని అడవులు, రక్షిత ప్రాంతాలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను పూర్తి ప్లాస్టిక్‌ ఫ్రీ దిశగా మార్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. అడవుల సమీప ప్రాంతాల ప్రజలతో, అలాగే అటవీ రహదారుల గుండా ప్రయాణించే వారు విసిరే వస్తువులతో అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌, చెత్తా చెదారం పేరుకుపోతున్న విషయం విదితమే. అలా పోగుపడిన చెత్త వన్యప్రాణులతో పాటు, అటవీ ప్రాంతాలకు తీవ్రముప్పుగా మారుతున్నది. చాలాచోట్ల అగ్నిప్రమాదాలకు కూడా కారణమవుతున్నది. దాన్ని నివారించేందుకు అటవీశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతంలో శ్రీశైలం ప్రధానరహదారి(65 కిలో మీటర్ల మేర), దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్నేండ్లుగా చెత్త సేకరణ సేకరించి ప్లాస్టిక్‌ రీసైకిలింగ్‌కు పంపే విధానం విజయవంతంగా కొనసాగుతున్నది. దీంతో అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం, రహదారికిరువైపులా ఇప్పుడు పరిశుభ్రంగా మారింది. ఇదే విధానాన్ని మిగతా ప్రాంతాల్లో కూడా చేపట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల సూచన మేరకు కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో ఇటీవల చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ కూడా నిర్వహించారు. సుమారు వెయ్యి కేజీల ప్లాస్టిక్‌, ఇతర చెత్తను అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. రెండు టైగర్‌ రిజర్వులు (అమ్రాబాద్‌, కవ్వాల్‌) మూడు జాతీయ ఉద్యాన వనాలు (కేబీఆర్‌, మృగవని, హరిణివనస్థలి), నాలుగు అభయారణ్యాల్లో (పాకాల, కిన్నెరసాని, పోచారం, ఏటూరునాగారం), అటవీ అర్బన్‌ పార్కులు(109), జూ పార్కుల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ (హెచ్‌ఓఓఎఫ్‌) ఆర్‌.ఎం. డోబ్రియల్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని అటవీ ప్రాంతాల్లో చెత్త సేకరణను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం, రీ సైకిల్‌ పాయింట్ల ఏర్పాటు, చెత్తను విడదీయటం (సెగ్రిగేషన్‌ ఆఫ్‌ వేస్ట్‌ మెటీరియల్‌), బెయిలింగ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌కు తరలింపును దశల వారీగా చేపట్టనున్నారు. ఈ విధానంలో అడవులపై ఆధారపడే జీవించే స్థానికులకు కొంత ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంది. ప్లాస్టిక్‌ బాటిల్స్‌, రేపర్స్‌, ఇతర చెత్తను, సిగరెట్‌ పీకలను అటవీ ప్రాంతాల్లో విసిరివేయొద్దని మార్గంలో ఎక్కడికక్కడ బోర్డులను ఏర్పాటు చేయించింది.
ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలిగితేనే అడవులను రక్షించుకోగలం : పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం. డోబ్రియల్‌
              అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించే వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అడవులు, వణ్యప్రాణులకు ప్లాస్టిక్‌ వల్ల జరుగుతున్న అనర్థాలు, పర్యావరణ పరంగా పొంచి ఉన్న ముప్పుపై అందరూ అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే అడవులను రక్షించుకోగలుగుతాం. అడవుల్లోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యూ పాయింట్లు, వాటర్‌ ఫాల్స్‌, ఫారెస్ట్‌ అర్బన్‌ పార్కులకు సందర్శకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. అదే సమయంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా పేరుకు పోవటం బాధాకరం. ప్లాస్టిక్‌ రహిత, బాధ్యతాయుత పర్యావరణ పర్యాటకాన్ని (రెస్పాన్సిబుల్‌ ఎకో టూరిజం) ప్రోత్సహిస్తున్నాం. దీనికి ప్రతిఒక్కరి సహకారం కావాలని కోరుతున్నాం. స్వచ్చంద సంస్థల సహకారం కూడా తీసుకుంటాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.