Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మార్పులు చేర్పుల కోసం జనం అవస్థలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 24,2022

మార్పులు చేర్పుల కోసం జనం అవస్థలు

- రేషన్‌ కార్డుల్లో పేర్ల నమోదుకు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
- హైదరాబాద్‌లో 68వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో..!
- రేషన్‌ కోటా, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన
- కార్డుదారులను పట్టించుకోని అధికారులు
- ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్న వైనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
             అంబర్‌పేటకు చెందిన గండిపల్లి బాలామణి భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకుంది. భర్త స్థానంలో తనకు పింఛన్‌ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను సంప్రందించింది. అన్ని పత్రాలను పరిశీలించిన అధికారులు రేషన్‌ కార్డులో పేరు తుమ్మ బాలామణిగా ఉందని ఆధార్‌ కార్డు ప్రకారం గండిపల్లి బాలామణిగా మార్చుకోని రావాలని సూచించారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదించగా.. మీ-సేవలో దరఖాస్తు చేసుకోమని చెప్పడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తుంది. కానీ ఇప్పటికీ పేరు మారలేదు. మరోవైపు ప్రభుత్వం ఆ వెబ్‌సైట్‌ను బంద్‌ పెట్టడంతో మార్పులు చేర్పులకు అవకాశం లేకుండాపోయింది. ఇంకోవైపు బాధితులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
             ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కల్లూరి మత్స్యగిరిది ఇదే సమస్య. ఈయన పేరు ఆధార్‌ కార్డులో మత్స్యగిరి అని ఉండగా.. రేషన్‌ కార్డులో మాత్రం కల్లూరి మత్‌స్యగిరి అని పడింది. అతను కూడా తన పేరును రేషన్‌ కార్డులో సరిగా నమోదు చేయాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. అధికారులు నుంచి ఎలాంటి స్పందన లేదని చెబుతున్నాడు. ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు.
             రాంనగర్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌ ప్రయివేటు ఉద్యోగి. తన ఇద్దరు కొడుకుల పేరును రేషన్‌ కార్డులో చేర్పించేందుకు మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారు. దాదాపు ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటికీ కార్డులో పేరు నమోదు కాలేదు. దీంతో ప్రతి నెలా కొడుకుల కోటాకు సంబంధించిన రేషన్‌ బియ్యం పొందలేకపోతున్నారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడూ నమోదు అవుతాయో చెప్పడం లేదని, ఆరోగ్యశ్రీతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది కేవలం ఈ ముగ్గురికి ఎదురవుతున్న సమస్యే కాదు. ఎంతో మంది చిన్నారుల పేర్లు, కొత్తగా పెండ్లి చేసుకుని వేరే కుటుంబం పెట్టుకున్నవారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారు కార్డు బదిలీ కోసం, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన యువతుల పేర్లు వారి కుటుంబానికి జారీ చేయబడిన రేషన్‌ కార్డుల్లో నమోదు కావడంలేదు.
దరఖాస్తుల స్వీకరణకే పరిమితం..!
             తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీని గతేడాది జులైలో ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ పాత కార్డుల్లో ఎవరైనా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలంటే పౌరసరఫరాల శాఖ ఆమోదం తెలపడం లేదు. ఫలితంగా ఎంతో మంది సంక్షేమ పథకాలను లబ్ది పొందడానికి అర్హత సాధించడం లేదు. కొత్త కార్డుల జారీతో జిల్లాలో రేషన్‌ కార్డుల సంఖ్య 6.36లక్షలకు చేరింది. పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్పించడానికి పౌర సరఫరాలశాఖకు జిల్లాలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఆరేండ్ల కాలంలో దాదాపు 1,21,643 దరఖాస్తులు రాగా.. 68,430 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
డిలీట్‌ ఆప్షన్‌ లాగే ఎడిట్‌కు అవకాశమివ్వాలి
             ఇదిలావుండగా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణిస్తే వారి పేర్లను రేషన్‌ కార్డుల నుంచి వెంటనే తొలగించడంతో పాటు వారి కోటా బియ్యాన్ని ప్రభుత్వం మినహాయిస్తుంది. కానీ కొత్త సభ్యులకు చేర్పించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలేదు. దీంతో కొత్త సభ్యులను చేర్పించడానికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నా రేషన్‌ కార్డుల్లో నమోదు చేయడానికి పౌరసరఫరాల శాఖ ఆమోదం చెప్పడం లేదు. దీనివల్ల ఎంతో మంది నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయితే రేషన్‌కార్డుల్లో మరణించిన వారి పేర్లు తొలగించినట్టుగానే కుటుంబంలో ఎవరైనా సభ్యులు చేరితే వారి పేర్లను ఎప్పటికప్పుడు చేర్చడం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాల్లేవు
             రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రస్తుతానికి మూడేండ్ల క్రితం ఏ పరిస్థితి ఉందో నేటికీ అలాగే ఉంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. శాఖాపరమైన గైడ్‌లైన్స్‌ వస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
- రమేష్‌, పౌరసరఫరాల శాఖ అధికారి, హైదరాబాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.