Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కెేసీఆర్‌ బాధ్యతారాహిత్యంతోనే రైతు ఆత్మహత్యలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 27,2022

కెేసీఆర్‌ బాధ్యతారాహిత్యంతోనే రైతు ఆత్మహత్యలు

- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే 6న వరంగల్‌లో సభ
- అజరులాంటి సైకో మంత్రికి గుణపాఠం చెప్పాలి
- పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలి :
- ఖమ్మం కాంగ్రెస్‌ ఆఫీసులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
- ప్రెస్‌మీట్‌ సందర్భంగా తోపులాట..
- డోర్ల అద్దాలు ధ్వంసం.. ఓ కార్యకర్తకు గాయాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
            వరి వేయొద్దన్న ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం కారణంగానే వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (టీపీసీసీ) అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. విపక్ష నేతలపై పీడీ యాక్టులు, కేసులు పెట్టి వేధిస్తున్న మంత్రి పువ్వాడ అజరు ఓ సైకో అని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో మే 6న సాయంత్రం 6 గంటలకు రైతుసంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభ విజయవంతానికి సన్నాహక సమావేశంలో భాగంగా రేవంత్‌రెడ్డి మంగళవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంట ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిందిపోయి వరి వేస్తే రైతుబంధు కట్‌ చేస్తామని, కొనుగోలు కేంద్రాలు తెరిచేది లేదని సీఎం హెచ్చరించారన్నారు. దాంతో రైతులు తక్కువ ధరకు దళారులు, మిల్లర్లకు అమ్ముకున్నారని, వారికి బోనస్‌తో పాటు ఇప్పుడు కొనుగోలు చేస్తున్న ధాన్యానికి రూ.1960 ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని, దీనికి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్టు తెలిపారు. . రైతులకు కష్టం వచ్చినప్పుడల్లా పోరాటాల్లో ఉన్న ఎర్రజెండా నీడన ఎంతో చైతన్యవంతమైన జిల్లాగా ఖమ్మం గణతికెక్కిందన్నారు. రైతులకు బేడీలు వేసి నడిపించిన టీఆర్‌ఎస్‌ను తిప్పికొట్టిన చరిత్ర కూడా ఖమ్మం జిల్లాదే అన్నారు. అలాంటి ఈ జిల్లాలో పువ్వాడ అనే ఓ సైకో మంత్రి ఉన్నారనీ, ఆయన ప్రోత్సాహంతోనే విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలైన ముస్తఫా, మిక్కిలినేని నరేంద్ర, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్‌పై పోలీసులు పీడీ యాక్టులు, అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టేనని, మాడి మసైపోతావని మంత్రి అజరును హెచ్చరించారు. ఓ యువకుని మరణానికి కారణమైన అజరు.. కమ్మకులాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. పువ్వాడ అజరు అక్రమాలన్నింటిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. అజరుకు చెందిన మమత మెడికల్‌ కళాశాల సిబ్బందికి సగం జీతమే ఇస్తున్న విషయమై విచారణ చేయాలన్నారు. మెడికల్‌ కాలేజీ విషయంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడకపోతే సీబీఐ విచారణకు స్వయంగా లేఖ రాయాలని పువ్వాడ అజరుకు సవాల్‌ విసిరారు. కేటీఆర్‌, పువ్వాడ అజరు తోడు దొంగలని విమర్శించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఏఐసీసీ నేతలు అంజన్‌కుమార్‌, కుసుమకుమార్‌, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు మద్ది శ్రీనివాసరెడ్డి, రాయల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్‌, మహ్మద్‌ జావీద్‌, బెల్లం శ్రీనివాస్‌, మారం కరుణాకర్‌రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
తోపులాట.. గాయాలు
            జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లోని సమావేశ మందిరంలో రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. విలేకరుల సమావేశానికి హాజరయ్యేందుకు రేవంత్‌రెడ్డి, భట్టి, రేణుకాచౌదరి తదితర నేతలు ఒక్కసారిగా లోనికి రావడంతో కార్యకర్తలు వారి వెంటే వచ్చారు. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు డోర్లు మూశారు. అయినప్పటికీ కార్యకర్తలు ఆగకుండా ఒక్కసారిగా బలంగా తోయడంతో డోర్‌ గ్లాసులు పగిలిపోయాయి. ఒకరినొకరు బలంగా తోసుకోవడంతో పగిలిన గాజు పెంకులు కోసుకుపోయి ఓ కార్యకర్త చేతికి తీవ్ర గాయమైంది. కార్యకర్తలను నిలువరించే క్రమంలో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ చొక్కా కాలర్‌ను ఓ కార్యకర్త పట్టుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. విలేకరుల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌, రేణుకాచౌదరి మంత్రి పువ్వాడ అజరుపై నిప్పులు చెరిగారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.