Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హమాలీ బిల్లులకు ఎగనామం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 29,2022

హమాలీ బిల్లులకు ఎగనామం

- మూడేండ్లుగా అందని హమాలీ డబ్బులు
- ఉమ్మడి జిల్లాలో రూ.2.80 కోట్లు పెండింగ
- కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీల పెంపు
- రైతులపై ఆదనపు భారం
-  ప్రభుత్వం చెల్లించాల్సిన వాటిలో కోతలు
-  కేంద్రం నిబంధనల మేరకే హమాలీ చెల్లింపులు నిలిపివేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
          కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన వరి ధాన్యం హమాలీ చార్జీల చెల్లింపులకు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మూడేండ్లుగా రైతులకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకుండా నిలిపివేసింది. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు చార్జీల పెంపుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం హమాలీ బిల్లుల చెల్లింపులపై సడిసప్పుడు లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ.. కేంద్రం నిబంధనల మేరకే హమాలీ చార్జీలు నిలిపివేసినట్టు చెబుతుంది. కేంద్రం దయదలిస్తే తప్ప ఇప్పట్లో రైతులకు హమాలీ బిల్లు ఇచ్చేది లేదంటూ అధికారులు తెగేసి చెబుతున్నారు. దాంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పక్కన పెడితే.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు చార్జీలు తడిసి మోపడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
          ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వరి సాగు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి హమాలీ బిల్లుల కోసం మూడేండ్లుగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 74,255 మందికి గాను హమాలీ బిల్లుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.2 కోట్ల 80 లక్షలు రావాల్సి ఉంది. రంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 2020-21 వానాకాలంలో 2,698 మంది రైతుల నుంచి 11,200 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా రూ.6,16,000 హమాలీ బిల్లులు చెల్లించాల్సి ఉంది. యాసంగిలో 74,278 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి 15,283 మంది రైతులకు రూ.40,85,291, 2021-22 వానాకాలం సీజన్‌లో 9,839 మంది రైతుల నుంచి ప్రభుత్వం 43,564 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా ఇందుకుగాను హమాలీ చార్జీల కింద రూ.73,96,020 చెల్లించాల్సి ఉన్నది. ఇక వికారాబాద్‌ జిల్లాలో గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లలో 37,659 మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యం 1,89,689 మెట్రిక్‌ టన్నులు, కాగా ఇందుకు గాను రూ. కోటి 43లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది వానాకాలంలో 1 లక్ష 14 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 18779 మంది రైతుల నుంచి సేకరించారు. ఇందుకు హమాలీ చార్జీలు ప్రభుత్వం తమ వాటా కింద రూ.62,97,445 చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.
కేంద్రం అమోదంతోనే బిల్లులు చెల్లింపు
          కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నింపి కాంటా వేయడం, లారీలకు ఎత్తడానికి హమాలీలకు రైతుల నుంచి క్వింటాకు రూ. 25 నుంచి 30 చెల్లిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం వాటా కింద రైతులకు రూ. 5.50 చొప్పున చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ చెల్లింపులకు స్వస్తి చెప్పింది. 2019 నుంచి ప్రభుత్వం హమాలీ బిల్లులు నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే.. కేంద్రం మీద.. కేంద్రాన్ని అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వం మీద సాకులు చెప్పుకోవడం తప్ప రైతులకు న్యాయం జరిగింది లేదు. కేంద్రం నిబంధనల మేరకు రైతులకు చెల్లించాల్సిన హమాలీ బిల్లులు నిలిపివేయడం జరిగిందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఏడాదయినా వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందని, కేంద్రం గైడ్‌లైన్స్‌ వస్తే తప్ప హమాలీ బిల్లు ఇవ్వడానికి లేదని అధికారులు తెగేసి చెప్పుతున్నారు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీ చార్జీలు పెరిగాయి. దాంతో రైతులపై అదనపు భారం పడుతుందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం వాటా కింద రైతులకు చెల్లించాల్సిన హమాలీ చార్జీలను పునరుద్ధరించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
హమాలీ బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి
            ఏండ్ల కొద్దిగా పేరుకుపోయిన హమాలీ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ప్రస్తుతం పెరిగిన ధరల మేరకు హమాలీ చార్జీలు పెరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయ ఖర్చులు గతం కంటే రెండింతలైనవి. రైతులపై అదనపు భారం పడుతుంది. ప్రభుత్వం గతంలో మాదిరిగా హమాలీ బిల్లులు చెల్లించి రైతులను ఆదుకోవాలి.
-మదుసుధన్‌ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం,
  రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.