Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతులను ముంచిన కేసీఆర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 25,2022

రైతులను ముంచిన కేసీఆర్‌

- 30లక్షల ఎకరాల్లో నష్టపోయారు
- వారికి ధైర్యం ఇవ్వడానికే రాహుల్‌ సభ : విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ నేతల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
                వరి పంట వేయొద్దని చెప్పడం ద్వారా సీఎం కేసీఆర్‌ రైతులను ముంచారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కేసీఆర్‌ మాట నమ్మి 30 లక్షల ఎకరాల్లో వారు వరి పంట వేయలేదనీ, మరో పంట సాగు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారనీ, వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ ఆడిన డ్రామాలతో రైతులకు తక్కువ ధరకు అమ్ముకున్నారని చెప్పారు. దీంతో వారికి నష్టం జరిగిందనీ, మిల్లర్లు లబ్దిపొందారని చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌ అసెంబ్లీలోని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) కార్యాలయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీగౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ నేత కోదండరెడ్డి సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో నష్టపోతున్న రైతులకు ధైర్యం ఇవ్వడానికి వచ్చే ఆరున వరంగల్‌లో ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీతో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతువ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు ఆనందంగా లేరని చెప్పారు. అందుకనే రైతులకు మానసికంగా ధైర్యం వారికి కల్పించేందుకే సభ నిర్వహించామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారితంగా ఆర్థికంగా రైతులు ఎదగడం కోసం ఎలాంటి పథకాలు అమలు చేశాయో, వాటిని వివరిస్తూ భవిష్యత్తులో అలాంటి పథకాలతో రైతులను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయలేదని విమర్శించారు.దాన్ని అమలు చేయకపోవడం వల్ల లక్ష రూపాయల రుణానికి వడ్డీ మీద వడ్డీ పెరిగి నాలుగు లక్షలకు చేరుకుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు లక్ష లోపు వడ్డీలేని రుణం, మూడు లక్షల రూపాయల వరకు పావలా వడ్డీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రిప్స్‌, స్ప్రంకర్లు, పందిరి సాగు కోసం 100 శాతం సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. రైతుబంధు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగ చేస్తున్నామని సీఎం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎరువుల ధరలు పెంచడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామని గొప్పలు చెప్పిన బీజేపీ...ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు రైతుల నుంచి బలవంతంగా గుంజుకుంటున్న అసైన్డ్‌భూములపై వరంగల్‌ సభలో తమ అధినేత రాహుల్‌ గాంధీ వివరిస్తారని వెల్లడించారు. సభకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజకీయాలకతీతంగా రైతులు, విద్యార్థి, యువజన, కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తరలించాలనీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జిగేష్‌ మేవాని అరెస్టుకు సీఎల్పీ ఖండన
                ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ దళిత శాసనసభ్యులు జిగేష్‌ మేవాని ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ చేసినందుకు ఆయన్ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను బీజేపీ హరిస్తుందనీ, దళితులు కేంద్రంలోని బీజేపీకీ బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
డీసీసీ అధ్యక్షుడికి షోకాజ్‌
మరోవైపు జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌చార్జి                                 మాధన్‌మెహన్‌రావును డీసీసీ అధ్యక్షులు సస్పెండ్‌ చేయడాణ్ని టీపీసీసీ సీరియ స్‌గా పరిగణించింది.రాష్ట్ర నాయకున్ని సస్పెండ్‌ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడికి లేదని తేల్చింది.ఈమేరకు టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ జిల్లా అధ్యక్షుడికి షోకాజ్‌ నోటీ సు జారీ చేసినట్టు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
పీకే చేరికపై అధిష్టానానిదే నిర్ణయం : కోమటిరెడ్డి
                ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) కాంగ్రెస్‌లో చేరిక, ఇతర పార్టీలతో పొత్తుల అంశానికి సంబంధించిన తుది నిర్ణయం అధిష్టానానిదేనని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాపెంయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం లేదనీ, రాహుల్‌గాంధీ సభపైనే దృష్టి సారించామన్నారు. జిల్లాల వారీగా బలమైన నేతలున్నారనీ, వారే జనసమీకరణ చేస్తారని చెప్పారు. సన్నాహక భేటీలు ఏర్పాటు చేస్తారని వివరించారు. అంతా మేమే చేస్తామంటే కుదరదనీ, ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.