Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కోతల కాలం...కొనుగోళ్లలో జాప్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 25,2022

కోతల కాలం...కొనుగోళ్లలో జాప్యం

- తక్కువ ధరకు ప్రయివేటుకు అమ్ముకుంటున్న రైతులు
- కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
          ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకొని కేంద్రం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కొనుగోలు చేస్తామని చెప్పిన రాష్ట్రం పూర్తిస్థాయిలో అందుకోసం ఏర్పాట్లు చేయకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. యాసంగిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్త నడకలా సాగుతుండటంతో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీనిని నుంచి రైతులను గట్టెక్కించాలంటే వెంటనే లక్ష్యం మేరకు అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
కేంద్రానిదే బాధ్యత
         గతేడాది యాసంగితో పోలిస్తే ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. 53 లక్షల ఎకరాల్లో 70 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా. కొనుగోలుకు కేంద్రం నిరాకరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతున్నది. ధాన్యం కొనుగోలు, పంపిణీ కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. అయినప్పటికీ దాని నుంచి తప్పుకున్నది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2005 వరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైస్‌ మిల్లర్లతో నేరుగా మాట్లాడి కొనుగోలు చేసేది. ఆ తర్వాత నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఎఫ్‌సీఐ కొనుగోలుతో ఆలస్యమవుతుందనీ, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ సర్కారు దాన్ని కొనసాగించింది. తాజాగా ఉప్పుడు బియ్యం కొనుగోలు, పంపిణీ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడం, సన్నధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. రైస్‌ మిల్లర్లకు అప్పగించేందుకు ఆరబెట్టి, నింపి తీసుకురావాల్సి ఉంటుంది. రైస్‌ మిల్లర్లు కొనేదాంట్లో ఎక్కువగా సోనామసూరి ఉంటున్నది. ఎ గ్రేడ్‌ రకానికి రూ.1,960, బి గ్రేడ్‌ రకానికి రూ.1,940 గా మద్ధతు ధర నిర్ణయించారు. అయితే ధాన్యం కొనుగోలు కోసం ఏప్రిల్‌ 14నే ప్రారంభమైనప్పటికీ నిర్దేశిత 6,983 కేంద్రాలకుగానూ కేవలం వెయ్యి కేంద్రాల్లోనే కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పండిన ధాన్యాన్ని నిల్వ ఉంచుకోలేని రైతు వాటిని ప్రయివేటుకు అమ్ముకుంటుండటంతో మద్ధతు ధర దక్కడం లేదు. దీంతో కేవలం రూ.1,500 నుంచి రూ.1,600కే క్వింటాలు ధర పలుకుతుండగా, దీనికి తోడు రవాణా ఖర్చులు, కొరత, తరుగు పేరుతో అదనపు భారం పడుతున్నది. ఇక ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకుంటున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో క్వింటాలుకు తరుగు పేరుతో నాలుగు కిలోలను తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం ఐదు ఎకరాల్లో ధాన్యం పంటకు రూ.10 వేల చొప్పున నష్టపోతున్నారు.
అకాల వర్షాలు..సౌకర్యాల లేమి
            కొనుగోళ్లలో వేగం పెంచకపోతే రైతు మరింత నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఇటీవల మహబూబ్‌ నగర్‌ - జడ్చర్ల ప్రాంతంలో కురిసిన వర్షం దెబ్బతీసింది. రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిస్తూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన హమాలీ చార్జీలను క్వింటాలుకు రూ.25 నుంచి రూ.40 రైతు నుంచే వసూలు చేస్తున్నట్టు సమాచారం. ధాన్యాన్ని సేకరించడానికి 15 కోట్ల గోనె సంచులు అవసరం కాగా ప్రభుత్వం వద్ద 1.6 కోట్లు ఉన్నాయి. మరో ఆరు కోట్ల కోసం టెండర్లు పిలిచినట్టు అధికారులు ప్రకటించారు. కేంద్రం మూడు కోట్ల సంచులు సరఫరా చేస్తామని తెలిపినప్పటికీ అవి ఇంకా రానేలేదు. దీంతో కొనుగోళ్లకు అడ్డంకులు ఏర్పడుతున్నట్టు తెలుస్తున్నది. కొనుగోలు చేసిన రైతులకు రసీదు ఇచ్చిన తర్వాత జమాలో ఐదు నుంచి 10 శాతం తగ్గిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా తగ్గించిన రైతుల సొమ్ము ఉదాహరణకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోనే రూ.10 కోట్ల వరకుంది. కొనుగోలు కేంద్రాలను పెంచడంతో పాటు సౌకర్యాలను కల్పించాలని పలు రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
సకాలంలో ప్రారంభించాలి .....టి.సాగర్‌
            ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రావడాన్ని ఆయన ఆహ్వానించారు. ఐకేపీ, సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించకుంటే అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.