Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రూప్‌-1 తొలి నోటిఫికేషన్‌ జారీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 27,2022

గ్రూప్‌-1 తొలి నోటిఫికేషన్‌ జారీ

- భారీస్థాయిలో 503 పోస్టుల భర్తీ
- తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో రాతపరీక్షలు
- మే 2 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
- జులై/ఆగస్టులో ప్రిలిమ్స్‌, నవంబర్‌/డిసెంబర్‌లో మెయిన్స్‌
- టీఎస్‌పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానానికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ సోమవారం మార్గదర్శకాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ బి జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎస్‌పీఎస్సీ సభ్యులు రమావత్‌ ధన్‌సింగ్‌, బి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్‌ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్‌ సత్యనారాయణ, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా 503 పోస్టుల భర్తీకి అనితా రామచంద్రన్‌ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2011లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత భారీసంఖ్యలో 503 పోస్టులతో తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల కావడం విశేషం. ఆన్‌లైన్‌లో వచ్చేనెల రెండో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. వాటిని సమర్పించేందుకు తుదిగడువు వచ్చేనెల 31వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలు లేకుండానే రాతపరీక్ష ఆధారంగా నియామకాల ప్రక్రియ ఉంటుందని వివరించారు. ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్‌ విధానంలో 33 జిల్లాల్లోనూ జులై/ఆగస్టులో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించామని తెలిపారు. మెయిన్స్‌ను రాతపరీక్ష ఆధారంగా నవంబర్‌/డిసెంబర్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ఓటీఆర్‌ ఉంటేనే దరఖాస్తు చేసేందుకు అవకాశముంటుందనీ, కొత్త జోనల్‌ విధానం ప్రకారం అభ్యర్థుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలని కోరారు. గ్రూప్‌-1లో క్రీడలు, ఈడబ్ల్యూఎస్‌ కోటాను మొదటిసారిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు పోస్టులకు అనుగుణంగా రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం 1:50 నిష్పత్తి చొప్పున ప్రతి మల్టీజోన్‌ నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో రాతపరీక్షలుంటాయని తెలిపారు. మెయిన్స్‌కు సంబంధించి ఈ-ప్రశ్నాపత్రాన్ని రూపొందించడంతోపాటు ప్రక్రియ వేగవంతమయ్యేలా డిజిటల్‌ మూల్యాంకనం విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని ప్రకటించారు. అభ్యర్థుల జవాబుపత్రాలను స్కానింగ్‌ చేసి వాటిని కంప్యూటర్‌లోకి అప్‌లోడ్‌ చేసి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేపడతామని తెలిపారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
గ్రూప్‌-1 పోస్టుల వివరాలు
           డిప్యూటీ కలెక్టర్‌-42, డీఎస్పీ-91, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌-48, ఆర్టీవో-4, డీపీవో-5, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌-5, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌-2, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌-8, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెం డెంట్‌-26, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 -41, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సోషల్‌ వెల్ఫేర్‌)-3, డిస్ట్రిక్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-5, డిస్ట్రిక్ట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌- 2, డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయీమెంట్‌ ఆఫీసర్‌-2, అడ్మిని స్ట్రేటివ్‌ ఆఫీసర్‌, లే సెక్రెటరీ, ట్రెజరర్‌ గ్రేడ్‌-2 (వైద్య ఆరోగ్య శాఖ)-20, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ లెక్చరర్‌ (ట్రెజరీలు, అకౌంట్స్‌ సర్వీసులు)-38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40, ఎంపీడీవో-121.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.