Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మహిళలకు అస్వస్థత
నవతెలంగాణ- చిట్యాల
దొడ్ల డెయిరీ ఫాంలో అమ్మోనియం నైట్రేట్ లీక్కావడంలో ముగ్గురు మహిళలు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన సోమవారం నల్లగొండ చిట్యాల మండలం గుండ్రాంపెల్లిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గుండ్రాంపెల్లిలోని దొడ్ల డెయిరీ ఫాంలో పెరుగు ప్యాకెట్లను ప్యాకింగ్ చేసే విభాగంలో అమ్మోనియం నైట్రేట్ అకస్మాత్తుగా లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు నైట్రేట్ను వాయువును పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.