Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంధకారంలో బాయిల్డ్‌ రైస్‌మిల్లు ఆపరేటర్స్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 26,2022

అంధకారంలో బాయిల్డ్‌ రైస్‌మిల్లు ఆపరేటర్స్‌

- ఉప్పుడు బియ్యం తీసుకోబోమన్న ఎఫ్‌సీఐ
- యాసంగిలో రా రైస్‌ సేకరించేందుకే సర్కారు నిర్ణయం
- బాయిల్డ్‌ మిషన్‌పై పని చేసే వారికి పని కరువు
- వారిని తొలగించేందుకు
సిద్ధమైన యాజమాన్యాలు
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
          రాష్ట్రంలో అత్యధికంగా వరి పండించే జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రైస్‌మిల్లులూ అదేస్థాయిలో ఉన్నాయి. ఎండాకాలంలో వచ్చే (యాసంగి) వరి పంటలో నూక ఎక్కువగా వస్తుందని పెద్దఎత్తున ఆ ధాన్యాన్ని బాయిల్డ్‌ చేసి ఉప్పుడు బియ్యంగా మార్చే యంత్రాలు వెలిశాయి. సాధారణంగా రా రైస్‌మిల్లులో ధాన్యాన్ని ముడిబియ్యంగా మరపట్టించే ప్రక్రియలో ఉండే ఆపరేటర్ల కంటే బాయిల్డ్‌ మిషన్‌పై అదనంగా మరో ముగ్గురు, ఆపై నలుగురు వరకు పని చేస్తారు. ఇన్నాళ్లూ వారికి యాసంగి సీజన్‌లో చేతినిండా ఉండేది. ఇప్పుడు ఆ బాయిల్డ్‌ రైస్‌ను తీసుకోబోమని కేంద్రం, రా రైస్‌ మాత్రమే తీసుకుంటామన్న రాష్ట్ర సర్కారు నిర్ణయం నేపథ్యంలో బాయిల్డ్‌ మిల్లులకు పనిలేకుండా పోయింది. దీంతో ఆ మిషన్లపై పని చేసే ఆపరేటర్లను తొలగించేందుకు యజమానులు ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 2500వరకు ఉన్నాయి. బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లో 12000 మంది వర్కర్స్‌ పని చేస్తున్నారు.
          దశాబ్దాల కిందటే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఏర్పడ్డాయి.. యాసంగి సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేటప్పుడు బియ్యం చివరన విరిగిపోతుంది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు దశాబ్దాల కిందటే బాయిల్డ్‌ (ఉప్పుడు) బియ్యం విధానం అమల్లోకి వచ్చింది. ధాన్యాన్ని నానబెట్టి, నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి, ఆరబోసి ఆ తరువాత మిల్లింగ్‌ చేస్తారు. ఇందుకు మిల్లులో ప్రత్యేక యంత్రాలు అమర్చుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాదికేడాది అదనంగా యాసంగి దిగుబడి లక్షల మెట్రిక్‌ టన్నుల్లో దిగుబడి వస్తోంది. పదేండ్ల కిందటి వరకు 4లక్షల మెట్రిక్‌ టన్నులు కూడా దాటని యాసంగి ధాన్యం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18.5లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 20లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనీసంగా 150వరకు కొత్తగా బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఏర్పడ్డాయి.
ప్రశ్నార్థకంగా ఆపరేటర్ల పరిస్థితి
          ప్రస్తుతం బాయిల్డ్‌ బియ్యం తీసుకోబోమని ఎఫ్‌సీఐ తెగేసి చెప్పింది. దీంతో చేసేదేమీ లేక రాష్ట్ర సర్కారు కూడా మిల్లుల నుంచి యాసంగి ధాన్యం నేరుగా మరపట్టించి రా రైస్‌ తీసుకుంటామని సూచించింది. దీంతో మిల్లుల్లో బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తికి బిగించిన అదనపు యంత్రాలు బాయిలింగ్‌, డ్రెయింగ్‌ ఆపరేషన్లలో పనిచేస్తున్న ముగ్గురు నుంచి నలుగురు ఆపరేటర్లకు పని లేకుండా పోతుంది. వారిని తొలగించేందుకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లాలోని 13 మిల్లుల్లో 28మందిని తొలగించారు. దీంతో ఆందోళన చెందుతున్న బాయిల్డ్‌ మిల్లు ఆపరేటర్లు తమను ఇతర పనుల్లో వాడుకోవాలని, ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
కలెక్టరేట్‌ ఎదుట ఆపరేటర్ల ధర్నా
          కరీంనగర్‌ జిల్లా రైస్‌ అండ్‌ ఆయిల్‌, సీడ్‌ మిల్స్‌ ఆపరేటర్స్‌ అండ్‌ లేబర్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కరీంనగర్‌ జిల్లా పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లో పని చేస్తున్న ఆపరేటర్ల ఉపాధి రక్షణ, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం -1979 అమలు, కార్మికులు, సౌకర్యాలు రిజిస్టేషన్స్‌, లైసెన్సింగ్‌ తదితర అంశాలు అమలు చేయాలని కోరారు. ధర్నాలో యూనియన్‌ అధ్యక్షులు చల్ల లక్ష్మణ్‌, ఉపాధ్యక్షులు సిహెచ్‌ భద్రయ్య, ప్రధాన కార్యదర్శి గట్టు సతీష్‌తోపాటు సుమారు 100 మంది కార్మికులు పాల్గొన్నారు.

కనీస సౌకర్యాలు, పని భద్రత కల్పించాలి
          పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు సహా మిల్లులో పని చేసే ప్రతి కార్మికునికీ పని భద్రత కల్పించాలి. కార్మికుల వివరాలు పక్కాగా నమోదు చేసి రికార్డులు నిర్వహించాలి. వలస కార్మికుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి.
- గట్టు సతీష్‌- రైస్‌మిల్లు ఆపరేటర్ల యూనియన్‌ (సీయూటీయూ)
ప్రధాన కార్యదర్శి

బాయిల్డ్‌ మిల్లు ఆపరేటర్లందరికీ పని కల్పించాలి
          బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ తేల్చి చెప్పింది. రా రైస్‌ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈ నిర్ణయంలో పారాబాయిల్డ్‌ మిల్లుల్లోని బాయిలింగ్‌, డ్రెయింగ్‌ ఆపరేషన్‌ పని చేసే ముగ్గురిని ఆయా మిల్లులు తొలగిస్తున్నాయి. వారి ఉపాధిని కాపాడి, వారికీ పని కల్పించాలి.
- యు.శ్రీనివాస్‌- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు

తొలగించిన ఆపరేటర్లను తిరిగి తీసుకోవాలి
          20ఏండ్లుగా పని చేస్తున్న ఆపరేటర్లను ఆయా మిల్లుల యజమానులు తొలగించారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల కార్మికుల స్థానంలో అవసరమైన చోట స్థానికులకే అవకాశం కల్పించాలి. 1979వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలి.
- జి.ముకుందరెడ్డి- ఆపరేటర్ల సంఘం
(సీఐటీయూ) గౌరవాధ్యక్షులు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.